
బ్యాంక్ అధికారుల తప్పిదంతో రుణమాఫీ కాలే..
మహారాష్ట్ర బ్యాంక్ అధికారుల తప్పిదంతో 80 శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. దీంతో వారంతా నష్టపోయారు. అలాంటి వారికి మేలు చేయాలి. ఎట్టకేలకు ధరణి పీడ విరగడయ్యింది. చట్టాలు ఎవరు తయారు చేసినా అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులకు రైతు బంధు రావడం లేదు. ఇంటి స్థలాలు ఉన్నవారికే ఇందిరమ్మ పథకం
కింద ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేయాలి. అలాగే జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి. ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయాలి. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే