65 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

65 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Apr 24 2025 8:21 AM | Updated on Apr 24 2025 8:21 AM

65 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

65 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

అడ్డతీగల: మండలంలోని దుప్పులపాలెంలో ఓ ఇంటిలో నిల్వ ఉంచిన 65 బస్తాల (3,372 కిలోలు) ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని బుధవారం పట్టుకున్నట్టు తహసీల్దార్‌ కొమరం సూర్యారావు తెలిపారు. జీడి పిక్కలు కొనుగోలు చేసే దుప్పలపాలెంకి చెందిన ఒరిస్సై అనే ఓ వ్యాపారి ప్రజల వద్ద నుంచి భారీగా పీడీఎస్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి, రవాణాకు సిద్ధం చేసినట్టు సమాచారంరావడంతో దాడులు నిర్వహించినట్టు చెప్పారు. బియ్యం సీజ్‌ చేసి, ఆ వ్యాపారిపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. స్వాఽధీనం చేసుకున్న బియ్యాన్ని అడ్డతీగలలోని మండల స్టాక్‌ పాయింట్‌కి తరలించినట్టు చెప్పారు. పీడీఎస్‌ బియ్యాన్ని ఎవరైనా కొనుగోలు చేసినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement