
ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి
● డీఎస్పీకి సీపీఐ నాయకుల వినతి
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన చౌక్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్ కోరారు. శుక్రవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య, ఎస్ఈ కార్యాలయ డీఈ లను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ చౌక్, ఆర్టీసీ బస్టాండ్ ఎదుట, వినాయక చౌక్, నేతాజీ చౌక్, పంజాబీ చౌక్, తిరుమల పెట్రోల్ పంపు వద్ద గల బీటీ రోడ్లను విస్తరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు ప్రమాదాలకు గురై ప్రాణా లు కోల్పోకుండా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ మొయిజ్, ఏఐటీయూసీ నాయకులు కాంతారావు, ఆనంద్, రాజేశ్వర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.