-
రాజకీయ కక్షతో విజయవాడ సీపీపై బదిలీ వేటు
సాక్షి, విజయవాడ: రాజకీయ కక్షతోనే విజయవాడ సీపీపై బదిలీ వేటు పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును విజయవాడ సీపీ కాంతిరాణా దర్యాప్తు చేస్తున్నారు. అయితే విచారణ చేస్తున్న కాంతిరాణాపై కక్షతో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఫిర్యాదులతో కూటమి బ్లాక్మెయిల్ చేసింది. ఈ క్రమంలో ష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీని బదిలీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సీఎం జగన్పై హత్యాయత్నం కేసులో ఇప్పటికే వేముల సతీష్ అరెస్టయ్యారు. టీడీపీ నేత బోండా ఉమకు వేముల సతీష్అనుచరుడిగా ఉన్నారు. విచారణ కీలక దశలో ఉండగా సీపీ కాంతిరాణా బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. -
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిగ్ ట్విస్ట్..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కేసులపై విచారణ జరుపుతున్న రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జడ్జి ఎంకే నాగ్పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. ఇక నుంచి ఢిల్లీ లిక్కర్ కేసును కావేరి భావేజా విచారించనున్నారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఢిల్లీ హయ్యర్ జ్యూడీషియల్ సర్వీసెస్కు చెందిన మరో 27 మంది న్యాయమూర్తులను(నాగ్పాల్తో సహా) ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. మరోవైపు ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్ (డీజేఎస్)కి చెందిన 31 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు. కాగా జస్టిస్ నాగ్పాల్మద్యం పాలసీ కేసును ప్రారంభం నుంచి విచారిస్తున్నారు. నాగ్పాల్ ఇక నుంచి ఢిల్లీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంటి పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. సిసోడియా, సింగ్ జ్యూడీషియల్ కస్టడీలో ఉండగా.. కవిత ఈడీ రిమాండ్లో ఉన్నారు. చదవండి: MLC Kavitha: మూడో రోజు ఈడీ విచారణ -
హర్యానా ఘర్షణల ఎఫెక్ట్.. నూహ్ ఎస్పీపై వేటు
చండీగఢ్: హర్యానాలో నెలకొన్న హింస ఎఫెక్ట్తో నూహ్ జిల్లా ఎస్పీపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూహ్ కేంద్రంగా మత ఘర్షణలు చెలరేగిన సోమవారం రోజు సెలవులో ఉన్న ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు వేసింది. జిల్లా కొత్త ఎస్పీగా ఐపీఎస్ నరేంద్ర బిజర్నియా నియమిస్తూ హర్యానా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నూహ్ జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లా అల్లర్లు చెలరేగే ముందు రోజే సెలవులపై వెళ్లారు. దీంతొ ఘర్షణలు మొదలైన సోమవారం నుంచి నూహ్ తాత్కాలిక ఎస్పీగా ఐపీఎస్ అధికారి నరేంద్ర బిజర్నియా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో 2020 ఫిబ్రవరి నుంచి 2021 అక్టోబర్ వరకు నూహ్ జిల్లాలో పోలీస్ బలగాలకు అధిపతిగా ఉన్నారు. తాజాగా వరుణ్ సింగ్లా 160 కిలోమీటర్ల దూరంలోని బివానీ జిల్లాకు ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. సింగ్లా స్థానంలో నూహ్ శాశ్వత ఎస్పీగా శుక్రవారం నరేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు హర్యానా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ మత ఘర్షణలకు కారణమైన వారిని విడిచిపెట్టబోమని, రాష్ట్రంలో పరిస్థితి వేగంగా సాధారణ స్థితికి వస్తోందని పేర్కొన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేంద్రాన్ని త్వరలో నుహ్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: 8 ఫోర్లు జారిపడ్డ లిఫ్ట్.. గుండెపోటుతో మహిళ మృతి #WATCH | Security deployed outside Jama Masjid, Sadar Bazar in Haryana's Gurugram ahead of Friday prayers pic.twitter.com/V3sSwwAlma — ANI (@ANI) August 4, 2023 కాగా సోమవారం వీహెచ్పీ, బజరంగ్దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపు రాజుకున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు ఆరుగురు మత్యువాత పడ్డారు. ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. పలు వాహనాలు, మత ప్రార్థన స్థలాలు, రెస్టారెంట్లు, దుకాణలను అల్లరిమూకలు తగలబెట్టాయి. నూహ్లోని రెండు మసీదులకు గురువారం దుండగులు నిప్పటించారు. దీంతో నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. హింస కారణంగా 176 మందిని అరెస్ట్ చేశారు90 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. VIDEO | Police personnel continue to remain deployed in parts of Gurugram in the aftermath of violence that broke out earlier this week. pic.twitter.com/1H6fHEmWlP — Press Trust of India (@PTI_News) August 4, 2023 నుహ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాలో అలాగే గురుగ్రామ్లోని మూడు సబ్ డివిజన్లు( సోహ్నా, పటౌడీ ,మనేసర్) ఆగస్టు 5 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అయతితే నేడు నూహ్లో నేడు(శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలకు వరకు కర్ఫ్యూ సడలించనున్నారు. సీఎం మనోహర్లాల్ ఖట్టర్ చండీగఢ్లో కేబినెట్ బేటీ ఏర్పాటు చేయనున్నారు. అంతకుముందే నుహ్ జిల్లా పోలీస్ బాధ్యతలను పాల్వాల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేందర్ సింగ్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఎస్పీ సింగ్లా స్థానంలో నరేంద్ర బిజర్నియాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. చదవండి: రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు.. గోవా వెళ్లి మరీ తీసుకొచ్చారు -
మునుగోడు ఉపఎన్నికలో మరో ట్విస్ట్.. రిటర్నింగ్ అధికారి బదిలీ..
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉపఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాథరావును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఎన్నికల గుర్తుల వ్యవహారంలో వివాదం నెలకొన్న తరుణంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు గుర్తు కేటాయింపు విషయంలో జగన్నాథరావు ఇష్టారీతిగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసీ వేగంగా చర్యలు తీసుకుంది. ఆయన స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్కు మునుగోడు ఉపఎన్నికల బాధ్యతలు అప్పగించింది. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు ముగిసిన అక్టోబర్ 17న తనకు రోడ్ రోలర్ గుర్తు కేటాయించారని యుగతులసి అభ్యర్థి శివకుమార్ తెలిపారు. అయితే అక్టోబర్ 18న విడుదలైన జాబితాలో మాత్రం బేబీ వాల్కర్ గుర్తు ఇచ్చారని పేర్కొన్నారు. తమ కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్, క్యాప్, చపాతి రోలర్ వంటి గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ పార్టీ 17వ తేదీ రాత్రి ఆందోళన చేసింది. దీంతో తెల్లారేసరికి గుర్తులు మారిపోయాయని, దీనిపై వివరణ కోసం తాను ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సంప్రదించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని శివకుమార్ ఎన్నికల సంఘానికి బుధవారం ఫిర్యాదు చేశారు. ఆ మరునాడే రిటర్నింగ్ అధికారిని బదిలీ చేస్తూ కేంద్రం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. శివకుమార్కు రోడ్డురోలర్ గుర్తునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: మునుగోడులో గుర్తుల కేటాయింపుపై సీఈసీ సీరియస్.. అంతా మీ ఇష్టమా? -
పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ హెచ్చరికలు
ఛండీగఢ్: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలకు.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక సందేశం పంపించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో దందాలకు పాల్పడవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే.. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను తప్పనిసరిగా కలవాలని కేజ్రీవాల్ అన్నారు. గతంలో.. పంజాబ్ ఎమ్మెల్యేలు కొందరు తమకు అనుకూలంగా ఉండే ఎస్పీలు/ఎస్ఎస్పీలను బదిలీ చేయించుకుని.. తమ నియోజకవర్గాల్లో దందాలను నడిపించుకున్నారని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు మాత్రం అలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పోలీసుల బదీలీలకు సంబంధించిన ప్రక్రియను సీఎం భగవంత్మాన్కు, మంత్రులకు వదిలేయాలని.. ఎమ్మెల్యేలు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని, కేవలం నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటే చాలని అన్నారు. అలా కాకుండా అధికార ధోరణి ప్రదర్శిస్తే.. పరిణామాలు వేరుగా ఉంటాయని, చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలంతా టీమ్గా పని చేయాలని కోరారు. మన వ్యక్తిగత ఆశయాలను వదిలి.. జట్టుగా పని చేస్తే పంజాబ్ పురోగమిస్తుంది అని కేజ్రీవాల్ పిలుపు ఇచ్చారు. ఈ జట్టుకు భగవంత్ మాన్ నాయకుడని కేజ్రీవాల్ నొక్కి చెప్పారు. పార్టీ నాయకులు, వాలంటీర్లు ఎల్లప్పుడూ హుందాగా వ్యవహరించాలని, అసభ్య- అభ్యంతరకరమైన ప్రవర్తనలను సహించేదే లేదని కేజ్రీవాల్ హెచ్చరించారు. (చదవండి: దేశంలోనే ఫస్ట్.. కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. అది జరిగితే..)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement