సప్పర్ల ఘాట్‌లో నిలిచిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

సప్పర్ల ఘాట్‌లో నిలిచిన ఆర్టీసీ బస్సు

Dec 25 2025 8:09 AM | Updated on Dec 25 2025 8:09 AM

సప్పర్ల ఘాట్‌లో నిలిచిన ఆర్టీసీ బస్సు

సప్పర్ల ఘాట్‌లో నిలిచిన ఆర్టీసీ బస్సు

ఇంజిన్‌లో సాంకేతిక లోపం

పొగలు రావడంతో నిలిపివేసిన డ్రైవర్‌

ఇబ్బందులు పడిన ప్రయాణికులు

సీలేరు: విశాఖ– భద్రాచలం అల్ట్రా డీలక్స్‌ బస్సు ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో బుధరవారం ఉదయం సప్పర్ల ఘాట్‌రోడ్డులో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విశాఖపట్నం నుంచి సీలేరు, చింతూరు మీదుగా భద్రాచలం వెళ్లాల్సిన ఈ బస్సు గూడెంకొత్తవీధి మండలం సప్పర్ల ఘాట్‌ రోడ్డు వద్దకు వచ్చేసరికి ఇంజన్‌లోంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అపమ్రత్తమైన డ్రైవర్‌ బస్సును వెంటనే నిలిపివేశాడు. ఈ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ధార కొండ ప్రాంతానికి చెందిన వారు కొంత మంది ద్విచక్రవాహనంపై వెళ్లిపోయారు. దీంతో ఆర్టీసీ అధికారులు నర్సీపట్నం డిపోకు చెందిన బస్సును రప్పించి సీలేరుకు చెందిన ప్రయాణికులను గమ్యానికి చేర్చారు. ఈ మధ్యకాలంలో అంతర్రాష్ట్ర రహదారి ఘాట్‌ రోడ్లో తరచూ విశాఖపట్నం డిపో చెందిన బస్సులు మొరాయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఇబ్బందులు తలెత్తకుండా కండీషన్‌లో ఉన్న బస్సులను నడపాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement