ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు గతేడాదితో పోల్చితే ఈసారి వంద సీట్లు పెరిగాయి. ఈనెల 31 వరకు అడ్మిషన్లకు గడువు ఉంది. మరో వంద వరకు అడ్మిషన్లు జరిగే అవకాశం ఉంది. కళాశాలల్లో అన్ని మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్య అందుతుంది. కళాశాలల పర్యవేక్షణ కోసం కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. నెలలో రెండుసార్లు తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సారి మంచి ఫలితాలు సాధిస్తాం.
– జాదవ్ గణేష్ కుమార్, డీఐఈవో
ప్రభుత్వ కళాశాలలకు పెరిగిన ఆదరణ..
జిల్లాలోని నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గతేడాదితో పోల్చితే ఈసారి అడ్మిషన్లు పెరిగాయి. కళాశాలలు ప్రారంభంకు ముందే అడ్మిషన్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్య అందుతుంది. త్వరలో స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయి. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరాలి.
– సంగీత,
ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్


