
రౌడీలు ప్రవర్తన మార్చుకోకపోతే పీడీయాక్ట్
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్టౌన్: రౌడీలు ప్రవర్తన మార్చుకోకపోతే పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గురువారం ఆదిలాబాద్ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో రౌడీషీట్లు నమోదైన వారితో రౌడీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీయిజం చేస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తూ అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తామన్నారు. సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీషీట్లు తొలగిస్తామన్నారు. ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం లాంటివి మానుకోవాలని సూచించారు. నేరాలు లేని సమాజాన్ని తయారు చేయడానికి జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీఐలు బి.సునీల్ కుమార్, సీహెచ్ కరుణాకర్రావు, డి.సాయినాథ్, కె.ఫణింధర్, తదితరులు పాల్గొన్నారు.
పదోన్నతితో మరింత బాధ్యత
ఆదిలాబాద్టౌన్: పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన పది మంది కానిస్టేబుళ్లకు గురువారం పోలీసు కార్యాలయంలో చి హ్నాలను అలంకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొ త్తం 28 మందికి పదోన్నతి లభించడం, అందులో ఆదిలాబాద్ జిల్లా నుంచి పది మంది ఉండటం సంతోషంగా ఉందన్నారు. పదోన్నతి పొందిన వారిలో నిర్మల్ జిల్లాకు జి.సుభాష్, ఇ.సుదర్శన్, ఏ.ప్రకాశ్రెడ్డి, ఎం.వీరప్రకాశ్రెడ్డి, బి.గంగారెడ్డి, జగిత్యాల జిల్లాకు శివాజీ, రమణ, వెంకటి, లక్ష్మణ్రావు, వెంకటరమణను కేటాయించినట్లు తెలిపారు.