అర్హులా... కాదా | - | Sakshi
Sakshi News home page

అర్హులా... కాదా

Apr 26 2025 12:08 AM | Updated on Apr 26 2025 12:08 AM

అర్హులా... కాదా

అర్హులా... కాదా

● ‘యువ వికాసం’ దరఖాస్తుల పరిశీలన షురూ ● క్షేత్రస్థాయిలోకి కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు ● మే 2 వరకు గడువు

కై లాస్‌నగర్‌: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలకు రూ.4లక్షల వరకు ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌తో పాటు ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల ద్వారా ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులు స్వీకరించింది. ఈ నెల 14వ తేదీతో గడువు ముగిసింది. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 34,109 అప్లికేషన్లు అందాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఎంపిక చేసిన లబ్ధిదారులకు జూన్‌ 2న సబ్సిడీ రుణాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా దృష్టి సారించింది. మండలాల వారీగా రుణ మంజూరు యూనిట్ల టార్గెట్లను ఖరారు చేయడంతో పాటు అర్హుల గుర్తింపునకు క్షేత్రస్థాయిలో సర్వేకు ఆదేశించింది.

క్షేత్రస్థాయిలోకి కార్యదర్శులు,

వార్డు ఆఫీసర్లు

కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశాల మేరకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు రంగంలోకి దిగారు. తమకు అందిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపడుతున్నారు. దరఖాస్తుదారులు ప్రభుత్వమందించే సాయానికి అర్హులా.. కాదా, వారు గ్రామంలోనే ఉంటున్నారా, దరఖాస్తు చేసుకున్న యూనిట్‌ మంజూరుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, వనరులు వారి వద్ద ఉన్నాయా అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. అర్హులని నిర్ధారించుకున్న వారి వివరాలను ఆయా శాఖల అధికారులతో పాటు సంబంధిత బ్యాంకు మేనేజర్లకు ఎప్పటికప్పుడు నివేదిక అందజేస్తున్నారు. అర్హుల గుర్తింపునకు సంబంధించి మే 2వరకు గడువుగా నిర్ణయించారు. ఈ క్రమంలో పరిశీలన ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కాగా రెండు, మూడు రోజుల్లో వేగవంతమయ్యే అవకాశముంది.

దరఖాస్తుల వెల్లువ..

స్వరాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల తర్వాత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుకు రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు యూనిట్ల ఆధారంగా సబ్సిడీ సాయం అందించాలని భావిస్తోంది. అ యితే జిల్లా వ్యాప్తంగా 34వేలకు పైగా దరఖాస్తులు అందాయి. అత్యధికంగా బీసీలు 18,009 మంది దరఖాస్తు చేసుకోగా ఈబీసీలు 610, ఎస్సీలు 9,643 , మైనార్టీల్లో ముస్లింలు 5,791, క్రిస్టియన్లు 56 చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. ఇలా మండలాల వారీగా అందిన దరఖాస్తుల ఆధారంగా రుణ టార్గెట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీ సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఆ లక్ష్యాల వివరాలతో పాటు లబ్ధిదారుల ఎంపికకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మండలాల వారీ గా ఎంపీడీవోలకు అందజేశారు. వారు తమ పరి ధిలోని యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి ఆయా శాఖలకు అందించాల్సి ఉంటుందని అధి కారులు తెలిపారు. ఈ ప్రక్రియ మే నెలాఖరు నా టికి పూర్తికానుందని వెల్లడించారు.

అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం

రాజీవ్‌ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల గుర్తింపు కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో అర్హుల గుర్తింపు సర్వే ప్రారంభించారు. మండలాల వారీగా రుణ యూనిట్ల లక్ష్యాలను కూడా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఖరారు చేశాం. మండల స్థాయి అధికారులు లబ్ధిదారుల ఎంపిక చేసి జిల్లా కమిటీకి పంపించాల్సి ఉంటుంది. జిల్లా కమిటీ పరిశీలన అనంతరం లబ్ధిదారుల తుది ఎంపిక ఉంటుంది.

– కే రాజలింగు,

జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement