అవగాహన సదస్సులో మాట్లాడుతున్న రఘనాథ్
అరకులోయ రూరల్: అవగాహనతోనే చట్టాలు, హక్కులను పరిరక్షించుకోగలమని నేషనల్ కన్సూమర్ ఆర్గనైజేషన్ జాతీయ కార్యదర్శి సమర్డి రఘునాథ్ తెలిపారు. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో చట్టాలు, హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో మోసాలను అరికట్టాలని, కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకూ రసీదు పొందాలని చెప్పారు. నిత్యావసర సరకులతో పాటు అన్ని రకాల వస్తువుల నాణ్యతాప్రమాణాలను పరిశీలించే విధంగా వినియోగదారులు చైతన్యవంతులు కావాలన్నారు. అప్పుడే మోసాలను అరికట్టవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో మర్రి సత్యనారయణ, డీటీ దొన్ను తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ కన్సూమర్ ఆర్గనైనేషన్
జాతీయ కార్యదర్శి రఘనాథ్


