ఈ ఫొటోలో కనిపిస్తోంది మావల మండలం వాగాపూర్‌లోని ఇందిరమ్మ ఇలు. ఇప్పటికీ బేస్‌మెంట్‌ దశ దాటలేదు. ఈ గ్రామానికి 152 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 57 ఇళ్ల నిర్మాణాలను మాత్రమే ప్రారంభించగా అందులో 7 మాత్రమే బెస్‌మెంట్‌ వరకు పూర్తి చేశారు. ఇంకా 95 ఇళ్లకు పునాదులే తీ | - | Sakshi
Sakshi News home page

ఈ ఫొటోలో కనిపిస్తోంది మావల మండలం వాగాపూర్‌లోని ఇందిరమ్మ ఇలు. ఇప్పటికీ బేస్‌మెంట్‌ దశ దాటలేదు. ఈ గ్రామానికి 152 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 57 ఇళ్ల నిర్మాణాలను మాత్రమే ప్రారంభించగా అందులో 7 మాత్రమే బెస్‌మెంట్‌ వరకు పూర్తి చేశారు. ఇంకా 95 ఇళ్లకు పునాదులే తీ

Apr 18 2025 1:43 AM | Updated on Apr 18 2025 1:43 AM

ఈ ఫొట

ఈ ఫొటోలో కనిపిస్తోంది మావల మండలం వాగాపూర్‌లోని ఇందిరమ్మ

శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

టీసీ, రికార్డు షీట్ల కోసం చలాన్‌ చెల్లించాలి

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు టీసీ బుక్‌లు, రికార్డు షీట్‌ల కోసం బ్యాంక్‌లో చలాన్‌ చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జెడ్పీఎస్‌ఎస్‌, కేజీబీవీ, మోడల్‌, ప్రైమరి స్కూళ్లలో రికార్డు షీట్‌ కోసం రూ.400, టీసీ బుక్‌ కోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో రికార్డు షీట్‌ల కోసం రూ.వెయ్యి, టీసీ బుక్‌ కోసం రూ.1200 చెల్లించాలన్నారు. పాత రికార్డు షీట్‌, టీసీకి సంబంధించిన మొదటి, చివరి పేజీలను జిరాక్స్‌ చేసి ఎంఈవో, సంబంధిత ప్రధానోపాధ్యాయుల సంతకంతో డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.

‘విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలి’

ఆదిలాబాద్‌టౌన్‌: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్‌ కళాశాలలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని, తరగతికి ఓ ఉపాధ్యాయుడిని నియమించాలని, విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిష్టన్న, అశోక్‌, సంఘ బాధ్యులు లక్ష్మణ్‌రావు, సురేఖ, సూర్యకుమార్‌, శ్రీనివాస్‌, స్వామి, విలాస్‌, ఇస్తారి, శివన్న, గణేశ్‌, శ్రీలత, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

వెనుకడుగు ఎందుకంటే ..

తొలిప్రాధాన్యతగా పూరి గుడిసెలు, మట్టిగోడలు ఉన్నటువంటి వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేశారు. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారులంతా నిరుపేదలే కావడం, ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించేంత ఆర్థిక స్థోమత లేకపోవడంతోనే చాలా మంది వెనుకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఇటుక, ఇసుక, సిమెంట్‌ ధరలు అఽధికంగా ఉండటం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతోపాటు అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకుంటే ప్రభుత్వమిచ్చే నిధులు సకాలంలో అందుతాయో.. లేదోననే అనుమానంతోనూ లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలకు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం తమకు అదనపు భారంగా మారుతుందనే ఉద్దేశంతో పనులు ప్రారంభించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగానే పలు మండలాల్లో ఒక్క ఇంటి నిర్మాణం కూడా ప్రారంభం కానట్లుగా తెలుస్తోంది.

