రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎన్‌.శ్రీధర్ | IAS, IPS Officers Transferred In Telangana state | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎన్‌.శ్రీధర్

Jun 17 2014 2:00 PM | Updated on Sep 2 2017 8:57 AM

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఎన్.శ్రీధర్, నిజామాబాద్ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్గా డి.వెంకటేశ్వరరావు, పోలీసు రిక్రూట్మెంట్ ఐజీగా బి.బాలనాగదేవి, హోంగార్డ్స్ డీఐజీగా జె.అజయ్ కుమార్, పరిపాలన డీఐజీగా డి.కల్పనానాయక్, గోదావరిఖని ఏఎస్పీగా కె.ఫకీరప్పలను నియమిస్తున్నట్లు జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది. తూనికలు, కొలతల కంట్రోలర్గా ఎస్.గోపాల్రెడ్డి, అంబర్పేట సీపీఎల్ కమాండెంట్గా మహేంద్రకుమార్ కొనసాగనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement