
దుఃఖంలోనూ ఆదర్శం
తల్లి నేత్రాలు దానం
కంచరపాలెం (విశాఖ): పు ట్టెడు దుఃఖంలోనూ మానవత్వాన్ని చాటుకున్న ఘట న విశాఖలో జరిగింది. త మ తల్లి మరణంతో తీవ్ర శోకంలో ఉన్నప్పటికీ ఆమె కళ్లను దానం చేసి ఆ కుటుంబం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గండిబోయిన ఈశ్వరమ్మ (75) ఆదివారం అర్ధ రాత్రి గుండెపోటుతో కేజీహెచ్లో మృతి చెందారు. అంత దుఃఖంలోనూ ఈశ్వరమ్మ భర్త అ ప్పారావు, కుమారులు అప్పలరాజు, సూ ర్యచంద్రరావు, కుమార్తె లక్ష్మి ఆమె కళ్లను దానం చేయా లని నిర్ణయించుకున్నారు. మొహిసిన్ ఐ బ్యాంక్ వారు వచ్చి కంటి రెటీనాను సేకరించారు.