
అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాల నివారణ
ఆదిలాబాద్టౌన్: అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేశ్ కుమార్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగులను ఆదివారం సన్మానించారు. శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రమాదాల నివారణపై వారం పాటు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ రాజేశ్వర్, ఫైర్స్టేషన్ ఆఫీసర్ జగత్రామ్ తదితరులు పాల్గొన్నారు.