breaking news
vetlapalem
-
కాకినాడ జిల్లా: రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. ముగ్గురి మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెంలో దారుణం జరిగింది. ఇంటి స్థలం విషయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిపై మరో కుటుంబం దాడి చేసింది. ఘర్షణలో కత్తులతో దాడి చేసుకోవడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఏం జరిగిందంటే?గ్రామంలోని ఎస్సీపేట చెరువు సమీపంలో పండు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టారు. అదే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బచ్చల చక్రయ్య కుటుంబం ప్రయత్నించింది దీంతో ఇరువురి కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో ప్రకాశ్రావు అక్కడికక్కడే మృతి చెందగా.. చంద్రరావు, ఏసు ఆసుపత్రిలో మృతి చెందారు. తీవ్ర గాయాలైన సంజీవ్, పండు, దావీదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భక్తిశ్రద్ధలతో బేతాళస్వామి సంబరం
సామర్లకోట: వేట్లపాలెంలో కొలువైన బేతాళస్వామి సంబరం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఏటా విజయ దశమి అనంతరం వైభవంగా ఈ కార్యక్రమం జరుపుతారు. ఉత్సవంలో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. సంబరం సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. దేవతామూర్తుల వేషధారణలతో గ్రామ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.