-
మాట తప్పని నేత సీఎం జగన్
రావికమతం: మాట తప్పని మడమ తిప్పని నేతగా సీఎం జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. నాలుగు విడతల్లో రూ.25,552 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేసి అక్కచెల్లెమ్మల కళ్లలో ఆనందాన్ని చూస్తున్నారన్నారు. వైఎస్సార్ ఆసరా నాల్గో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం కొత్తకోట హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఇక్కడ బహిరంగ సభలో ధర్మశ్రీ మాట్లాడుతూ నాడు చంద్రబాబు, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేఎస్ఎన్ రాజు బ్యాంకు రుణాలు చెల్లించొద్దని, తాకట్టు పెట్టిన బంగారం తెచ్చి ఇచ్చేస్తామని ప్రగల్భాలు పలికారని విమర్శించారు. గెలిచన తర్వాత ఎవ్వరికై నా తాకట్టు పెట్టిన బంగారం తెచ్చి ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఆనాడు వారి మాటలు నమ్మి వడ్డీలు చెల్లించని వారికి అప్పులు తడిసిమోపుడయ్యాయని వాపోయారు. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలు మాఫీ చేశారన్నారు. నాడు జన్మభూమి కమిటీలు దోచుకున్నాయని దుయ్యబట్టారు. నేడు ఏ నాయకుడైనా లంచాలు అడిగారా? మీరెవ్వరికై నా ఇచ్చారా అని ప్రశ్నించగా? లేదు.. లేదంటూ.. మహిళలు ముక్తకంఠంతో పలికారు. అనంతరం రావికమతం మండలానికి రూ.11.89 కోట్ల చెక్కు, రోలుగుంట మండలానికి రూ.7.27 కోట్ల చెక్కును డ్వాక్రా మహిళలకు అందించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీపీలు పైల రాజు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రావికమతం మండలాధ్యక్షుడు ముక్కా మహలక్ష్మినాయుడు, డీసీఎంఎస్ డైరెక్టర్ గుమ్ముడు సత్యదేవ, జెడ్పీటీసీ తలారి రమణమ్మ ఆదిమూర్తి, చోడవరం ఏఎంసీ వైస్ చైర్మన్ రాజాన నర్సింహులు, కొత్తకోట సర్పంచ్ కోన లోవరాజు పాల్గొన్నారు. -
మునగపూడిలో షర్మిలకు చేదు అనుభవం.!
నాతవరం: మునగపూడి రచ్చబండ కార్యక్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె వ్యవహారశైలిని విమర్శిస్తూ స్థానిక వైఎస్సార్ అభిమానులు నిలదీశారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్ పేరును.. ఆయన మరణాంతరం చార్జిషీట్లో చేర్చి వారి కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన విషయాన్ని శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ సాక్షిగా ప్రశ్నించారు. వైఎస్సార్ బిడ్డగా అలాంటి పార్టీలో మళ్లీ ఎందుకు చేరారు..? అంటూ వైఎస్సార్ అభిమాని లోవరాజు నిలదీశారు. వైఎస్సార్ను, ఆయన కుటుంబాన్ని అవమానించిన పార్టీలో కాకుండా మరే పార్టీని గెలిపించమన్నా.. వైఎస్సార్ బిడ్డగా మద్దతు ఇచ్చేవాళ్లమని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి సమస్యలు లేవని సీఎం జగన్మోహన్రెడ్డి పాలనను ప్రశంసించారు. దీంతో షర్మిల ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. పది నిమిషాలపాటు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారు. ఈ క్రమంలో అతడి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు మైక్ లాక్కోన్నారు. అంతలోనే షర్మిల కలగజేసుకుని తనను మాట్లాడనివ్వండని నాయకులకు సూచించారు. లోవరాజు మాట్లాడుతున్నంత సేపు సభలో ఉన్న వారంతా ఈలలతో సందడి చేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్ పేరు చార్జిషీట్లో చేర్చిన విషయం సోనియా, రాహుల్ గాంధీలకు తెలియదని తన దగ్గర బాధపడ్డారన్నారు. రాష్ట్రంలో అధికార పక్ష, ప్రతి పక్ష నాయకులు బీజేపీ పెద్దల కాళ్లకు మొక్కుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులాంటివి పూర్తవ్వాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి, రుద్రరాజు, పీసీసీ సభ్యుడు శ్రీరామమూర్తి, నర్సీపట్నం నియోజకవర్గం ఇన్చార్జి సుబ్బ న్న, సన్యాసిరావు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
చోడవరం : మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. చోడవరం మండలంలో డ్వాక్రా మహిళలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన ఆసరా పథకంలో 4వ విడతగా రూ.14.73 కోట్ల చెక్కును డ్వాక్రా మహిళలకు ధర్మశ్రీ శుక్రవారం అందజేశారు. ఇక్కడ శివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేలాది మంది డ్వాక్రా మహిళలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. ప్రధానంగా మహిళల సాధికారత, సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళలకు దశలవారీగా రుణమాఫీ చేస్తుండగా మరో పక్క సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చి ఆ వడ్డీని ప్రభుత్వమే భరించే విధంగా సహకారం అందిస్తున్నారన్నారు. సున్నా వడ్డీతోపాటు ఆసరా పథకంలో మంజూరైన డబ్బులు నేరుగా డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమచేసి మహిళలకు అండగా ముఖ్యమంత్రి నిలిచారన్నారు. గతంలో చంద్రబాబునాయుడు రుణమాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాలను విడిపిస్తానని చెప్పి మహిళలను మోసం చేశాడని ధర్మశ్రీ విమర్శించారు. అంతేకాకుండా ఎన్నికల ముందు పసుపు కుంకుం పేరుతో మహిళలను చంద్రబాబు మభ్యపెట్టాలని చూసినప్పటికీ ఆయనకు బుద్ధి చెప్పి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో మహిళలు పూర్తి సహకారం అందించారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ పథకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా పథకాలన్నీ పార్టీలకు అతీతంగా ప్రజల ఇంటి ముందుకే తెచ్చి అందిస్తుందన్నారు. ఇది ప్రచారాల ప్రభుత్వం కాదని, ఇది ప్రజా ప్రభుత్వమని ఎమ్మెల్యే అన్నారు. మహిళలకు మరింత మేలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డిని మళ్లీ గెలిపించాలని ధర్మశ్రీ కోరారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏరియా కో ఆర్డినేటర్ రత్నప్రభ, ఎంపీపీ గాడి కాసు అప్పారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడువాక సత్యారావు, డీసీఎంఎస్ చైర్మన్ పల్లా నర్సింగరావు, మండల అధ్యక్షుడు దొడ్డి వెంకట్రావు, చోడవరం సర్పంచ్ బండి నూకాలమ్మ , ఉప సర్పంచ్ పుల్లేటి వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి రాంబాబు, ఉపాధ్యక్షురాలు బొగ్గు శ్యామల, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నెహ్రూ, మహిళా విభాగం అధ్యక్షురాలు యర్రా దేవి, పట్టణ మాజీ అధ్యక్షురాలు అల్లాడ భవానీ, ఈఓపీఆర్డి చైతన్య, వెలుగు ఏపీఎం కనకరాజు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మాయగాడు చంద్రబాబు.. బుచ్చెయ్యపేట : డ్వాక్రా రుణాలు బ్యాంకులకు కట్టొద్దని మహిళల్ని మోసగించిన మాయగాడు చంద్రబాబునాయుడైతే ఆసరా నగదు అందించి ఆదుకున్న మొనగాడుగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నిలిచారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ తెలిపారు. శుక్రవారం దిబ్బిడి గ్రామంలో బుచ్చెయ్యపేట మండలానికి మంజూరైన నాల్గో విడత ఆసరా నగదు రూ, 7.60 కోట్లు నగదు చెక్కును మహిళలకు ఆయన అందించారు. 2014లో చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలెవరూ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు, బంగారు రుణాలు తిరిగి కట్టొద్దని, అధికారంలోకి వస్తే రూ.13,800 కోట్లు మహిళల బ్యాంకు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. గద్దె నెక్కిన తరవాత చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మహిళలను మోసగించాడన్నారు. ప్రజా సంకల్పయాత్రలో జగనన్న హామీ ఇచ్చిన నవరత్నాల పథకంలో భాగంగా మహిళల బ్యాంకు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేసి ఆదుకున్నాడన్నారు. చంద్రబాబు అప్పట్లో ఉన్న అప్పు రూ.13,800 కోట్లు కట్టకపోవడంతో వడ్డీతో జగనన్న రూ, 25,532 కోట్లు బ్యాంకులకు కట్టి అక్కచెల్లెమ్మలను ఆదుకున్నారన్నారు. మాట మీద నిలబడే జగనన్నకే మహిళంతా పట్టం కట్టాలని, సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. చోడవరం నియోజకవర్గంలో రూ.168 కోట్లు డ్వాక్రా రుణాలను మాఫీ చేసి ఆసరా ద్వారా నాలుగు విడతలుగా అందించడమే కాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని విప్ ధర్మశ్రీ కోరారు. కార్యక్రమంలో చోడవరం వైఎస్సార్సీపీ చోడవరం నియోజకవర్గ పరిశీలకుడు చొక్కాకుల వెంకటరావు, ఎంపీపీ దాకవరపు నాగేశ్వరిదేవి, జెడ్పీటీసీ దొండా రాంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు జోగా కొండబాబు, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కె.అచ్చింనాయుడు, వైస్ ఎంపీపీలు గొంపా చినబాబు, దొండా లలితా నారాయణమూర్తి, సర్పంచ్ పెదిరెడ్ల మాణిక్యం, ఏపీఎం బాలరాజు, వెలుగు సిబ్బంది కొండలరావు, గణపతి పాల్గొన్నారు. -
పొత్తు లేకుండా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేదు
నక్కపల్లి : ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబునాయుడు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు కొయ్య ప్రసాదరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ పొత్తు లేనిదే ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము చంద్రబాబునాయుడికి లేదన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న చంద్రబాబు తర్వాత పొత్తు లేకుండా ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయడంలో విఫలమైన బీజేపీతో చంద్రబాబు పొత్తుపెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. మళ్లీ 2024లో బీజేపీతో పొత్తు కోసం అమిత్షా, మోదీతో కాళ్ల బేరానికి దిగుతున్నారన్నారు. విభజన చట్టాలను అమలు చేయని బీజేపీతో పవన్ పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ నోరు మెదపడం లేదన్నారు. వైఎస్సార్ హయాంలో చక్కెర కర్మాగారాలకు నిధులు మంజూరు చేసి నష్టాల ఊబిలో నుంచి గట్టెక్కిస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని నిర్వీర్యం చేసారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మేడేటి శంకర్, జిల్లా కార్యదర్శి ఎం.ఎన్.చక్రవర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరావు, మండల శాఖ అధ్యక్షుడు ప్రగడ చక్రధరరావు పాల్గొన్నారు. -
మాడుగుల టికెట్ ఎవరికిచ్చినా పనిచేయాలి
మాడుగుల/చోడవరం: మాడుగుల టికెట్ ఎవరికిచ్చినా అందరూ కలిసి పనిచేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. శుక్రవారం మాడుగుల మండలంలోని ఘాట్రోడ్ జంక్షన్లో ఆ పార్టీ నాయకుడు రాయిపురెడ్డి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి అందించిన సేవల వల్లే జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చారని, గడచిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకపోవడం వల్లే జనసేన పార్టీ ఓటమి చవిచూసిందని చెప్పారు. సమావేశానికి జనసేన కార్యకర్తలు అరకొరగా హాజరయ్యారు. చోడవరంలో జనసేన పార్టీ ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో చోడవరంలో జరిగిన సమావేశంలో నాగబాబు పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు, జనసేన ఎన్ని సీట్లతో పోటీ చేస్తుందనే అంశాలు వారం రోజుల్లో తేలుతాయన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి ఇన్చార్జి సుందరపు విజయ్కుమార్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
కోహ్లి, స్కై కంటే హార్దిక్ బెటర్: టీమిండియా మాజీ బ్యాటర్
ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!
తప్పక చదవండి
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
Advertisement