village Secretary
-
డిసెంబర్ 21న ‘సచివాలయ’ దినోత్సవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకేసారి 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతగా.. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతేడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని, ఈసారి మరింత ఉత్సాహంతో వేడుకలు నిర్వహించాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. (చదవండి: అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు) సచివాలయాల సిబ్బంది అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగులెవ్వరూ ప్రొబేషన్ డిక్లరేషన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు. కొత్త పీఆర్సీ కూడా వర్తిస్తుందని అధికారులు తెలియజేశారని పేర్కొన్నారు. (చదవండి: పరిశ్రమల ఖిల్లా ఆ జిల్లా.. రెండున్నర ఏళ్లలో ఆరు వేల ఉద్యోగాలు) గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయ వ్యవస్థను సృష్టించి లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే కాకుండా.. ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఇస్తున్న సీఎం వైఎస్ జగన్కు ఉద్యోగులు రుణపడి ఉంటారన్నారు. చదవండి: AP: అప్రమత్తతే ఆయుధం: సీఎం జగన్ -
AP: సబ్ రిజిస్ట్రార్లుగా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు
సాక్షి, అమరావతి: గృహ రుణాల నుంచి పేదలను విముక్తి చేసేందుకు తీసుకువచ్చిన వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు, వార్డు సచివాలయాల్లోని వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించి పేదల ఇళ్ల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేస్తారని గృహ నిర్మాణ శాఖ వెల్లడించింది. సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు వీరికి సహకరిస్తారని తెలిపింది. ఈ పథకం ఒక్క దాని కోసమే వీరు సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తారని వెల్లడించింది. ఇందుకోసం 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 6లో పాక్షిక మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. -
విషాదం: విధి నిర్వహణలో.. కూర్చున్న కుర్చీలోనే..
జగ్గంపేట: గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్న పాణింగపల్లి జయశంకర్ విధి నిర్వహణలో మృతి చెందారు. మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన శుక్రవారం విధులకు హాజరయ్యారు. ఉన్నట్టుండి మధ్యాహ్నం కూర్చున్న కుర్చీలోనే వెనక్కి వాలిపోయి మృతి చెందారు. ఆయన మృతదేహానికి వైద్య సిబ్బంది పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. చదవండి: పాపం రెండేళ్ల చిన్నారి.. ఎండలో ఒంటరిగా ఏడుస్తూ... అక్రమ సంబంధమే ప్రాణం తీసింది.. -
‘పేదలకు ఇంగ్లీష్ మీడియం.. సొంత ఇల్లు వద్దా?’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి రాయచోటిలోని ఎన్జీవో హోంలో సోమవారం గ్రామ, వార్డు సచివాలయాల సెక్రటరీలతో ముఖాముఖి నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పాలన మరింత సులభతరం అయ్యిందన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికి దక్కాలని.. లబ్దిదారుల పట్ల నిర్లక్ష్యం తగదని తెలిపారు. అర్హులైన వారికి అన్యాయం జరిగితే సచివాలయ సిబ్బందిదే నైతిక బాధ్యత అని హెచ్చరించారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే పై అధికారులకు వెంటనే తెలియజేయాలన్నారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ చేయని విధంగా తమ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం రోజుకు 30వేల పరీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. 10లక్షలకు పైగా పరీక్షలు చేయడం, పెద్ద సంఖ్యలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, కోవిడ్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలబడిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనాను ఎదుర్కొంటూనే సంక్షేమం, అభివృద్దిని రెండు కళ్ళలాగ చేసుకోని పనిచేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాదిరి సంక్షేమాల షెడ్యూల్ ఇచ్చిన సీఎంలను గతంలో ఎప్పుడు చుసిందిలేదన్నారు శ్రీకాంత్ రెడ్డి. ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమం కోసం పేదలంతా కళ్ళల్లో వత్తులు వేసుకోని ఎదురు చూస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తలపెట్టిన అన్ని అభివృద్ది కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నదని విమర్శించారు. పేద ప్రజల సామాజిక, సంక్షేమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. పేదవారు ఇంగ్లీష్లో చదవకుడదా.. పేదలకు స్వంతిల్లు వద్దా.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేందడం ఇష్టం లేదా అంటూ శ్రీకాంత్ రెడ్డి వరుస ప్రశ్నలు కురిపించారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడుగడుగునా అడ్డుపడటం తెలుగుదేశానికే చేల్లిందన్నారు. పేద ప్రజలకు మంచిచేసే విషయంలో జోక్యమేందుకని స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ప్రశ్నించారని తెలిపారు. పేద ప్రజలకు మంచి జరిగితే తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చిన నష్టమేంటి అని ఆయన ప్రశ్నించారు. పేద ప్రజలకు మంచి జరగకుడదనే ఉద్దేశంతోనే తెలుగుదేశం స్టేలు తీసుకువస్తుందని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రతి వాలంటీర్కు 50 ఇళ్ల కేటాయింపుతో మ్యాపింగ్ చేయాలి
-
సచివాలయ ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 15,971 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. పాత పద్ధతి, మార్గదర్శకాల ప్రకారమే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉండగా, వాటిలో ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలను ఆయా శాఖల నుంచి పంచాయతీరాజ్ శాఖ బుధవారం తెప్పించుకుంది. వీటిలో అత్యధికంగా 6,916 పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రామ ఉద్యాన అసిస్టెంట్ పోస్టులు 1,746, విలేజీ సర్వేయర్ పోస్టులు 1,234, పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు 1,122 చొప్పున ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది ఆగస్ట్–సెప్టెంబర్ మధ్య జరిగిన నియామక ప్రక్రియలో దాదాపు 15,971 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోగా, ఆ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 3 వేలకు పైగా పోస్టులు అదనం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలకు అదనంగా మరో 300 నూతన సచివాలయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో మరో 3 వేలకు పైగా సచివాలయ ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. వాటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
వారి బాధ్యత మహిళా సంరక్షణ కార్యదర్శులదే: డీజీపీ
సాక్షి, విజయవాడ : గ్రామ సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులు గ్రామంలోని మహిళల భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. గురువారం డీజీపీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికల సమస్యలు తీర్చే బాధ్యత మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో మహిళలకు, బాలికలకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, వీటిని అధిగమించడానికి మహిళా సంరక్షణ కార్యదర్శులు తోడ్పాటుగా ఉండాలని సూచించారు. మహిళా సంరక్షణ కార్యదర్శుల వల్ల సమాజంలో సమాజంలో పెను మార్పులు తీసుకురావలని పిలుపునిచ్చారు. మొత్తం రాష్ట్రంలో 14967 మంది కార్యదర్శులు ఉన్నారని వీరికి ఆరు నెలల్లో 10 బ్యాచ్లుగా 11 సెంటర్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణలో పోలీసులతోపాటు మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు. రెండు వారాల్లో ప్రాక్టికల్ క్లాసులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మహిళా కార్యదర్శులకు ఆత్మ రక్షణ, యోగా వంటి క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. -
‘రాజన్న చదివిస్తే.. జగనన్న ఉద్యోగం ఇచ్చారు’
సాక్షి, విజయవాడ : అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే లక్షన్నర ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు కొత్తగా ఎంపికైన గ్రామ సచివాలయ ఉద్యోగులు. సోమవారం సీఎం జగన్ చేతుల మీదుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఫీజు రియింబర్స్మెంట్ వల్ల చదువుకున్నామని, ఇప్పుడు ఆయన తనయుడు జగనన్న తమకు ఉద్యోగాలు ఇచ్చారని ప్రశంసించారు. అవినీతి రహిత పాలనకు గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీయే నిదర్శనమన్నారు. ప్రభుత్వం తమకు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు. (చదవండి : సేవ చేయడం కోసమే ఉద్యోగం: సీఎం జగన్ ) గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తై ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం జగన్ సోమవారం నియామక పత్రాలు అందజేశారు. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రేపే సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు
'సాక్షి, అమరావతి : పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛన ప్రాయంగా నియామక పత్రాలు అందిస్తారు. అనంతరం అక్కడకు వచ్చినవారి నుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం తిరిగి తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఆయన తిరుమల బయల్దేరి వెళ్తారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రేపు సాయంత్రం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. రేపు రాత్రి తిరుమలలోనే బసచేసి ఎల్లుండి ఉదయం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
బయటపడ్డ ఎల్లో మీడియా బాగోతం
సాక్షి, అనంతపురం : సచివాలయ ఉద్యోగాల ప్రశ్నాపత్రాలపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న ఎల్లో మీడియాపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ ఎదుట ఆంధ్రజ్యోతి పత్రికా ప్రతులను దహనం చేసి నిరసన తెలియజేశాయి. ఎస్కే వర్సిటీలో హార్టికల్చర్ పేపర్ రూపొందించారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఎస్కే వర్సిటీ సిబ్బంది స్పందించింది. తమ వర్సిటీలో హార్టికల్చర్ విభాగం, ప్రొఫెసర్లు లేనప్పుడు పేపర్ ఎలా రూపొందిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు అసత్య కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని ఎస్కే వర్సిటీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మాట్లాడుతూ..‘ ప్రశ్నాపత్రం తయారు చేయకపోయినా చేసినట్టు చూపారు. ఎస్కే వర్సిటీలో అసలు సచివాలయ ప్రశ్నా పత్రాలు రూపొందించలేదు. ఉద్యోగాల ప్రక్రియలో మాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు’ అని స్పష్టం చేశారు. ఇక ఆంధ్రజ్యోతి పత్రికపై మండిపడిన విద్యార్థి సంఘాలు.. ఆ పత్రిక ప్రతులను దహనం చేశాయి. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఇటుకలపల్లి పోలీసు స్టేషనులో ఫిర్యాదు నమోదైంది. -
ర్యాంకులతోపాటు మొత్తం మెరిట్ లిస్ట్లు..
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలకు ఎంపికైన వారి మెరిట్ లిస్ట్లను రూపొందించినట్లు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. ఈ జాబితాను అత్యంత పారదర్శకంగా రూపొందించామని, మొత్తం 13 జిల్లాల్లో ఎంపిక అయిన అభ్యర్థుల మెరిట్ లిస్ట్ను వెబ్సైట్లో పెట్టినట్లు తెలిపారు. ఎంపికైన అభ్యుర్థులు ర్యాంకుతోపాటు మొత్తం మెరిట్ లిస్ట్ను చూసుకోవచ్చని, వీటిని అన్ని కేటగిరి ఉద్యోగాలకు సిద్ధం చేశామని గిరిజా శంకర్ అన్నారు. -
'సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్లు సిద్ధం’
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్లు సిద్ధం చేశామని మున్సిపల్శాఖ కమిషనర్ విజయ్కుమార్ తెలిపారు. మెరిట్ లిస్ట్ను జిల్లాల కలెక్టర్లకు పంపినట్లు వెల్లడించారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఎంపికైనన అభ్యర్థులకు కాల్ లెటర్ పంపిస్తామని, అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా సమాచారం అందుతుందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆన్లైన్లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని, ధరఖాస్తులో చెప్పిన అర్హత, కుల ధృవీకరణ, క్రీమిలేయర్, నివాస సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, ఈ నెల 27న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 20 బృందాలను ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక ఏ అభ్యర్థి ఎక్కడ ఉద్యోగం చేయాలన్నది నిర్ణయిస్తామని, 60 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. -
సర్టిఫికెట్ల పరిశీలనకు బోర్డులు ఏర్పాటు చేసుకోండి
సాక్షి,కర్నూలు: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల కోసం మెరిట్ జాబితా సిద్ధమైందని, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కోసం బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) చైర్మన్ జి.వీరపాండియన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఒక్కో బోర్డులో పది మంది సభ్యులు ఉండాలని, ఒక్కో శాఖ అభ్యర్థుల సంఖ్యను బట్టి ఒకటి నుంచి పది వరకు బోర్డులను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ రవి పట్టన్శెట్టితో కలిసి సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. 9,597 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితా సిద్ధమైందని, ఈ జాబితాలోని ప్రతి అభ్యర్థికి శని, ఆదివారాల్లో కాల్ లెటర్లను ఎస్ఎంఎస్, మెయిల్ లేదా వలంటీర్ల ద్వారా నేరుగా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు ఈ నెల 21, 22 తేదీల్లో సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలని సూచించారు. అర్హత, పుట్టిన తేదీ, రెసిడెన్స్, పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్, స్పోర్ట్స్ కోటాలకు సంబంధించిన సర్టిఫికెట్లను కచ్చితంగా అప్లోడ్ చేయాలన్నారు. ఏవైనా సర్టిఫికెట్లు లేకపోతే పరిశీలన సమయంలో అవి ఎక్కడున్నాయో అధికారులు కనుగొని తగు చర్యలు తీసుకుంటారన్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల ఒరిజినల్స్తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాల్సి ఉంటుందని తెలియజేశారు. ఏ రోజు, ఏ సమయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందో అభ్యర్థులకు పంపే కాల్ లెటర్లో పేర్కొని ఉంటుందని, దాని ప్రకారమే పరిశీలనకు హాజరుకావాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు 27వ తేదీన రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇస్తారని, 28, 29 తేదీల్లో కౌన్సెలింగ్ ద్వారా స్థానాల కేటాయింపు ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీల్లో రెండు రోజుల శిక్షణ, అక్టోబర్ 2వ తేదీన ఉద్యోగాల్లో చేరేలా ప్రణాళికలు వేసినట్లు చెప్పారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 14వ తేదీ వరకు వి«ధుల్లో చేరేందుకు అవకాశం ఇస్తామని, ఆ లోపు రాకపోతే ఆ పోస్టును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల సందేహాలు, సలహాల కోసం జెడ్పీలో హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకే అభ్యర్థికి రెండు, మూడు ఉద్యోగాలు వస్తే అతను చేరే ఉద్యోగాన్ని వదిలి మిగిలిన ఉద్యోగాలను ఖాళీల కింద చూపి తరువాత మెరిట్ ఉన్న అభ్యర్థితో భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వెల్లడించారు. అక్టోబర్ 2వ తేదీన మండలం/మునిసిపాలిటీల్లో ఒక సచివాలయాన్నైనా అన్ని హంగులతో ప్రారంభిస్తామని, ఇందులో అన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్, డీపీఓ ప్రభాకరరావు, నగర పాలకసంస్థ కమిషనర్ రవీంద్రబాబు, ఏపీఎంఐపీ పీడీ పుల్లారెడ్డి, డీఎంఅండ్హెచ్ఓ నరసింహులు, ఐసీడీఎస్ పీడీ లీలావతి, వ్యవసాయ శాఖ జేడీ విల్సన్, పశుసంవర్ధక శాఖ జేడీ రామచంద్రయ్య పాల్గొన్నారు. -
‘ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చే అవకాశమే లేదు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న వార్తల్ని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికే కొంతమంది పనిగట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తలు వాస్తవాలు కాదని ఆయన ఖండించారు. పరీక్షల నిర్వహణను అన్ని మీడియా సంస్థలు ప్రశంసించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశారు. ప్రశ్నాప్రతాలు బయటకు వచ్చే అవకాశమే లేదన్నారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురి కావద్దన్నారు. -
కర్నూలు జిల్లా అభ్యర్థులకు అత్యుత్తమ మార్కులు
సాక్షి, కర్నూలు : జిల్లాలో ఉద్యోగాల విప్లవం..ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో కొలువులు..అత్యంత పకడ్బందీగా పరీక్షలు..అనుకున్న సమయానికి ఫలితాల వెల్లడి.. యువతలో నూతనోత్తేజం..విజయోత్సాహంతో వేల కుటుంబాల్లో వెల్లివిరిసిన సంతోషం..గురువారం గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయడం..అక్టోబర్ 2న విధుల్లో చేరే అవకాశం లభించడంతో విజయం సాధించిన అభ్యర్థుల్లో ఆనందం అంబరాన్ని తాకింది. గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. 19 రకాల పోస్టులను భర్తీ చేసేందుకు 14 రకాల పరీక్షలను ఈ నెల 1నుంచి 8వ తేదీ వరకు ఆరు రోజుల పాటు పకడ్బందీగా నిర్వహించారు. ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న 881 సచివాలయాల్లో 9,597 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఒక్కో సచివాలయంలో 11 నుంచి 12 మంది ఉద్యోగులను నియమించనున్నారు. పరీక్షలు నిర్వహించిన పది రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 40 రోజుల్లో సచివాలయ ఉద్యోగాల నియమాక ప్రక్రియను పూర్తి చేయనుండడం సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఫలితాలను రాష్ట్ర స్థాయిలో ప్రకటించినా.. ఎంపిక మాత్రం జిల్లా సెలక్షన్ కమిటీలదే. నియమకాల పత్రాలు వారే అందజేయనున్నారు. ఇందు కోసం ఇటీవలే జిల్లా సెలక్షన్ కమిటీలను సైతం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితాలకు సంబంధించి మెరిట్ జాబితా శుక్రవారం జిల్లా కమిటీకి చేరనుంది. శనివారం నుంచి మెరిట్ లిస్టులో ఉండే వారు.. వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారి.. జిల్లాలో మొత్తం 9,597 పోస్టులకుగాను 2,01,886 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆరు రోజుల పాటు నిర్వహించిన పరీక్షలకు 1,80,728 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొదటి రోజు జరిగిన పరీక్షలకు 1,33,167 మంది, రెండో రోజు 15,152, మూడో రోజు 4,071, నాల్గో రోజు 1,201, ఐదో రోజు 9,201, ఆరో రోజు 17,936 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒకే నోటిఫికేషన్లో 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. పరీక్షలు ముగిసిన 10 రోజుల్లోనే ఏ పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేయలేదు. 2008లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. 57 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి రికార్డు సాధించారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి..ప్రస్తుతం రెండింతల పోస్టులను భర్తీ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించనున్నారని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరీక్షలు రాసిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కనీస ఉత్తీర్ణత మార్కులను ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 40 శాతం(60 మార్కులు), బీసీలకు 35శాతం(52.5 మార్కులు), ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు 30 శాతం(45 మార్కులు)గా నిర్ణయించారు. (చదవండి : ఫలితాల్లోనూ రికార్డ్) -
‘సెక్రటేరియట్’ ఫలితాలు; పూర్తి వివరాలు
సాక్షి, అమరావతి: లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. రికార్డు స్థాయిలో ఒకే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహించడం విశేషం. ఈ మహోత్తర ప్రక్రియలో కీలక ఘట్టాలు, అంశాలను ప్రభుత్వం ప్రకటన రూపంలోమీడియాకు విడుదల చేసింది. పరీక్ష ఫలితాలను గ్రామ సచివాలయం/ఆర్టీజీఎస్ వెబ్సైట్లో అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేది ఆధారంగా తెలుసుకోవచ్చు http://gramasachivalayam.ap.gov.in/ http://vsws.ap.gov.in/ http://wardsachivalayam.ap.gov.in/ https://www.rtgs.ap.gov.in/ ముఖ్యమైన అంశాలు ► ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజల గుమ్మం ముంగిటే అందచేయటానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ► రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా అమలు చేయబడుతున్న "నవరత్నాలు" కార్యక్రమం ద్వారా అందజేసే లబ్ధిని అర్హులైన కుటుంబాలకు చేర్చడానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటు ►ప్రతీసచివాలయంలో 11 నుంచి 12 మంది శాశ్వతప్రభుత్వ ఉద్యోగులను నియమించి, ప్రభుత్వ సేవల్లోనాణ్యత పెంపొందించే నిమిత్తంప్రభుత్వం మొత్తం 1,26,728(95,088 గ్రామీణ ప్రాంతాలలో, 36,410 పట్టణ ప్రాంతాలలో) ఉద్యోగాలనుకొత్తగా సృష్టించి, వాటిని పోటీ పరీక్ష ద్వారా నేరుగా ఎంపిక చేయటానికి 26.7.2019 న కామన్ నోటిఫికేషన్ విడుదల చేసాము ► క్రొత్తగా ఏర్పాటు చేసే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలుఅక్టోబర్ 2నుండి అమలులోకివస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 11158 గ్రామ సచివాలయాలను, 3786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాము పరీక్షల నిర్వహణ విజయవంతం ► తేదీ 1.9.2019 నుండి 8.9.2019 వరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఎంపిక పరీక్షలను 6 రోజులపాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ► దేశ చరిత్రలోనే ఒకే రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేసేందుకు పోటీ పరీక్షలను ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఒక అరుదైన రికార్డు. ► అభ్యర్థుల హాజరు: 19 రకాలయిన పోస్టులను భర్తీకి 14 రకాల పరీక్షలకు మొత్తం 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 19.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అయినారు. ► పరీక్షలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించడం జరిగింది. సమాధాన పత్రాల మూల్యాంకనం ♦ 19,50,630 మంది అభ్యర్ధులకు చెందిన ఓఎంఆర్ సమాధాన పత్రాలను తేదీ 3.9.2019 నుండి 9.9.2019 వరకూ రికార్డు సమయంలో స్కాన్ పూర్తి చేయటం జరిగింది ♦ స్కానింగ్ పూర్తి అయిన తరువాత వచ్చిన ఫలితాలను, ఈ రంగంలో నిష్ణాతులైన “STATISTICAL TEAM” ద్వారా మరొకసారి సరి చూసుకోవటం కోసం STRATIFIED రాండమ్ శాంప్లింగ్ పద్ధతిలో 10,000 ఓఎంఆర్ సమాధాన పత్రాలనుసరి చూడడం జరిగింది. ముల్యాంకంలో ఎటువంటి తప్పులు దొర్లలేదని ధ్రువీకరించుకోవడం జరిగింది. పరీక్షా ఫలితాలు అభ్యర్ధులను ఎంపిక చేయటానికి కనీస ఉత్తీర్ణతా మార్కులు • ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40% • వెనుక బడిన తరగతులకు చెందిన వారికి 35% • ఎస్సీ /ఎస్టీ /వికలాంగులకు 30% హాజరైన 19,50,630 మంది అభ్యర్ధుల్లో 1,26,728 ఉద్యోగాలకు 198164 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు • ఓపెన్ కేటగిరి 24583 • బీసీ కేటగిరి 100494 • ఎస్సీ కేటగిరి 63629 • ఎస్టీ కేటగిరి 9458 • పురుషులు 131327 • స్త్రీలు 66835 జరిగిన 14 పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు • ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు • బి.సి. కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు • ఎస్. సి కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు సాధించారు • ఎస్. టి కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు సాధించారు ♦ మహిళా అభ్యర్థుల్లో గరిష్టంగా 112.5 మార్కులు ♦ పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా 122.5 మార్కులు ♦ ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా కలపబడతాయి ఫలితాల ప్రకటన అనంతరం, అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు వెళ్లి వారి సర్టిఫికేట్ లను తనిఖి చేయించుకోవలెను. వెరిఫికేషన్ షెడ్యూలు ఫలితాల విడుదల 19.09.2019 వెబ్సైట్ సర్టిఫికెట్ల అప్లోడ్ 21.09.2019 నుండి కాల్ లెటర్ పంపిణి 21.09.2019 – 22.09.2019 తనిఖి జరిగే తేదీలు 23- 25 సెప్టెంబర్ 2019 నియామక ఉత్తర్వుల జారీ 27.09.2019 అవగాహనా కార్యక్రమం 1&2 అక్టోబర్ 2019 గ్రామ/వార్డు సచివాలయ ప్రారంభం 02.10.2019 -
సచివాలయ ఫలితాలు: కేటగిరీ వారీ ఉత్తీర్ణుల జాబితా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫలితాలు విడుదల చేశారు. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. కేవలం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలకు మొత్తంగా 19,50,582 మంది హాజరుకాగా... 1,98,164 మంది అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా(కేటగిరీల వారీగా) -
‘సచివాలయ’ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి : లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను gramasachivalayam.ap.gov.in వెబ్సైట్లో చూడవచ్చు. ఈ నెల ఒకటి నుంచి 8 వ తేదీ వరకూ ఎపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. కేవలం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 1వరకు శిక్షణ ఇస్తారు. పరీక్ష విడుదల కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం : సీఎం జగన్ ఎన్నికల్లో చెప్పినట్లుగా సచివాలయ ఉద్యోగాలను రికార్డు సమయంలో భర్తి చేశామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేసేలా కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. ‘ఒకే నోటిఫికేషన్ ద్వారా 1,26,738 శాశ్వత ఉద్యోగాలు కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం. పరీక్షల్లో విజయం సాధించిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంపికైన వారికి మంచి శిక్షణ ఇస్తాం. వీరంతా ప్రజా సేవలో మమేకం కావాలి. అవినీతికి దూరంగా, నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించిన అధికారులకు అభినందనలు. అంకితభావంతో పరీక్షలు నిర్వహించి మంచి పనితీరును కనబరిచారు. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి. వర్గాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటకే సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అందుతాయి’ అని సీఎం జగన్ అన్నారు. -
బిగుసుకుంటున్న ఉచ్చు
గ్రామ/వార్డు సచివాలయాల్లో జూనియర్ లైన్మన్ (జేఎల్ఎం) పోస్టుల ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులను ఏమారుస్తున్న దళారుల భరతం పట్టేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. నియామకాలను నిక్కచ్చిగా నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఈ బాగోతాన్ని సీరియస్గా తీసుకోవడంతో మధ్యవర్తుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఇద్దరిపై చీటింగ్ కేసు పెట్టారు. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేసి దళారీల పనిపట్టమని ఎస్పీని ఆదేశించారు. సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : ఆమదాలవలసకు చెందిన గుండ దుర్గాప్రసాద్ అనే అభ్యర్థి దళారీ గ్యాంగ్తో బేరసారాలాడుతూ ఈనెల 7న విద్యుత్ విజిలెన్స్ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కిన సంగతి జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. సచివాలయ పోస్టుల్లో ఎక్కడా అక్రమాలు లేకుండా, పారదర్శకంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేసింది. అయితే అధికారుల చర్యలను సైతం పక్కదారి పట్టించిన దళారీ గ్యాంగ్.. పోల్ టెస్ట్లో పాసైన అభ్యర్థుల వివరాలను ఎప్పటికప్పుడు ఫోన్లోనే తెప్పించుకుని, వారినే టార్గెట్గా చేసుకుంటూ.. వసూళ్ల పర్వానికి తెరలేపింది. పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు వచ్చేందుకు ఓ రేటు, వచ్చాక పోల్ క్లైంబింగ్ పరీక్షలో పాసైతే తుది మెరిట్ జాబితాలో పేరుండేందుకు మరో రేటు చొప్పున లక్షల్లో పలువురు అభ్యర్థుల నుంచి వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ పరీక్షలను ఎంతో పారదర్శకంగా నిర్వహించినప్పటికీ.. దళారీల గ్యాంగ్ మాత్రం కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు వాడుకుని మరీ వసూళ్లకు పాల్పడినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే విద్యుత్ శాఖలో పనిచేస్తూనే.. దళారీ అవతారమెత్తిన కొందరి పాత్ర కూడా ఇందులో ఉన్నట్లుగా వార్తలు గుప్పుమంటుండడంతో.. వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల సంఘంతోపాటు వివిధ విద్యుత్ ఉద్యోగుల సంఘాల నేతలు కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. నిరుద్యోగుల ఆశలతో ఆడుకోవడంతోపాటు ఈపీడీసీఎల్ సంస్థ పరువుకు సంబంధించిన అంశంగా కూడా దీన్ని పరిగణిస్తూ... దళారీ గ్యాంగ్ ఆటకట్టించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా లైన్మన్ ఉద్యోగార్థులు కూడా సోమవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ను ‘స్పందన’ కార్యక్రమంలో కలిసి.. దళారీల కారణంగా అర్హులైన వారికి పోస్టులు దక్కే అవకాశాలు తగ్గిపోతున్నాయని, ఆన్లైన్లో పదో తరగతి జీపీఏ పాయింట్ల నమోదులో తప్పుల కారణంగా ఇప్పటికే వందలాదిమంది అభ్యర్థులు పరీక్షలకు అనర్హులయ్యారని విన్నవించుకున్నారు. దీంతో నాలుగు వైపులా దళారీ గ్యాంగ్ టార్గెట్గా మారింది. ముమ్మరంగా గాలింపు విద్యుత్ లైన్మన్ పోస్టులిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూళ్లు చేసిన వ్యవహారంలో విద్యుత్ శాఖకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర కీలకంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులకు విద్యుత్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్న ఆమదాలవలస అభ్యర్థి దుర్గాప్రసాద్ ఇచ్చిన స్టేట్మెంట్తోపాటు అతడి ఫోన్లో ఉన్న సమాచారం మేరకు పలువురి పాత్రను ప్రాథమికంగా గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈమేరకు గోపాలరావు, శ్రీధర్ అనే ఇద్దరిపై టూటౌన్ పోలీసులు 420 చీటింగ్ కేసును నమోదు చేశారు. ఇందులో ఒకరు విద్యుత్ ఉద్యోగి కాగా, మరొకరు వ్యాపారి అని తెలుస్తోంది. ఇదిలావుంటే పోల్ పరీక్షల సమయంలో విద్యుత్ శాఖలో ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారం లేకుండా విధులకు రాని ఉద్యోగుల వివరాలను కూడా పోలీసులు సేకరించారు. పరీక్షలు నిర్వహించిన ఆర్ట్స్ కళాశాలలో ఈమేరకు సీసీ కెమెరాల నుంచి కూడా ఫుటేజిని సేకరించే పనిలో పడ్డారు. దీని ఆధారంగా అనుమానాస్పదంగా ఉన్న అభ్యర్థులు, ఉద్యోగులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా ఇదే క్రమంలో పలువురి ఇళ్లకు వెళ్లి సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ, అప్పటికే ఇంటికి తాళాలు వేసి పరారీలో ఉన్నట్టు గుర్తించారు. జిల్లాలో మొత్తం 679 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించగా.. పోల్ క్లైంబింగ్ టెస్ట్ అనంతరం 986 మంది అర్హత సాధించినట్టు అధికారులు ప్రకటించారు. తాజా పరిణామాలతో డబ్బులిచ్చిన అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉద్యోగాల కోసం లక్షలాది రూపాయలు టోకెన్ అడ్వాన్స్గా ఇచ్చేయడంతో.. ఇప్పుడు పరిస్థితి ఏంటని ఆందోళన పడుతున్నారు. సమగ్ర దర్యాప్తు చేయాల్సిందే.... లైన్మన్ పోస్టుల విషయంలో దళారీల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా దర్యాప్తు చేయాలంటూ వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల సంఘం, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం, తెలుగునాడు, అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘ నేతలంతా డిమాండ్ చేశారు. పలు యూనియన్ నేతలంతా కలిసి ప్రత్యేక తీర్మానాన్ని చేశారు. వైఎస్సార్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కె.వి.కృష్ణారావు, ఆర్.శ్రీనివాస్లు మాట్లాడుతూ మెరిట్లో వచ్చిన అభ్యర్థుల పేర్లు తప్పించే ప్రయత్నాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరారు. దళారీల వ్యవహారంపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘ నేతలు సనపల వెంకటరావు, చల్లా వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ నిరుద్యోగుల నుంచి పోస్టుల పేరు చెప్పి మోసం చేయడం పెద్ద నేరమని, సొంత శాఖకు చెందిన ఓ యూనియన్ నేత ఇలాంటి నేరాలకు పాల్పడటంతో సంస్థకు చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎన్నో లక్షలు వసూలు చేశారని, అలాగే ఇప్పుడు మెడికల్ ఇన్వాల్యుయేషన్పై ఆరోగ్యంగా ఉన్న ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులను దండుకుంటున్నారని, దీనిపై కూడా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తెలుగునాడు సంఘ నేత కె.వైకుంఠరావు మాట్లాడుతూ మెరిట్ లిస్ట్ ఎలా బయటకు వెళ్తుందో.. వారి డాటాను ఎవరు ఎవరికి పంపిస్తున్నారో శాఖాపరంగా విచారణ జరగాలని, రాష్ట్ర ప్రభుత్వం నియామక ప్రక్రియను పారదర్శకంగా చేస్తున్నప్పటికీ... ఇలాంటి ఘటనలు చెడ్డ పేరు తీసుకొస్తాయన్నారు. అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘం బ్రాంచ్ సెక్రటరీ జి.వి.సురేష్ మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు ఇప్పటికైనా చెక్ పడాలని, ఇంతవరకు ఎంతమంది జీవితాలో ఆవిరయ్యాయని, తాజా పోస్టుల వ్యవహారంలో అర్హులైన వారినే ఎంపిక చేసేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎలాగైనా ఈ వ్యవహారంలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. దళారుల పనిపట్టండి.. లైన్మన్ పోస్టుల నియామకాల్లో దళారీల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా స్పందించారు. కొందరు దళారులు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకుని డబ్బులు దండుకుంటున్నారని, దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తును చేపట్టాలని జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డికి ఆయన ఆదేశించారు. దళారీ వ్యవహారంలో ఎంతటి వారున్నా ఏమాత్రం క్షమించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సచివాలయ పోస్టులన్నీ పారదర్శకంగానే భర్తీ చేస్తున్నామని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని అన్నారు. దళారీ గ్యాంగ్ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణిస్తున్నామని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘సచివాలయ’ పరీక్షలకు 92.77 శాతం హాజరు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు తొలిరోజు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రశాంతంగా మొదలయ్యాయి. 92.77 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం పరీక్షకు 12,53,974 మంది హాజరు కావాల్సి ఉండగా, 11,62,164 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 2,95,980 మంది హాజరు కావాల్సి ఉండగా, 2,72,420 మంది హాజరయ్యారు. మొత్తం 1,26,728 ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఆరు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలిరోజు 92.77 శాతం హాజరు నమోదు కావడం అంటే నియామక ప్రక్రియ పూర్తిస్థాయిలో విజయవంతమైనట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పత్తికొండ జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాల్లో ఓఎంఆర్ షీట్లు తారుమారయ్యాయి. వేంపెంట అభ్యర్థులకు పత్తికొండ అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, పత్తికొండ అభ్యర్థులకు వేంపెంట అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు వచ్చాయి. ఈ పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే అదనపు ఓఎంఆర్ షీట్లను సమకూర్చారు. రెండు కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడంతో అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించారు. ఈ ఒక్క సంఘటన మినహా తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. అధికారుల ప్రత్యేక చర్యలు మండల కేంద్రాల్లో సైతం పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం హాజరు శాతం అత్యధికంగా నమోదు కావడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం పరీక్షలకు హజరు కావాల్సిన అభ్యర్థుల్లో 16 వేల మంది శనివారం సాయంత్రం వరకు హాల్టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోలేదు. అధికారులు వారికి ప్రత్యేకంగా మెసేజ్లు పంపారు, వాయిస్ కాల్స్ చేశారు. ఇలాంటి ప్రత్యేక చర్యలతో హాజరు శాతం పెరిగిందని అంటున్నారు. ప్రాథమిక ‘కీ’ విడుదల తొలిరోజు జరిగిన రాత పరీక్షల ప్రాథమిక ‘కీ’ని పరీక్షల నిర్వహణ కమిటీ చైర్మన్, కన్వీనర్లు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. దీనిపై మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రతి పరీక్ష జరిగిన తేదీకి ఐదు రోజుల అనంతరం తుది ‘కీ’ని విడుదల చేస్తారు. 23–25 తేదీల మధ్య మెరిట్ జాబితాలు రాత పరీక్షల జవాబు పత్రాలైన ఓఎమ్మార్ షీట్లను అన్ని జిల్లాల నుంచి నాగార్జున యూనివర్సిటీకి తరలించే ప్రక్రియ మొదలైంది. ఈ నెల 3వ తేదీ నుంచి ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ మొదలవుతుందని గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. రోజుకు 4 లక్షల షీట్ల స్కానింగ్ పూర్తవుతుందన్నారు. అన్ని పరీక్షల ఓఎమ్మార్ షీట్లను రెండు విడతల పాటు స్కానింగ్ చేసే ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ వెల్లడించారు. ఈ నెల 23–25 తేదీల మధ్య ఉద్యోగాల వారీగా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితాలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. గుండెపోటుతో అభ్యర్థి మృతి గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష రాస్తూ గుండెపోటుతో ఓ అభ్యర్థి మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన గుడాల నరేష్ (30) పూలపల్లి శ్రీగౌతమి స్కూల్లో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభమైన అనంతరం నరేష్కు గుండెలో నొప్పి రావడంతో విధుల్లో ఉన్న ఏఎన్ఎం పరీక్షించిన అనంతరం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భీమవరం వర్మ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుడాల నరేష్ మరణించాడు. పరీక్ష కోసం వచ్చి బిడ్డకు జన్మనిచ్చింది సచివాలయం ఉద్యోగ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థిని పరీక్ష రాయకుండానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాళేనికి చెందిన ఎర్రబోతు సుప్రియ గూడూరులో గ్రామ సచివాలయ పరీక్ష రాసేందుకు వచ్చింది. నిండుగర్భిణి కావడంతో పరీక్ష సమయానికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే గూడూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టినందుకు సంతోషపడాలో, పరీక్ష రాయలేనందుకు బాధపడాలో అర్థం కావడం లేదని సుప్రియ పేర్కొంది. పరీక్షకు తండ్రి, కుమార్తె, కుమారుడు హాజరు గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షకు తండ్రి, కుమార్తె, కుమారుడు హాజరయ్యారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన చోళ్ల మోహనరావు, ఆయన కుమార్తె ఇందిర, కుమారుడు నరేష్కుమార్ గ్రామ సచివాలయం ఉద్యోగానికి పరీక్ష రాశారు. మోహన్రావు శ్రీనివాస కళాశాల, ఇందిర నారాయణ కళాశాల, నరేష్కుమార్ ఆర్కే జూనియర్ కాలేజీలో పరీక్షకు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాస జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సచివాలయ పరీక్షకు ఓ రిమాండ్ ఖైదీ హాజరయ్యాడు. తొలిరోజు విజయవంతం పటిష్టమైన ప్రణాళిక, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది సహకారం, సమన్వయం వల్లే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు విజయవంతంగా మొదలయ్యాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరీక్షల తీరును, ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో ఏ ప్రభుత్వ శాఖ పరీక్షలు నిర్వహించలేదన్నారు. పరీక్ష కేంద్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఏర్పాటు చేయడం వల్ల హాజరు శాతం పెరిగిందన్నారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్లు ఏర్పాటు చేసిందని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్ శాఖ సహకరించిందని చెప్పారు. పరీక్షల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లకు సహకారం అందించేందుకు ఒక్కొక్క ప్రత్యేక అధికారిని జిల్లాలకు ముందుగానే పంపినట్టు వివరించారు. వారు పరీక్షల ఏర్పాట్లలో కలెక్టర్లకు పూర్తిగా సహకరించారని, తాము రూపొందించిన ప్రత్యేక బుక్లెట్ ఆధారంగా ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పారు. వచ్చే ఐదు రోజుల్లో నిర్వహించే పరీక్షలకు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోనే పరీక్షా కేంద్రాలు ఉండటం వల్ల అభ్యర్థులు సులువుగా చేరుకోవచ్చన్నారు. గ్రామ సచివాలయాల్లో భర్తీ చేయనున్న పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశాలు లేవని చెప్పారు. మొత్తం 9,886 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తే 6,265 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. మిగిలిన పోస్టుల్ని భర్తీ చేసే బాధ్యతను ప్రభుత్వం ఆ శాఖకు అప్పగించే అవకాశాలున్నాయని చెప్పారు. కాగా, విజయవాడలోని పలు కేంద్రాలను పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ గుంటూరు, నెల్లూరులోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థుల కోసం 1,945 ఆర్టీసీ బస్సులు సచివాలయ పోస్టుల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ పెద్ద ఎత్తున రవాణా సౌకర్యం ఏర్పాటుచేసినట్లు సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి రోజు ఆదివారం పరీక్షకు హాజరైన అభ్యర్థుల కోసం వారి సమీప జిల్లా కేంద్రాలకు రాష్ట్రవ్యాప్తంగా 1945 బస్సులను నడిపింది. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన బస్స్టేషన్లలో హెల్ప్డెస్క్లు ఏర్పాటుచేసింది. పరీక్ష సామగ్రిని జిల్లా కేంద్రాలకు తరలించేందుకు, పరీక్ష కేంద్రాలకు అవసరమైన ఏర్పాట్ల నిమిత్తం సుమారు 16 గూడ్స్ ట్రాన్స్పోర్టు వాహనాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు జరగనున్న రాత పరీక్షలకు అభ్యర్థుల రద్దీని బట్టి ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. 470 స్పెషల్ సర్వీసులు వినాయకచవితి వరుస సెలవుల తర్వాత తిరుగు ప్రయాణం అయ్యే ప్రయాణికుల కోసం ఆర్టీసీ సోమవారం సాయంత్రం 470 స్పెషల్ సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆపరేషన్స్ విభాగం పేర్కొంది. అవసరానికి అనుగుణంగా రద్దీ ఉన్న మార్గాల్లో నడిపేందుకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్స్టేషన్లో మరో 109 బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచామని తెలిపింది. ఈ నెల 4వ తేదీన కూడా అవసరమైన మేరకు స్పెషల్ బస్సులు నడపనున్నట్టు పేర్కొంది. -
‘సచివాలయ’ రాత పరీక్షలకు 4,478 కేంద్రాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 4,478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్కొక్క రకమైన పరీక్షకు ఒక్కో రోజు చొప్పున సెప్టెంబరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రెండు పూటలా రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన జరిగే వివిధ ఉద్యోగాల రాత పరీక్షకు అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగే మిగిలిన ఉద్యోగాల రాతపరీక్షకు మాత్రం ఏడు జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు 13 జిల్లాల్లో 4,478 కేంద్రాల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 306, విజయనగరంలో 198, విశాఖ జిల్లాలో 406, తూర్పు గోదావరిలో 481, పశ్చిమ గోదావరిలో 311, కృష్ణాలో 374, గుంటూరులో 365, ప్రకాశంలో 231, నెల్లూరులో 323, చిత్తూరులో 380, వైఎస్సార్ జిల్లాలో 270, అనంతపురంలో 389, కర్నూలు జిల్లాలో 444 పరీక్షా కేంద్రాల్లో 15,50,002 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. సెప్టెంబర్ 3, 4, 6, 7, 8 తేదీల్లో జరిగే రాత పరీక్షకు 7 జిల్లాల్లో 536 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 40, విశాఖలో 56, పశ్చిమ గోదావరిలో 38, కృష్ణాలో 90, నెల్లూరులో 85, చిత్తూరులో 120, అనంతపురం జిల్లాలో 107 పరీక్షా కేంద్రాల్లో 6,19,812 మంది పరీక్ష రాయనున్నారు. రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే రాతపరీక్షలు ప్రశాంతంగా, సక్రమంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పరీక్షల నిర్వాహణపై డీజీపీ గౌతమ్ సవాంగ్తో కలిపి ఆయన బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచి, ప్రత్యేక ఎస్కార్టుతో ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల తరహాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలను సైతం పకడ్బందీగా నిర్వహించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. -
వార్డు సచివాలయాల పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు భారీ ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఎలాంటి ప్రభుత్వ సేవలైనా గ్రామం నుంచే పొందేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ సచివాలయాలు ప్రారంభమైతే రెవెన్యూ, పంచాయతీ, పోలీసు, వైద్యం, మత్స్యశాఖ, ఉద్యాన, వ్యవసాయ తదితర శాఖలకు చెందిన సేవలు ఒకేచోట అందనున్నాయి. జిల్లాలో గ్రామ సచివాలయాలు 933, వార్డు సచివాలయాలు 511 కలిసి 11,025 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి 1.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాయనుండడంతో ఆరు రోజుల పాటు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్షలు నిర్వహించనుంది. మండలానికి దగ్గరలోనే పరీక్ష కేంద్రం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కేంద్రాల చిరునామా విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష నిర్వహణ నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలతో పాటు వివిధ పాఠశాలలను కేంద్రాలుగా గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 380 కేంద్రాలను అధికారులు గుర్తించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులంతా సొంత మండలాల్లో పరీక్ష రాసే అవకాశం లేదు. ప్రతి అభ్యర్థికి తనకు దగ్గరలో ఉన్న మండలాన్ని గుర్తించి అక్కడే పరీక్ష రాసేలా హాల్ టికెట్ కేటాయించనున్నారు. గూగుల్లో లింక్.. సొంత మండలాల్లో పరీక్ష రాసేందుకు అవకాశం లేకపోవడంతో పరీక్ష కేంద్రం చిరునామా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతీ పరీక్ష కేంద్రాన్ని ఆన్లైన్ చేస్తున్నారు. అభ్యర్థి తాను పరీక్ష రాయనున్న కేంద్రం పేరు గూగుల్లో నమోదు చేస్తే చిరునామాతో పాటు కేంద్రానికి ఎలా చేరుకోవాలో గూగుల్ మ్యాప్లో చూపించేలా లింక్ దొరుకుతుంది. దీంతో పరీక్షకు నిర్ణీత సమయంలో చేరుకోవడంతో పాటు, సమయం కలిసొస్తుంది. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. కెమెరాలు అందుబాటులో లేని పక్షంలో వీడియోగ్రాఫర్ల సహాయంతో పరీక్షలను వీడియో తీయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే ఇన్విజిలేటర్లుగా నియమించే అవకాశం ఉంది. ప్రలోభాలకు తావులేదు..! గత కొన్నేళ్లుగా ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన ఖాళీలన్నీ భర్తీ చేస్తుండడాన్ని కొంతమంది అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఒక్కో జాబుకు ఒక్కో మొత్తాన్ని ముట్టజెప్పితే ఉద్యోగం ఇప్తిస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ సీట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద పోలీసులు పట్టిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. డబ్బులిస్తే ఉద్యోగం ఇస్తామని చెబితే నమ్మొద్దని, అలాంటి వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి రెండు సంవత్సరాల పాటు ప్రొబెషనరీ పీరియడ్గా పరిగణించి రూ.15 వేలు అందజేయనున్నారు. ఆ తర్వాత శాశ్వత వేతన స్కేలును ప్రభుత్వం వర్తింపజేయనుంది. -
గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని అభ్యర్థులు గడువు పెంచమని కోరారని అధికారులు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు దరఖాస్తుల గడువును ఈ నెల 11 (రేపు ఆదివారం) అర్థరాత్రి 12గంటల వరకు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో 13 జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆదివారం రాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్షకు దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. శనివారం సాయంత్రం నాటికి 21 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. మరోక రోజు గడువు పెంచడంతో 22 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 19 రకాల ఉద్యోగాలను నాలుగు రకాలుగా వర్గీకరించి.. వాటికి సెప్టెంబరు 1, 8 తేదీలలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. పూర్తి పారదర్శకంగా, ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. అయితే, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు అభ్యర్థుల దగ్గర నుంచి వసూళ్లు ప్రారంభించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) వర్గాలు తాజాగా స్పష్టం చేశాయి. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఉద్యోగాలు ఇప్పించలేరని తేల్చిచెప్పాయి. సిఫార్సులకు ఆస్కారం లేకుండా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూలు పెట్టలేదని వెల్లడించాయి. -
సచివాలయ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. అభ్యర్థుల నుంచి వచ్చిన సూచనల మేరకు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1, మధ్యాహ్నం నిర్వహించాల్సిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2), వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి (గ్రేడ్ 2) పరీక్షలను సెప్టెంబర్ 7 ఉదయానికి వాయిదా వేశారు. వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి పరీక్షను సెప్టెంబర్ 8, ఉదయం నుంచి అదే రోజు మధ్యాహ్నానికి మార్చారు. మిగిలిన పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మారిన పరీక్షల షెడ్యూల్ ఇలా.. సెప్టెంబర్ 1, ఉదయం పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, పిల్లల సంరక్షణ సహాయకురాలు, సంక్షేమం, విద్య సహాయకులు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి సెప్టెంబర్ 1, మధ్యాహ్నం గ్రామీణ రెవెన్యూ ఆఫీసర్, గ్రామీణ సర్వేయర్, గ్రామీణ వ్యవసాయ సహాయకులు, గ్రామీణ ఉద్యావన సహాయకులు, గ్రామీణ మత్యశాఖ సహాయకులు, పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సహాయకులు, పశుసంవర్థకశాఖ సహాయకులు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు (మహిళలు), గ్రామీణ సెరీకల్చర్ సహాయకులు సెప్టెంబర్ 7, ఉదయం ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి సెప్టెంబర్ 8, ఉదయం వార్డు ప్రణాళిక, నియంత్రణ కార్యదర్శి, వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి సెప్టెంబర్ 8, మధ్యాహ్నం వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి -
‘సర్వే’ ఎదురు చూపులకు చెక్
సాక్షి, అమరావతి: భూముల కొలతలు, సరిహద్దుల నిర్ధారణ, భాగ పరిష్కారం (సబ్ డివిజన్), స్థలాల కొలతల కోసం ఇక నెలల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. సర్వేయర్ల కోసం మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. ముడుపుల మాటే లేదు. ఇప్పటి వరకూ సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు కలిపి మొత్తం 942 మంది ఉన్నారు. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలతో పోల్చితే మన రాష్ట్రంలోనే సర్వేయర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణం ప్రకారం కనీసం 4,000 నుంచి 5,000 వేల మంది సర్వేయర్లు అవసరమని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గతంలో శాస్త్రీయ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గత ప్రభుత్వాలు ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోలేదు. దీనివల్ల క్రమేణా భూసంబంధమైన సమస్యలు పెరిగిపోయాయి. దేశ చరిత్రలోనే లేని విధంగా... స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే లేనివిధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు గ్రామ సచివాలయాల ద్వారా ఏకకాలంలో 11,158 సర్వేయర్ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం మండలానికి ఒక్క సర్వేయరు మాత్రమే ఉండగా ఈ పోస్టుల భర్తీతో ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ ఉండనున్నారు. 2,000 మంది జనాభా ఉన్న గ్రామ సచివాలయంలో కూడా ఒక సర్వేయర్ అందుబాటులో ఉంటారు. దీంతో గ్రామంలో కొలతల కోసం ఎవరు అర్జీ పెట్టుకున్నా అక్కడున్న సర్వేయర్ వెంటనే కొలతలు వేసి సబ్డివిజన్ చేస్తారు. సర్వేయర్లను నియమించగానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సులభమార్గంలో సర్వే చేసే విధానంపై శిక్షణ కూడా ఇస్తారు. గ్రేడ్ –3 సర్వేయర్లుగా నియామకం మొదట 11,158 మందిని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా గ్రేడ్ –3 సర్వేయర్లుగా నియమిస్తారు. తర్వాత వారికి నిబంధనల మేరకు గ్రేడ్–2 సర్వేయర్లుగా పదోన్నతి కల్పిస్తారు. గ్రేడ్ –2 సర్వేయర్లను పెద్ద గ్రామపంచాయతీల్లో నియమిస్తారు. గ్రేడ్–2 సర్వేయర్లను తదుపరి గ్రేడ్ –1కు ప్రమోట్ చేసి పట్టణాల్లో నియమిస్తారు. వీరందరినీ భూముల రీసర్వేకి ప్రభుత్వం వినియోగించుకుంటుంది. భూముల రీసర్వే, సర్వే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం కోసం ప్రభుత్వం భారీ సంఖ్యలో సర్వేయర్లను నియమిస్తోంది. -
ఆ ఉద్యోగాలకు.. దరఖాస్తుల వెల్లువ
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఆదివారానికి పది లక్షలు దాటిపోయింది. రికార్డు స్థాయిలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్షకు ఆగస్టు పదో తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు జూలై 27 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. ఆదివారం సాయంత్రం వరకు 10,73,532 మంది దరఖాస్తు చేసుకున్నారు. సాధారణ పనిదినాల్లో రోజుకు అందే దరఖాస్తుల సంఖ్య లక్ష దాటుతోందని.. ఈ పరిస్థితి బట్టి చూస్తే గడువు ముగిసే సమయానికి దరఖాస్తుల సంఖ్య 20 లక్షలు దాటిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. కర్నూలు, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి లక్షకు పైగా దరఖాస్తులు అందాయని.. నెల్లూరు, విజయనగరం జిల్లాల నుంచి తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. సందేహాల నివృత్తికి ప్రత్యేక సెల్ ఇదిలా ఉంటే.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. దరఖాస్తు, రాతపరీక్షపై అభ్యర్థులకు తలెత్తే సందేహాలు నివృత్తి చేయడానికి పంచాయతీరాజ్ శాఖ ఐదు మొబైల్ నెంబర్లతో ప్రత్యేక సెల్ను ఏర్పాటుచేసింది. ఇందుకు 20 మందిని కేటాయించింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ విజయకుమార్లు సైతం వ్యక్తిగతంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయాల్లో సందేహాల నివృత్తికి అదనంగా ప్రత్యేక సెల్ను కూడా ఏర్పాటుచేశారు. ఇతర రాష్ట్రాల వారూ దరఖాస్తు ఈ పోస్టులకు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాల వారీగా భర్తీచేసే మొత్తం ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 20 శాతం ఉద్యోగాలకు ఆ జిల్లాలోని స్థానికులతో పాటు ఇతర జిల్లాల వారూ, ఇతర రాష్ట్రాల వారు కూడా ఒపెన్ కేటగిరిలో పోటీపడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఆదివారం నాటికి 2,332 మంది ఇతర రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకున్నట్లు గోపాలకృష్ణ ద్వివేది ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాతపరీక్ష తేదీల్లో మార్పులపై 6న ప్రకటన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్ష తేదీల్లో మార్పులు, చేర్పులపై ఈ నెల 6న ఓ ప్రకటన చేయనున్నట్లు ద్వివేది వెల్లడించారు. మొత్తం 19 రకాల ఉద్యోగాలను నాలుగు రకాలుగా వర్గీకరించి.. వాటికి సెప్టెంబరు 1, 8 తేదీలలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహించనున్నారు. అయితే, ఉద్యోగాల వర్గీకరణలో కేటగిరి–2లో పేర్కొన్న గ్రూపు–ఏ, గ్రూపు–బీలో నాలుగు రకాల ఉద్యోగాలకు సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం రాతపరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పరీక్షకు సివిల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు అర్హత ఉండడంతో ఆయా పరీక్షలను ఒకే సమయంలో కాకుండా వేర్వేరుగా నిర్వహించాలని వారి నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అధికారులకు చేరాయి. దీంతో పూర్తిస్థాయి రాతపరీక్ష షెడ్యూల్పై 6న స్పష్టత ఇవ్వనున్నట్టు ద్వివేది తెలిపారు. -
సెప్టెంబర్ 8న కూడా సచివాలయాల పరీక్ష
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుభవార్త. అర్హతలు ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పోటీ పడేందుకు వీలుగా కొన్ని పోస్టులకు సెప్టెంబర్ 8న రాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో విద్యుత్ శాఖ భర్తీ చేసే లైన్మెన్ ఉద్యోగాలతో కలిపి మొత్తం 20 రకాల ఉద్యోగాలన్నింటికీ సెప్టెంబర్ 1న రాతపరీక్ష నిర్వహించాలని మొదట ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒకే అభ్యర్థి రెండు రకాల పోస్టుల పరీక్షలకు హాజరయ్యేలా సెప్టెంబర్ 1న ఉదయం, సాయంత్రం పరీక్షలు పెట్టడానికి నిర్ణయించింది. అయితే, ఇలా కూడా కొందరు అర్హతలు ఉండి కొన్ని పోస్టులకు పరీక్ష రాయడానికి అవకాశం కోల్పోతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కొన్ని పోస్టులకు సెప్టెంబర్ 8న ఉదయం, సాయంత్రం పరీక్ష నిర్వహించనున్నామని పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాతపరీక్ష తెలుగు, ఇంగ్లిష్లో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉద్యోగాన్ని సాధించాలన్న కసితో ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు. మార్కెట్లోకి వెల్లువలా వచ్చిపడిన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు వస్తున్న అభ్యర్థులతో బుక్స్టాళ్లు రద్దీగా మారిపోయాయి. విజయవాడ లెనిన్ సెంటర్లోని పుస్తకాల షాపులు యువతీయువకులతో నిత్యం కిటకిటలాడుతున్నాయి.. – సాక్షి, విజయవాడ పంచాయతీరాజ్ కమిషనర్తో నేడు సాక్షి టీవీ లైవ్ షో రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం శనివారం ‘సాక్షి’ టీవీ ప్రత్యేక లైవ్ షో కార్యక్రమం నిర్వహించనుంది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్తో ‘సాక్షి’ టీవీ శనివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే లైవ్ షో ద్వారా అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు: 040–23310680, 23310726. కేటగిరీ–1 1. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5 2. మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్(లేదా) వార్డు మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీ 3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 4. వార్డు అడ్మిన్స్ట్రేటివ్ సెక్రటరీ రాతపరీక్ష: సెప్టెంబర్ 1 ఉదయం కేటగిరీ– 2 (గ్రూప్–ఏ) 1. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్–2 2. వార్డు ఎమినిటీస్ సెక్రటరీ గ్రేడ్–2 కేటగిరీ–2 (గ్రూప్–బి) 1. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్–2 2. విలేజ్ సర్వేయర్ గ్రేడ్–3 రాతపరీక్ష: సెప్టెంబర్ 1 సాయంత్రం కేటగిరీ–3 1. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్–2) 2. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 3. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 4. డిజిటల్ అసిస్టెంట్ (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6) 5. పశుసంవర్ధక శాఖ సహాయకుడు 6. ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ (గ్రేడ్–3) 7. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ రాతపరీక్ష: సెప్టెంబర్ 1 సాయంత్రం 8. వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ (గ్రేడ్–2) 9. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్–2) 10. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ రాత పరీక్ష: సెప్టెంబర్ 8 ఉదయం 11. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పరీక్ష: సెప్టెంబర్ 8 సాయంత్రం -
7,966 లైన్మెన్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 7,966 మంది జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఈ మేరకు ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఈ పోస్టులకు ఆగస్టు 17వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గ్రామ సచివాలయాల్లో 2,177 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 682 పోస్టులున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గ్రామ సచివాలయాల్లో 3,866 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 1,241 పోస్టులున్నాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హతలు ఉండీ ఈ ఏడాది జులై 1నాటికి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంది. ఐటీఐ ఎలక్ట్రికల్, వైర్మేన్ ట్రేడ్ కోర్సుతో పాటు పదో తరగతి వారు అర్హులు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులో ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సస్ అండ్ రివైండింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ చేసిన వారు కూడా అర్హులే. రిజర్వేషన్లు, ఇతర వివరాలను ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. మొదటి 20 శాతం పోస్టులను ఓపెన్ క్యాటగిరీలో మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. మిగిలిన 80 శాతం పోస్టులను లోకల్ కోటా ప్రకారం భర్తీ చేస్తారు. ఏ సర్కిల్(జిల్లా) పరిధిలోని వారు ఆ సర్కిల్(జిల్లా)లో పోస్టులకు లోకల్ అభ్యర్థులు అవుతారు. ఓ అభ్యర్థి గరిష్టంగా మూడు సర్కిళ్లలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పారదర్శకంగా పోస్టుల భర్తీ లైన్మెన్ పోస్టులను నిబంధనల మేరకు పారదర్శకంగా భర్తీ చేస్తాం. దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి అందులో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ ప్రాతిపదికన పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం. అక్టోబరు 2 నాటికి లైన్మెన్ విధుల్లో చేరుతారు. – ఎన్.శ్రీకాంత్, ట్రాన్స్కో సీఎండీ లైన్మెన్ పోస్టులకు www. apeasternpower. com, www. apspdcl. in, http:// gramasachivalayam. ap. gov. in, http://59.144.184.105/ jlm19 వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతమున్న పోస్టుల సంఖ్య మారే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. -
80% ఉద్యోగాలు స్థానికులకే..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న 1,26,728 ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులను స్థానికులకే కేటాయిస్తారు. మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్గా తీసుకుని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు ఏ జిల్లాలో చదువుకుంటారో సదరు అభ్యర్థిని స్థానిక కేటగిరీగా గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన మొత్తం పోస్టుల్లో 80 శాతం వారితోనే భర్తీ చేస్తారు. ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి.. వేరే జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో 20 శాతం మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది. వయో పరిమితి.. జీతం ఇలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి 18నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు అమలు చేస్తారు. సంబంధిత ఉద్యోగంలో ఇప్పటికే ఔట్ సోర్సింగ్లో పని చేస్తున్న వారికి వయో పరిమితిలో వారి సర్వీసు కాలానికి సడలింపు ఇస్తారు. గరిష్ట వయో పరిమితిలో అత్యధికంగా ఐదేళ్ల సడలింపు ఇస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్ష అనంతరం ఎంపికయ్యే అభ్యర్థికి మొదటి రెండేళ్లు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించి, ఆ తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగి హోదా కల్పిస్తూ బేసిక్ శాలరీ అమలు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు రూ.15,030 నుంచి రూ.46,060 మధ్య బేసిక్ శాలరీ నిర్ణయించగా.. మిగిలిన పోస్టులకు రూ.14,600 నుంచి రూ.44,870 మధ్య బేసిక్ శాలరీగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తు విధానం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు వెబ్ పోర్టల్స్ను ఏర్పాటు చేసింది. ఏ వెబ్ పోర్టల్ను ఓపెన్ చేసినా.. ఒకే తీరున మొత్తం ఐదు విభాగాలతో కూడిన స్క్రీన్ కనిపిస్తుంది. మొదట నోటిఫికేషన్ అన్న విభాగం ఉంటుంది. దానికి కింద క్లిక్ చేస్తే.. భర్తీ చేసే ఉద్యోగాల వారీగా వివరాలు ఉంటాయి. ఏ ఉద్యోగానికి సంబంధించిన పేరు మీద క్లిక్ చేస్తే.. ఆ ఉద్యోగానికి సంబంధించి జిల్లా వారీగా ఖాళీలు, విద్యార్హత, పరీక్ష విధానం వంటి సమగ్ర వివరాలు ఉంటాయి. వాటి ఆధారంగా అభ్యర్థి తనకు ఆసక్తి ఉన్న ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెప్–1లో పేర్కొన్న రెండో కాలంలో ఉన్న బటన్ క్లిక్ చేసి అభ్యర్థి పేరు, ఆధార్ వివరాలు లేదా ఇతర గుర్తింపు కార్డు వివరాలతోపాటు మొబైల్ నంబర్, ఫొటోను అప్లోడ్ చేస్తే సంబంధిత అభ్యర్థి ఫోన్ నంబర్కు అతని దరఖాస్తుకు సంబంధించి కేటాయించిన ఐడీ వివరాలు మెసేజ్ అందుతుంది. ఆ ఐడీ వివరాల ప్రకారమే అతడు ఆన్లైన్లో తన దరఖాస్తును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ –2 విభాగంలోని బటన్ను క్లిక్ చేస్తే.. అభ్యర్థి మొబైల్కు మెసేజ్ ద్వారా అందిన ఐడీ నంబర్ వివరాలు నమోదుకు బాక్స్లు ఉంటాయి. ఐడీ నంబర్ నమోదుతో పాటు తాను ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారనే వివరాలను అక్కడ నమోదు చేస్తే పూర్తి దరఖాస్తు ఫారం నమూనా ఓపెన్ అవుతుంది. తప్పులు లేకుండా దానిని నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం పూర్తి చేసినట్టు క్లిక్ బటన్ నొక్కే ముందువరకు తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులో పేర్కొన్న వివరాలను మార్చడానికి వీలుండదు. నాల్గవ కాలమ్గా అభ్యర్థి దరఖాస్తుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఉంటాయి. అక్కడ బటన్ క్లిక్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చివరన గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలు ఉన్నాయి. అభ్యర్థికి ఏమైనా సమాచారం కావాలంటే అక్కడ తెలుసుకోవచ్చు. పోస్టుల వారీగా పరీక్ష విధానం.. వివరాలు -
‘అది సాహసోపేతమైన నిర్ణయం’
సాక్షి, అమరావతి : అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు నాయుడు 600 హామీలను ఇచ్చి 6 హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నింటిని అమలు చేస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు.ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. 4లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో సచివాలయానికి 10 మందిని నియమిస్తామని చెప్పారు. సుమారు 37.86వేల మంది కార్యదర్శులను నియమిస్తామన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి వారి ద్వారా ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ద్వేషి అధికారంలోకి వచ్చిన 60రోజుల్లోనే ఎన్నో చారిత్రాత్మక బిల్లును తీసుకొచ్చామని మంత్రి బొత్స సత్యనారయణ అన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. నామినేటేడ్ పదవు, నామినేషన్ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. చంద్రబాబు నాయుడు ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ద్వేషి అని విమర్శించారు. మంచి పనులకు మద్దతు ఇవ్వకుండా చంద్రబాబు సభ నుంచి పారిపోయారని ఆరోపించారు. గత ప్రభుత్వం భూముల పేరుతో రాజధానిలో పెద్ద కుంభకోణం చేశారన్నారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. విజయవాడలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు సెప్టెంబర్ 2న విజయవాడలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టే ప్రాంతాన్ని పార్క్గా అభివృద్ధి చేస్తామన్నారు. -
పట్టణానికి వార్డు సచివాలయం..
పట్టణాల్లోనూ ‘స్థానిక’ పాలనకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సన్నాహాలు చేస్తోంది. నాలుగువేల మందికి ఒక వార్డు సచివాలయం ఏర్పాటుచేయాలని మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు సచివాలయాల గుర్తింపులో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. ఈ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్టణాల్లో కొత్తపాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: గ్రామ సచివాలయాల తరహాలోనే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ వార్డు సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది అక్టోబరు రెండో తేదీ నాటికి ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. పట్టణాల్లో నాలుగు వేల మంది జనాభాకు ఒక వార్డు సచి వాలయాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీనికోసం విధివిధానాలను శనివారం విడుదల చేసింది. వార్డు సచివాలయాల ద్వారా అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నవరత్నాలతో పాటు ఇతర ప్రభు త్వ సంక్షేమ పథకాల అమలు, పన్నుల వసూ ళ్లు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యతలు వార్డు సచివాలయం పర్యవేక్షణలో సాగనున్నాయి. దీనికోసం అధికమంది పట్టణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. పట్టణాల్లో కొలువుల సందడి ప్రారంభం కానుంది. ప్రాంతం జనాభా వార్డు సచివాలయాల సంఖ్య విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ 3,00,000 60 నెల్లిమర్ల నగర పంచాయతీ 29,000 8 పార్వతీపురం మున్సిపాలిటీ 60,000 15 బొబ్బిలి మున్సిపాలిటీ 63,058 16 సాలూరు మున్సిపాలిటీ 54,935 14 ఇదీ పరిస్థితి... జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం 113 వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యే అవకాశముంది. జిల్లాలో ఇటీవల కార్పొరేషన్ హోదా దక్కించుకున్న విజయనగరంతో పాటు సాలూరు, బొబ్బి లి, పార్వతీపురం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 5.70 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఏటా 10.98 శాతం జనాభా వద్ధిరేటును పరిగణనలోకి తీసుకుని, ప్రతీ 4 వేల జనాభాకు ఓ వార్డు సచివాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. దీనికి అనుగుణంగా జిల్లాలో 113 వరకు వార్డు సచి వాలయాలను ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకే వార్డులో నాలుగు వేల మంది జనాభా ఉంటే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారు. వార్డులో అంతకు తక్కువ మంది ఉంటే రెండు, మూడు వార్డులు కలిపి ఒక సచివాలయంగా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లా నుం చి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పం చాయతీల వారీగా ప్రభుత్వానికి క్షేత్రస్థాయి పరిస్థితిపై ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నారు. మరోవైపు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 919 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ‘స్థానిక’ పాలన దిశగా.. వార్డు సచివాలయాల్లో పాలనా కార్యదర్శి, మౌలిక సదుపాయాల కార్యదర్శి, పారిశుద్ధ్యం, విద్య, వార్డు ప్రణాళిక, సంక్షేమం – అభివద్ధి, విద్యుత్తు, ఆరోగ్యం, రెవెన్యూ, వెనుకబడిన వర్గాల రక్షణ కార్యదర్శులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సచివాలయాలతో పాటు వాటి పరిధిలో సేవలందించనున్న వలంటీర్లపై పర్యవేక్షణను కూడా సచివాలయ ఉద్యోగులే నిర్వహిస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను వినియోగించుకుని మిగిలిన అవసరాలకు సిబ్బందిని నియమించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. సచివాలయాల్లో నియామకాలకు ఈనెల 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు రాత– మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను చేపట్టేందుకు కలెక్టర్ పర్యవేక్షణలో యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
గ్రామ కార్యదర్శులకు కొత్త బాధ్యతలు
సాక్షి, ఇల్లందకుంట: గ్రామపంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం మరో 30 కొత్త బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే 6 బాధ్యతలను నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శులకు ప్రభుత్వం మరో 30 అదనపు బాధ్యతలను వీరిపై పెట్టింది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు అసలే కొరతగా ఉన్నారు. ఒక్కో గ్రామ కార్యదర్శి రెండు మూడు గ్రామాలకు ఇన్చార్జీలుగా నెట్టుకొస్తున్నారు. ఆ బాధ్యతలనే మోయలేకుండా ఉన్న గ్రామ కార్యదర్శులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త బాధ్యతలను అప్పగించింది. ప్రతీ గ్రామపంచాయతీకి ఒక కార్యదర్శిని నియమిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామ కార్యదర్శుల పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రకియ కూడా పూర్తయినా కొంతమంది ఎంపికలో తప్పులు దొర్లాయని కోర్టుకు వెళ్లడంతో గ్రామ కార్యదర్శుల నియామకానికి బ్రేక్ పడింది. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కార్యదర్శి గ్రామంలో పాలన బాధ్యతలను చూసుకోవడంతో పాటు సర్పంచ్కు సబార్డినేట్గా వ్యవహరించాలని సూచించింది. పంచాయతీల్లో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, నిర్వహణ, తాగునీరు, వీధిదీపాలు, రోడ్లు, డ్రెయినేజీలు మొక్కలు నాటడం, పారిశుధ్య కార్యక్రమాలు అమలు చేయాలని కోరింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్–42, సెక్షన్–286, సెక్షన్–43 ప్రకారం అప్పగించిన అన్ని బాధ్యతలు విధులు నిర్వర్తించాలని తెలిపింది. సెక్షన్ 6(8) ప్రకారం పంచాయతీ ఎజెండా రూపకల్పన బాధ్యత కా>ర్యదర్శిదేనని గ్రామ పాలకవర్గం అమోదంతో వీటిని అమలు చేయాలని సూచించింది. 24 గంటల్లో అనుమతులు.. భవన నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతి ఇవ్వాలని సూచించింది. అంతేకాకుండా లేఅవుట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 7 రోజుల్లో అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. లేఅవుట్ల అనుమతితో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతీ లే అవుట్లో 15శాతం భూభాగాన్ని తనఖా చేయాలని కోరింది. గ్రామంలో తీసుకునే నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు గ్రామస్తులకు సమాచారం అందించాలని సూచించింది. జనన, మరణాలతో పాటు వివాహా రిజిస్ట్రేషన్ల నిర్వహణ గ్రామ కార్యదర్శి చేయాల్సి ఉంటుంది. ఇవీ మార్గదర్శకాలు కార్యదర్శి ప్రభుత్వానికి సబార్బినేట్గా వ్యవహరించాలి గ్రామసభకు ఎజెండా తయారు చేసి అందులోని అంశాలు సభ్యులందరికి తెలిసేలా ప్రచారం చేయాలి. ప్రతీ మూడు నెలలకొకసారి ఖర్చుకు సంబంధించి లెక్కలను పంచాయతీ అమోదానికి సమర్పించాలి. వరదలు, తుఫాన్లు, అగ్ని, రోడ్లు ప్రమాదాలు సంభవించిన సందార్భాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలి. గ్రామంలో వ్యాధులు ప్రబలినప్పుడు అధికారులకు సమాచారమివ్వాలి. గ్రామాల్లోని అవసరాలను గుర్తించి గ్రామ అభివృద్ధి ప్రణాళిక తయారీలో పాలు పంచుకోవాలి. అలాగే ఎంపీపీ, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ నిర్వహించే నెలవారి సమావేశాలకు హాజరు కావాలి. గ్రామసభలో లబ్ధిదారుల గుర్తింపు, వారికి రుణ పంపిణీ, రుణాల వసూళ్లకు సహకరించాలి. అంశాల వారీగా ఎజెండాలను సిద్ధం చేసి గ్రామపంచాయతీ అమోదం పొందాలి. ఎజెండాను ప్రదర్శించడం దండోరా వేయించడం, గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో నోటీసులను అంటించి ప్రజలకు సమాచార చేరేలా చూడటం. బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ వాడల్లో పర్యటించి ప్రభుత్వ పథకాల పంచాయతీ ఫలాలు అందేలా చూడాలి. వార్షిక పరిపాలన నివేదికను రూపొందించి గ్రామ పంచాయతీ అమోదం తీసుకోవడం. నెలవారీ సమీక్షలు, ప్రగతి నివేదికల రూపకల్పన ఉన్నతాధికారులకు నివేదికను అందించడం. మూడు నెలలకు ఒకసారి ఆర్థిక వ్యవస్థ అమోదించడంతో పాటు ఈవోపీఆర్డీలకు సమాచారం ఇవ్వడం. సమస్యలతో బాధపడుతున్నాం మూడు నుంచి నాలుగేసి గ్రామాలకు ఇన్చార్జీలుగా పని చేయడం ద్వారా పనిభారం పెరుగుతోంది. వారంలో నాలుగు గ్రామాల్లో పర్యటించి ప్రణాళికలు రూపొందించాలంటే ఇబ్బందవుతుంది. జిల్లా కేంద్రాల్లో అనుకోకుండా నిర్వహించే మీటింగ్లకు హడావిడిగా వెళ్లాల్సి వస్తోంది. – వాణి, కార్యదర్శి, శ్రీరాములపల్లి పాలనాపరమైన బాధ్యత తప్పదు కార్యదర్శులు తమ బాధ్యతలను నేరవేర్చాలి ఉంటుంది. పాలనపరమైన బాధ్యతలను చూసుకోవడంతో పాటు సర్పంచ్కు సబార్డినేట్గా వ్యవహరించాలని ప్రభుత్వం సూచించింది. త్వరలోనే కార్యదర్శుల నియామకం జరుగుతుంది. – జయశ్రీ, ఎంపీడీవో -
ఇక పల్లెల్లోనే వివాహ రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: ఇకపై పల్లెల్లోనే వివాహాల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. గ్రామాల్లో జరిగే ప్రతి వివాహాన్ని రిజిస్టర్ చేయాలన్న కొత్త పంచాయతీరాజ్ చట్ట నిబంధనలతో మార్చి నుంచి విధానం అమల్లోకి రానుంది. గ్రామాల్లో రహస్యంగా జరిగే బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇది దోహదపడనుంది. అందరికీ సులభంగా వివాహ రిజిస్ట్రేషన్ పత్రం అందుబాటులోకి రానుంది. పంచాయతీరాజ్ చట్టం లోనే వివాహ నమోదుకు మార్గదర్శకాలు జారీ చేయడంతో దీనిపై మరింత స్పష్టతనిస్తూ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలిచ్చింది. పంచాయతీ కార్యదర్శులదే బాధ్యత.. గ్రామాల్లో జరిగే ప్రతి వివాహాన్ని నమోదు చేసే బాధ్యతను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కట్టబెట్టారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్పై అవగాహన కొరవడటంతో వివాహాల నమోదు ఊపందుకోలేదు. దీంతో పాటు బాల్య వివాహాలు పెరగడంతో దీన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకేలా వివాహాల నమోదుకు వివాహ మెమోరాండం, రిజిస్టర్, సర్టిఫికెట్లను రూపొందించి కార్యదర్శులకు అందజేశారు. కొత్తగా వివాహం చేసుకున్న జంటకు పెళ్లి మెమోరాండం అందజేసి, పూర్తి వివరాలను రిజిస్టర్లో నమోదు చేస్తారు. దీని కోసం ఆధార్కార్డు, పెళ్లి ఆహ్వాన పత్రిక, వివాహ ఫొటోలు, గ్రామంలోని ముగ్గురు సాక్షుల సంతకాలు తీసుకుంటారు. మరు సటి రోజే వివాహ సర్టిఫికెట్ జారీచేస్తారు. అవగాహనా రాహిత్యంతో..: ఉమ్మడి ఏపీలో 2002లోనే వివాహ నమోదు చట్టాన్ని తీసుకొచ్చినా అది 2006 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ప్రతి పెళ్లిని రిజిస్టర్ చేయాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ రిజిస్టర్ చేసుకోవచ్చు. గతంలో వివిధ దశల్లో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్కు అవకాశమిచ్చినా, ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన, చైతన్యం ఏర్పడే దిశలో ప్రచారం కొరవడటంతో వివాహ రిజిస్ట్రేషన్ ఊపందుకోలేదు. ఏటా పెళ్లిళ్ల సీజన్లో పెద్దసంఖ్యలో వివాహాలు జరుగుతున్నా వాటిని రిజిస్టర్ చేసుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల నమోదును కట్టుదిట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు నడుం బిగించింది. -
బయటకు ఈడ్చుకొచ్చి.. చెప్పుతో కొట్టి..
సాక్షి, ప్యాపిలి: తోటి ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడుతున్నాడంటూ గ్రామ కార్యదర్శిని గ్రామస్తులు చితకబాదారు. కర్నూలు జిల్లా ప్యాపిలి గ్రామ పంచాయతీ కార్యదర్శి జనార్దన్, గత కొంత కాలంగా కలచట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శిని వేధింపులకు గురి చేస్తున్నాడు. బుధవారం బాధిత ఉద్యోగినితో పాటు దాదాపు 20 మంది గ్రామస్తులు ఒక్కసారిగా ప్యాపిలి గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి చొరబడి జనార్దన్ను ఈడ్చుకొచ్చారు. తోటి ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి సిగ్గు లేదా అంటూ పలువురు మహిళలు జనార్దన్పై చెప్పులతో దాడి చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు..జనార్దన్ను స్టేషన్కు తరలించారు. అయినప్పటికీ ప్రజలు పోలీస్స్టేషన్కు చేరేవరకు దారి పొడవునా అతనిపై దాడి చేసేందుకు యత్నించారు. జనార్దన్ తనకు రెండు నెలలుగా సెల్ఫోన్లో మెసేజ్లు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇలా మెసేజ్లు పెట్టవద్దని మర్యాద పూర్వకంగా చెప్పినా అతనిలో మార్పు రాలేదని వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా.. తనపై దాడి చేసిన వారిమీద జనార్దన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
గ్రామ కార్యదర్శిని నిర్బంధించిన పింఛన్దారులు
అశ్వరావుపేట (ఖమ్మం): సకాలంలో పింఛను పంపిణీ చేయలేదని గ్రామ పంచాయతీ కార్యదర్శిని కార్యాలయంలోనే పింఛనుదారులు నిర్బంధించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లిలోఈ నెల మంజూరైన పింఛను ఇప్పటి వరకు ఇవ్వకుండా జాప్యం చేయడంతో ఆగ్రహం చెందిన పింఛను దారులు గ్రామ కార్యదర్శిని నిర్బంధించి, పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. -
కుక్కలను చంపించినందుకు కేసు నమోదు
హైదరాబాద్ : వందకు పైగా వీధి కుక్కలను ఒకేసారి చంపించినందుకు మీర్పేట గ్రామ కార్యదర్శిపై పోలీస్ కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ శంకర్ యాదవ్ కథనం ప్రకారం ఇటీవల మీర్పేటలోని పలు కాలనీలలో సుమారు వందకు పైగా కుక్కలకు విష ప్రయోగం ద్వారా గ్రామ కార్యదర్శి భాస్కర్ రెడ్డి చంపించారు. అయితే మూగ జీవులను చంపించే అధికారం గ్రామ కార్యదర్శికి లేదని, పై అధికారుల అనుమతి తీసుకోకుండా, జంతు ప్రేమికులను అవమానపరిచేలా వ్యవహిరించి మూగ జీవుల చావుకు కారకుడైన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికుడు వేముల నర్సింహతో పాటు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో భాస్కర్ రెడ్డిపై 428 ఐపీసీ, 11(1) ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ యానిమల్స్ యాక్ట్ 1960 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.