
మేధోసంపత్తి హక్కులపై అవగాహన
చింతపల్లి: విద్యార్థులు మేధొసంపత్తి హక్కులపై అవగాహన కలిగి ఉండాలని హైకోర్టు న్యాయవాది వై.బాబ్జి అన్నారు. డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయభారతి ఆధ్వర్యంలో సోమవారం మేథోసంపత్తి హక్కులు ఆవిష్కరణలపై రెండురోజులు జాతీయ సెమినార్ను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఆయన హాజరై ప్రసింగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో మేథోసంపత్తి అనేది మానవ మేథస్సు యొక్క కనిపించని సృష్టిని కలిగి ఉన్న ఆస్తి వర్గం అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్ డాక్టర్ పండుపడాల్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ మేథోసంపత్తి మెదడుతో సృష్టించబడిన వాటికి సంబంధించిదన్నారు. ఈ సందర్భంగా అతిథులను సన్మానించారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస పాత్రుడు, అధ్యాపకులు పాల్గొన్నారు.