
మరణించి మరో ఇద్దరికి వెలుగునిచ్చి..
పెందుర్తి : అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధురాలి నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకుంది ఓ కుటుంబం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తాడివానిపాలెం అంబేడ్కర్కాలనీకి చెందిన రాజాన అచ్చియ్యమ్మ(90) ఆరోగ్యం క్షీణించి శనివారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో పెందుర్తికి చెందిన సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి దాడి శ్రీనివాస్, స్థానిక పెద్ద ఎం.సింహాచలం మృతురాలి కుటుంబ సభ్యులను నేత్రదానానికి ఒప్పించారు. కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వెంటనే అక్కడకు చేరుకున్న ఎల్వీ ప్రసాద్ సారధ్యంలోని మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు అచ్చియ్యమ్మ నేత్రాలను సేకరించి సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు.

మరణించి మరో ఇద్దరికి వెలుగునిచ్చి..

మరణించి మరో ఇద్దరికి వెలుగునిచ్చి..

మరణించి మరో ఇద్దరికి వెలుగునిచ్చి..