
క్రీడల్లో గెలుపోటములు సహజం
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అనంతగిరి(అరకులోయటౌన్): క్రీడల్లో గెలుపోటములు సహజమని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీ దిగువశోభ గ్రామంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని చెప్పారు. అనంతరం ఎగువశోభ సచివాలయాన్ని సందర్శించి, రికార్డులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దిసరి గంగరాజు, సర్పంచ్లు కొర్రా సింహాద్రి, మొష్యా, వార్డు సభ్యులు లక్ష్మణ్, ప్రసాద్, క్రీడాకారులు పాల్గొన్నారు.