-
Kamal Haasan: ఒంటరిగా పోటీ చేసుంటే బాగుండేది!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమలహాసన్ను అంతర్మథనంలో పడేసింది. కనీసం మూడోస్థానం కూడా దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మంగళవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, అందుబాటులో ఉన్న అభ్యర్థులతో సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీకి వచ్చిన ఓట్లు, ఓటమికి గల కారణాలపై చర్చించారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసుంటే బాగుండేదని పార్టీ నేతల వద్ద ప్రస్తావించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రణాళిక పార్టీలో సమూల మార్పులు, క్షేత్రస్థాయి నుంచి బలోపేతానికి కృషి చేద్దామని చెప్పినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇక, కొత్త నిర్ణయాలు, మార్పులతో ముందుకు సాగుదామని, త్వరలో అన్ని వివరాలు ప్రకటిస్తానని కమల్ నేతల వద్ద పేర్కొన్నారు. ఈ సమావేశంపై మక్కల్ నీదిమయ్యం ఉపాధ్యక్షుడు పొన్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి కారణాలపై విశ్లేషించుకున్నామని తెలిపారు. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని ఉంటే కనీసం మూడో స్థానం దక్కి ఉండేదన్న అభిప్రాయాన్ని సమావేశం ముందు పలువురు ఉంచినట్టు పేర్కొన్నారు. ప్రజలతో మమేకం అయ్యే రీతిలో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. చదవండి: తండ్రి ఓటమిపై శృతిహాసన్ కామెంట్స్ వైరల్ -
ఓటు వేసిన హీరో విజయ్.. బిల్డప్ అంటూ ట్రోల్స్
సాక్షి, చెన్నై: వినూత్నమైన పనులు చేస్తూ నటుడు విజయ్ ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటాడు. మంగళవారం జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సైకిల్పై వచ్చి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రంలో అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఆయన సైకిల్పై వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హీరో విజయ్ వేగంగా సైకిల్ తొక్కుతూ పోలింగ్ కేంద్రానికి వస్తుండగా రోడ్డుపై అభిమానులు అయన వెంట బైక్లతో అనుసరించారు. సాధారణ వ్యక్తిలా పోలింగ్ కేంద్రానికి విజయ్ సైకిల్ మీద వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే హీరో విజయ్ తన ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడంపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా ఈ వీడియోను చూసిన నెటిజన్లు హీరో విజయ్ బిల్డప్ కోసమే సైకిల్పై వచ్చాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే విజయ్ సైకిల్ మీద రావడనికి కారణం ఇదే అంటూ ఆయన సోషల్ మీడియా టీం ఓ ప్రకటన విడుదల చేసింది. తలాపతి విజయ్ సైకిల్పై వచ్చి ఓటు వేయడానికి కారణం ఉంది. పోలింగ్ బూత్ తన ఇంటి వెనుక వీధిలో ఉంది. అది ఒక ఇరుకైన వీధి, కారును అక్కడికి తీసుకెళ్లడం కష్టం. అందుకే ఆయన సైకిల్పై పోలింగ్ కేంద్రానికి వెళ్లారని, దీనికి వేరే కారణం లేదని విజయ్ సోషల్ మీడియా టీం పేర్కొంది. #Vijay arrives in cycle to cast his vote #TamilNaduElections pic.twitter.com/iKY4bkIqA8 — BARaju (@baraju_SuperHit) April 6, 2021 -
100 రోజుల్లో చేసి చూపిస్తా: కమల్
సాక్షి, చెన్నై: పదేళ్లలో చేయలేని పనుల్ని వందరోజుల్లో చేసి చూపిస్తానని మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ ధీమా వ్యక్తం చేశారు. భారత దేశానికే కోయంబత్తూరును ఆదర్శనగరంగా మార్చేస్తానని హామీ ఇచ్చారు. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో పోటీచేస్తున్న కమల్ ఆదివారం నియోజకవర్గంలో ఆగమేఘాలపై ప్రచారం చేశారు. రోడ్షో ద్వారా ప్రధాన మార్గాలు, చిన్న చిన్న వీధుల్లో సైతం దూసుకెళ్లారు. సినీ తరహా డైలాగులతో, రాజకీయఅంశాలతో, ప్రజాకర్షణ లక్ష్యంగా, ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ తాము ప్రకటించిన మేనిఫెస్టోను వివరిస్తూ ముందుకుసాగారు. పదేళ్లల్లో ఈ పాలకులు చేయలేని పనుల్ని వంద రోజుల్లో చేసి చూపిస్తానని ప్రకటించారు. ప్రజలు తనకు అండగా ఉంటే చాలు అని, మార్పు నినాదంతో రాష్ట్రం రూపురేఖల్ని మార్చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన సవాల్ విషయంగా కమల్ స్పందిస్తూ, తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన వానతీ శ్రీనివాసన్ ఓ డమ్మీ అంటూ, ఈ విషయంగా ప్రధాని మోదీతో చర్చించేందుకు సైతం సిద్ధం అని పేర్కొన్నారు. కమల్కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్ కుమార్తె సుహాసిని సుడిగాలి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ, కమల్ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: యాక్సిడెంటల్ హోం మినిస్టర్ -
డీఎంకే కూటమిలో కొలిక్కివచ్చిన సీట్ల కేటాయింపు
సాక్షి, చెన్నై : డీఎంకే కూటమిలో సీట్ల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. సీట్ల సర్దు బాటు విషయంలో కాంగ్రెస్, డీఎంకే మధ్య ఒప్పందం కుదిరింది. డీఎంకే 180 స్థానాల్లో.. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కన్యాకుమారి లోక్సభ ఉపఎన్నికలలోనూ కాంగ్రెస్ పోటీ చేయనుంది. కాగా, గడిచిన అసెంబ్లీలో కేటాయించినట్లుగా ఈసారి కూడా 41 సీట్లకు కాంగ్రెస్ పట్టుబట్టడం, డీఎంకే కాదు పొమ్మని ఖరాఖండిగా చెప్పడంతో నిన్నటి వరకు ప్రతిష్టంభన కొనసాగింది. కోరినన్ని సీట్లు కేటాయించకపోగా చర్చల సమయంలో తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని కాంగ్రెస్ అధ్యక్షులు కేఎస్ అళగిరి కన్నీళ్లు పెట్టుకోవడం ఆ పార్టీ నేతలను కలచివేసింది. ఒకనొక దశలో కనీసం 30 సీట్లు ఇవ్వకుంటే డీఎంకేతో తెగతెంపులు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ పరిణామాలను రాహుల్గాంధీకి వివరించి ఆయన సలహామేరకు కూటమిలో కొనసాగడంపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పార్టీ ఆశావహులతో ముఖాముఖి ముగిసిన తరువాత ఆదివారం మరోసారి డీఎంకేతో చర్చలకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో 25 సీట్లకు కాంగ్రెస్ అంగీకారం తెలిపింది. చదవండి : బీజేపీ బీ–టీం నేను కాదు.. ఆ పార్టీనే: కమల్ -
వంద కోట్లు ఇస్తామన్నా, తలొగ్గలేదు: కమల్ హాసన్
సాక్షి, చెన్నై: తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్ నీది మయ్యం నేత కమల్ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు. తమ కూటమి సీఎం అభ్యర్థి కమల్ అని, కూటమి ఖరారైనట్టుగా ఎస్ఎంకే నేత శరత్కుమార్ బుధవారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ పొత్తు ఇంకా ఖరారు కాలేదని కమల్ ప్రకటించడం చర్చకు దారి తీసింది. ఎన్నికల వాగ్దానాలుగా తరచూ కమల్ కొన్ని ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం మహిళలు, యువత, క్రీడాకారులను ప్రోత్సహించే రీతిలో ఏడు వాగ్దానాలు చేశారు. ఈసందర్భంగా మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఎస్ఎంకే, ఐజేకేలతో చేతులు కలిపామేగానీ, పొత్తు ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. పొత్తులు, పందేరాల విషయంగా చర్చలు సాగాల్సి ఉందన్నారు. మంచి వాళ్లు వస్తే తన కూటమిలోకి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, రావాలనుకునే వాళ్లు త్వరగా తరలి రావాలని పిలుపునిచ్చారు. వెన్నంటి పొన్రాజ్ ఇటీవల కలాం లక్ష్య ఇండియాను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పొన్రాజ్ మక్కల్ నీది మయ్యం కట్చిలో చేరడంతో ఆయనకు ఏకంగా పార్టీ ఉపాధ్యక్ష పదవిని కమల్ అప్పగించడం విశేషం. ఎవరూ కొనలేరు.. మైలాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కమల్ ప్రసంగిస్తూ అవినీతిపైనే తన యుద్ధమని, అవినీతి పాలకుల్ని తరిమికొట్టడం లక్ష్యంగా, మార్పును ఆశిస్తున్న ప్రజలకు సుపరిపాలన అందించాలన్న కాంక్షతో ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. తనను కొనేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని, వంద కోట్లు ఇస్తామన్నా, తలొగ్గలేదని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ డైలాగును తాను గతంలోనే దశవాతారం సినిమాలోనూ ముందే చెప్పినట్టు గుర్తు చేశారు. తనను ఎవరూ కొనలేరని, తనకు ఏడున్నర కోట్ల తమిళ ప్రజలు, ఈ ప్రజల నెత్తిన భారంగా ఉన్న రూ.5.70 లక్షల కోట్లు అప్పును తీర్చడం లక్ష్యం అని వ్యాఖ్యానించారు. అధికార, ధనబలంతో ఓట్లను కొనవచ్చన్న ధీమా తో తిరిగే వాళ్లు, కొత్తగా తమిళంపై ప్రేమ, మక్కువ ఉన్నట్టు నటించే వాళ్లు, తమిళం మాట్లాడ లేకున్నానే అని ఆవేదన వ్యక్తం చేసే వాళ్లు రాష్ట్రంలోకి వచ్చి వెళ్తున్నారని, వారిని నమ్మితే ఈ రాష్ట్రం అధోగతిపాలు కావడం తథ్యమని కమల్హాసన్ హెచ్చరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement