కొనసాగుతున్న చలి తీవ్రత
● జి.మాడుగులలో 4.0 డిగ్రీలఅత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంచు, చలి తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. జి.మాడుగులలో బుధవారం 4.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. ముంచంగిపుట్టులో 6.7 డిగ్రీలు, అరకులోయలో 8.6 డిగ్రీలు, పెదబయలులో 9.0 డిగ్రీలు, చింతపల్లిలో 9.5 డిగ్రీలు, పాడేరులో 9.9 డిగ్రీలు, హుకుంపేటలో 10.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్టు ఆయన పేర్కొన్నారు.


