‘అంబేడ్కర్‌ విధానాలను కాలరాసిన కాంగ్రెస్‌’ | - | Sakshi
Sakshi News home page

‘అంబేడ్కర్‌ విధానాలను కాలరాసిన కాంగ్రెస్‌’

Apr 22 2025 12:15 AM | Updated on Apr 22 2025 12:15 AM

‘అంబేడ్కర్‌ విధానాలను కాలరాసిన కాంగ్రెస్‌’

‘అంబేడ్కర్‌ విధానాలను కాలరాసిన కాంగ్రెస్‌’

ఆదిలాబాద్‌: అంబేడ్కర్‌ విధానాలను అధికారంలో ఉన్న 60 ఏళ్లపాటు కాంగ్రెస్‌ కాలరాసిందని ఎంపీ గోడం నగేశ్‌, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్‌ ఆరోపించారు. అంబేడ్కర్‌ జయంత్యుత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లా సదస్సు నిర్వహించా రు. ముందుగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలకూ అంబేడ్కర్‌ చే సిన సేవలను ప్రజలకు వివరించాలని పిలుపుని చ్చారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగానికి పెద్దపీట వేసింది బీజేపీ మాత్రమేనని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్‌, నాయకులు అస్తక్‌ సుభాష్‌, పాయల్‌ శరత్‌ తదితరులున్నారు.

నివాళులర్పిస్తున్న ఎంపీ నగేశ్‌, మహేందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement