గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టాలి

Apr 20 2025 2:04 AM | Updated on Apr 20 2025 2:04 AM

గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టాలి

గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టాలి

ఎస్పీ అమిత్‌ బర్దర్‌

చింతపల్లి: జిల్లాలో గంజాయి నిర్మూలనకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ అన్నారు. మండలంలో అన్నవరం పోలీసు స్టేషన్‌ను ఏఎస్పీ నవజ్యోతి మిశ్రాతో కలసి శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. నూతనంగా నిర్మిస్తున్న పోలీసు స్టేషన్‌ భవనాన్ని పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోగల ఈపోలీసు స్టేషన్‌ పరిధి ఎక్కువగా ఉండడంతో గంజాయి రవాణాకు అవకాశం ఉందని, దానిని నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా యువ త ఎటువంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి అవకాశాలను గిరిజన రైతులు,యువత సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీఐ వినోద్‌ బాబు,ఎస్‌ఐ వీరబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement