
గవర్నర్ను కలిసిన ఎంపీ గోడం నగేశ్
ఆదిలాబాద్: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మను ఎంపీ గోడం నగేశ్ గురువారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలోని సివిల్ కేసుల అధికారం ఐటీడీఎ పీవోలకే ఉంచేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర గిరిజన సలహా మండలి సమావేశం నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశాలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీతో పాటు సార్మెడి మెస్రం దుర్గు, పెందూర్ గోపి, పెందూర్ ప్రభాకర్, కొమురం విఠల్ రావు, అర్క వసంతరావు, గిరి, జమీర్, తదితరులు పాల్గొన్నారు.