కై లాస్‌నగర్‌: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రగతికి సంబంధించి ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకా పలు మండలాల్లో పూర్తిస్థాయిలో మార్కౌట్లను కూడా ఇవ్వలేదు. ఇళ్ల మంజూరుపై గంపెడాశలు పెట్టుకున్న లబ్ధిదారులు తీరా మంజూరుపత్రాలు చేతికందగా నిర్మాణాలపై మాత్రం అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో నిర్మాణాలు పునాదులు సైతం దాటని దుస్థితి నెలకొంది. లబ్ధిదారులంతా నిరుపేదలే కావడం, ఆర్థిక స్థోమత అంతగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శుక్రవారం జిల్లాకు రానున్న రాష్ట్ర రెవెన్యూ, గృహానిర్మాణ శాఖ అమాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభయహస్తం కోసం లబ్ధిదారులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. తమ గూడుగోడును తీర్చుకునేందుకు చేయూతనందించేలా ఎదైనా హామీ ఇవ్వకపోతారా అని ఆశపడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇంటిస్థలం కలిగిన వారికి ఫైలట్‌ ప్రాజెక్ట్‌ కింద మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేసింది. జిల్లాలోని 17 మండలాలకు గానూ 2010 ఇళ్లు మంజూరు చేస్తూ ఈ ఏడాది జనవరి 26న లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ పత్రాలను అందజేసింది. ఇంటిని నిర్మించుకున్నవారికి నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇళ్ల నిర్మాణాలు మాత్రం ముందుకు సాగడం లేదు. మూడు నెలలవుతున్నా ఇప్పటి వరకు పలు గ్రామాల్లో పునాదులు సైతం తీయని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు కేవలం 76 ఇళ్లు మాత్రమే బెస్‌మెంట్‌స్థాయి వరకు వచ్చాయంటే ఎంత నత్తనడకనసాగుతున్నాయో స్పష్టమవుతోంది. గృహానిర్మాణశాఖ, మండలాధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ నిర్మాణాల్లో మాత్రం పురోగతి కన్పించడం లేదు. కాగా బెస్‌మెంట్‌ వరకు ఇళ్లు నిర్మించుకున్న వారిలో గురువారం 51 మంది లబ్ధిదారులకు తొలి విడత ఆర్థికసాయం రూ.లక్ష వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లుగా హౌజింగ్‌ అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ చేయూతపై ఆశలు

రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత జిల్లా అయిన ఖమ్మం, నాగర్‌కర్నూల్‌లోని ఇందిరమ్మ లబ్ధిదారులకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా స్వయం సహాయక సంఘాలకు అందించే రుణాలను అందించి ఇంటి నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. అయితే అధికారులకు ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు అందకపోవడంతో జిల్లాలో ఈ విధానం అమలు కావడం లేదు. వెనుకబడిన, నిరుపేదలు ఉన్నటువంటి ఈ జిల్లాకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రభుత్వపరంగా చేయూతనందించేలా మంత్రి ఏదైనా హామీ ఇస్తారానే ఆశ వారిలో వ్యక్తమవుతోంది.

మన చిత్రం..‘జగమెరిగిన సత్యం’

కుమురంభీం జిల్లాకు చెందిన తిరుపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జగమెరిగిన సత్యం 18న విడుదల కానుంది.

IIలోu

న్యూస్‌రీల్‌

వేగవంతంపై ప్రత్యేక దృష్టి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్న మాట వాస్తవమే. వాటిని వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి సారించాం. పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టిన గ్రామాల్లో మంజూరైన ఇళ్లకు మార్కవుట్‌ ఇవ్వడంతో పాటు నిర్మాణ పనులు జరిగేలా అవగాహన కల్పిస్తున్నాం. డీఆర్‌డీఏ ద్వారా ఆర్థికసాయంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదు.

– బసవేశ్వర్‌, హౌజింగ్‌ పీడీ

ఈ ఫొటోలో కనిపిస్తోంది మావల మండలం వాగాపూర్‌లోని ఇందిరమ్మ1
1/2

ఈ ఫొటోలో కనిపిస్తోంది మావల మండలం వాగాపూర్‌లోని ఇందిరమ్మ

ఈ ఫొటోలో కనిపిస్తోంది మావల మండలం వాగాపూర్‌లోని ఇందిరమ్మ2
2/2

ఈ ఫొటోలో కనిపిస్తోంది మావల మండలం వాగాపూర్‌లోని ఇందిరమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement