
● ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో పరిస్థితి ● ప్రథమ సంవత్సరం
ఆదిలాబాద్టౌన్: ఇంటర్మీడియెట్ ఫలితాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం విడుదల చేశారు. జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ఫలితాలు పడిపోగా, ద్వితీయ సంవత్సరం కొంత మెరుగైంది. ఫస్టియర్లో జిల్లా రాష్ట్రస్థాయిలో 27వ స్థానంలో నిలువగా, సెకండియర్లో 12వ స్థానం దక్కింది. మొత్తంగా ఈ సారి బాలుర కంటే బాలికలే పైచేయిగా నిలిచారు.
ఫస్టియర్.. 9నుంచి 27వ స్థానానికి డౌన్
ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ఫలితాలు గతంతో పోల్చితే దారుణంగా పడిపోయాయి. గతేడాది రా ష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలవగా,ఈసారి ఏకంగా 27వ స్థానానికి దిగజారింది.
● జనరల్ కోర్సులో 8,093 మంది పరీక్షకు హాజరు కాగా, 4,295మంది హాజరయ్యారు. 53.07 ఉత్తీ ర్ణత శాతం నమోదైంది. గతేడాదితో పోల్చితే ఈసారి 8.43 శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఇందులో బాలురు 4,033 మంది పరీక్షకు హాజరు కాగా, 1,658 ఉత్తీర్ణత సాధించారు. 41.11 ఉత్తీర్ణత శా తం నమోదైంది. బాలికలు 4,060 మంది పరీక్ష కు హాజరు కాగా, 2637 మంది పాస్ అయ్యారు. 64.95 ఉత్తీర్ణత శాతం నమోదైంది.
● ఒకేషనల్ కోర్సులో 1013 మంది పరీక్షకు హాజ రుకాగా, 672 మంది ఉత్తీర్ణత సాధించారు. 66.34 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బా లురు 421 మంది పరీక్షకు హాజరు కాగా, 252 మంది పాసయ్యారు. 59.86 శాతం ఉత్తీర్ణత న మోదైంది. బాలికలు 592 మంది పరీక్షకు హాజ రు కాగా, 420 మంది ఉత్తీర్ణులయ్యారు. 70.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రస్థాయిలో ఒకేషనల్ కోర్సులో జిల్లాకు 3వ స్థానం దక్కింది.
ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు ఇలా..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతంతో పోల్చితే ఈ సారి మెరుగైన ఫలితాలు సాధించారు.
● ద్వితీయ సంవత్సరంలో తలమడుగు జూనియ ర్ కళాశాల విద్యార్థులు 87.88 శాతం ఉత్తీర్ణులై ప్రథమ స్థానంలో నిలిచారు. బేలలో 85 శాతం, తాంసిలో 80 శాతం, గుడిహత్నూర్లో 75.17 శాతం, ఇంద్రవెల్లి 71.68 శాతం, బజార్హత్నూర్లో 70.65, ఇచ్చోడలో 69.16, బోథ్లో 67.09 శాతం, నేరడిగొండ 64.93, ఆదిలాబాద్ ప్రభు త్వ బాలికల జూనియర్ కళాశాల 61.64 శాతం, నార్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 61.33, ఉట్నూర్ జూనియర్ కళాశాలలో 56.56 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల 44.96 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది.
● ప్రథమ సంవత్సరం ఫలితాల పరంగా చూస్తే తలమడుగు 81.08 శాతం, తాంసి78.32శాతం, గుడిహత్నూర్ 75.61శాతం, చివరి వరుసలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల 30.65 శాతం, ఉట్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 22.52, అత్యల్పంగా ఇంద్రవెల్లి జూనియర్ కళా శాల విద్యార్థులు 18.97శాతం ఉత్తీర్ణులయ్యారు.
మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ..
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి నిర్వహించనున్నట్లు డీఐఈవో జాదవ్ గణేశ్ కుమా ర్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఈనెల 23 నుంచి 30 వరకు చెల్లించవచ్చని తెలిపారు. రీవెరిఫికేషన్ కోసం ప్రతీ పేపర్కు రూ.600 ఆన్లైన్లో చెల్లించాలని పేర్కొన్నారు. రీకౌంటింగ్కోసం పేపర్కు రూ.100 చొప్పు న చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇచ్చోడ/తలమడుగు/ఇంద్రవెల్లి:ఇచ్చోడ ప్రభు త్వ గిరిజన గురుకుల బాలికల కళాశాల విద్యార్థిని కావేరి బైపీసీలో 964 మార్కులు సాధించగా, స్నేహ ఎంపీసీలో 961 మార్కులు సాధించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని గుల్లె సాక్షి బైపీసీలో 960 మార్కులు సాధించగా, కేజీబీవీ విద్యార్థిని ప్రియాంక ఎంపీహెచ్ డబ్ల్యూ సెకండియర్లో 928 మార్కులతో ప్రతి భ కనబ రిచింది. గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్లో 90 శాతం, సెకండియర్లో వందశా తం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ గోవర్ధన్ తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో సెకండియర్లో వందశాతం ఉత్తీర్ణ త సాధించినట్లు ప్రిన్సిపాల్ నారాయణ పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని సాయిలింగి కేజీబీ వీలో సెకండియర్లో వందశాతం ఉత్తీ ర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ అర్చన తెలిపారు. ఇంద్రవెల్లి గురుకుల కళాశాలలో బైపీసీలో కే రంభ 977 మార్కులు, జే పాయల్ 962, రాజ్యలక్ష్మి 960, ఎంపీసీలో అన్నపూర్ణ 963 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ సంగీత తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి స్నేహ 467/470 మార్కులు సాధించింది. అలాగే పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఉర్దూ మీడి యం చదువుతున్న జోహ సదఫ్ బైపీసీలో 988 మార్కులు సాధించింది. ఇంగ్లీష్ మీడి యం బైపీసీ విద్యార్థి మసీర అస్రమ్ 977 మార్కులు, ఉర్దూ మీడియం ఎంపీసీలో మది హ మస్రత్ 934 మార్కులు, హెచ్ఈసీ ఉర్దూ మీడియంలో మహెక్ 933 మార్కులు సాధించారు. వీరిని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ సూర్యకుమార్లు విద్యార్థులను అభినందించారు.
సెకండియర్లో పెరిగిన ఉత్తీర్ణత
ఈ ఏడాది ఇంటర్ సెకండియర్లో మెరుగైన ఫలి తాలు సాధించాం. గతంతో పోల్చి తే 13 శాతం ఉత్తీర్ణత పెరిగింది. కలెక్టర్ రాజర్షిషా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. కరదీపికలు తయారు చేయించి అందించారు. ఈ మేరకు మంచి ఫలితాలను సాధించగలిగాం. వచ్చే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాం.
– జాదవ్ గణేశ్కుమార్, డీఐఈవో
సెకండియర్లో ఒక స్థానం మెరుగు..
ద్వితీయ సంవత్సరంలో గతేడాదితో పోల్చితే ఈసారి ఒక స్థానం మెరుగుపడింది. రాష్ట్రస్థాయిలో జిల్లా విద్యార్థులు 12వ స్థానంలో నిలిచారు.
జనరల్ కోర్సులో మొత్తం 7,978 మంది పరీ క్షకు హాజరు కాగా 5,550 మంది ఉత్తీర్ణులయ్యారు. 69.57 శాతం నమోదైంది. ఇందులో బాలురు 3,880 మంది పరీక్షకు హాజరు కాగా, 2376 మంది పాసయ్యారు. 61.24 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 4098 మంది పరీక్షలు రాయగా, 3174 మంది పాస్ అయ్యారు.77.45శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 13.15 శాతం ఉత్తీర్ణత పెరిగింది.
ఒకేషనల్ కోర్సులో 912 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 741 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 81.25 నమోదైంది. బాలురు 360 మందికి గాను 273 మంది పాస్ అయ్యారు. 75.83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 552 మందికి గాను 468 మంది పాస్ అయ్యారు. 84.78 ఉత్తీర్ణత శా తం నమోదైంది. గతేడాది రాష్ట్రస్థాయిలో 11వ స్థానంలో నిలవగా, ఈసారి 6 స్థానాలను మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకింది.

● ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో పరిస్థితి ● ప్రథమ సంవత్సరం

● ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో పరిస్థితి ● ప్రథమ సంవత్సరం

● ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో పరిస్థితి ● ప్రథమ సంవత్సరం

● ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో పరిస్థితి ● ప్రథమ సంవత్సరం

● ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో పరిస్థితి ● ప్రథమ సంవత్సరం

● ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో పరిస్థితి ● ప్రథమ సంవత్సరం

● ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో పరిస్థితి ● ప్రథమ సంవత్సరం