-
హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్ శ్రీనివాస్రావు,జస్టిస్ రాజేశ్వర్రావు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి సమ్మతి తెలియ జేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా నియామకానికి జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్రావుకు తగిన అర్హతలు ఉన్నాయని నిర్ణయించింది. వారిద్దరినీ శాశ్వత న్యాయమూర్తు్తలుగా నియమించాలని ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ఆమోదించిన కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారం వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ..సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో 1969, ఆగస్టు 31న జగ్గన్నగారి శ్రీనివాస్రావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీబాయి, మాణిక్యరావు. పాఠశాల విద్య లింగన్నపేటలో.. గంభీరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ నారాయణగూడలోని భవన్స్ న్యూ సైన్స్ కళాశాల నుంచి డిగ్రీ చేశారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1999 ఏప్రిల్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తొలుత జి.కృష్ణమూర్తి వద్ద జూనియర్గా పనిచేశారు. రిట్ సర్వీస్, నాన్ సర్వీస్ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో సమర్థంగా వాదనలు వినిపించారు. 2006 నుంచి స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టే వరకు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2022 ఆగస్టు 16న హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఈ రెండేళ్లలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. ఆయనకు భార్య శ్రీలత ఇద్దరు పిల్లలు ప్రణీత్, ప్రక్షిప్త ఉన్నారు. 2001లో ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మహబూబాబాద్ జిల్లా సూదన్పల్లిలో 1969 జూన్ 30న నామవరపు రాజేశ్వర్రావు జన్మించారు. తల్లిదండ్రులు గిరిజాకుమారి, సత్యనారాయణరావు. పాఠశాల విద్య వరంగల్లో.. హైసూ్కల్, ఇంటర్ గోవిందరావుపేటలో.. డిగ్రీ మహబూబాబాద్లో పూర్తి చేశారు. ఓయూ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు. 2001 ఫిబ్రవరి 22న న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. తొలుత సీవీ రాములు కార్యాలయంలో న్యాయవాదిగా పనిచేశారు. 2015లో ఉమ్మడి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై 2019 వరకు విధులు నిర్వర్తించారు. యూజీసీ న్యాయవాదిగానూ పనిచేశారు. 2016 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2019 వరకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ప్యానల్గా విధులు నిర్వహించారు. 2019 నవంబర్ నుంచి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా పనిచేస్తూ 2022 ఆగస్టు 16న అడిషనల్ జడ్జిగా పదోన్నతి పొందారు. దాదాపు ఈ రెండేళ్ల కాలంలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. -
ఇక వాహన శాశ్వత రిజిస్ట్రేషన్లూ షోరూంలలోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాలు కొనుగోలు చేసిన షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషషన్లు చేసేందుకు రవాణా శాఖ తాజాగా కసరత్తు చేపట్టింది. వాహన యజమానులకు ఇబ్బందులు తలెత్తకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ విధానం ఏపీలో విజయవంతంగా అమలవుతుండటంతో ఇక్కడ సైతం అదే పద్ధతిని అమలు చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై అధ్యయనం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లోని వాహనాల షోరూంల వివరాలతోపాటు నిత్యం నమోదయ్యే వాహనాల వివరాలను సేకరిస్తోంది. ఒక్కో డీలర్ విక్రయించే వాహనాల సంఖ్య, షోరూంలలోనే వాహనాల శాశ్వత నమోదు ప్రక్రియ చేపడితే అవసరమయ్యే సాంకేతిక పరిజా్ఙనం తదితర అంశాలపై ఈ కసరత్తు చేపట్టింది. లోక్సభ ఎన్నికల అనంతరం షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం షోరూంలలో వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) చేస్తున్నారు. రవాణాశాఖ నుంచే ఈ టీఆర్లు అందుతున్నప్పటికీ అందుకోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లట్లేదు. వాహనంతోపాటు షోరూంలోనే టీఆర్ పత్రాలను తీసుకుంటున్నారు. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) కూడా షోరూంలకే బదిలీ అయితే వాహనదారులకు ఇకపై పీఆర్ స్మార్ట్ కార్డులు చేతికి అందుతాయి. 2016లోనే కేంద్రం మార్గదర్శకాలు... కేంద్రం ప్రభుత్వం రహదారి భద్రత చట్టంలో వాహనదారులకు ఊరట కలి్పంచే అనేక అంశాలను పొందుపరిచింది. వాహనాల రిజి్రస్టేషన్లను షోరూంలలోనే పూర్తి చేసేలా 2016లోనే మార్గదర్శకాలు రూపొందించింది. ఏపీ సహా పలు రాష్ట్రాలు ఈ సదుపాయాన్ని వాహనదారులకు అందుబాటులోకి తెచ్చాయి. కానీ తెలంగాణలో మాత్రం వాహనాలు కొనుగోలు చేసిన సమయంలో మొదట టీఆర్ తీసుకొని ఆ తరువాత సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పీఆర్ పొందే విధానం కొనసాగుతోంది. అయితే ఈ ప్రక్రియ దళారులతోపాటు కొందరు అధికారుల అక్రమార్జనకు దోహదం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం మార్గదర్శకాలు రాష్ట్రంలోనూ అమలైతే షోరూంలోనే పీఆర్ స్మార్ట్ కార్డుతోపాటు వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ కూడా లభించనుంది. గ్రేటర్లో భారీగా వాహనాల అమ్మకాలు గ్రేటర్ హైదరాబాద్లోని పది ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో నిత్యం సుమారు 2,500 కొత్త వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో 1,600కుపైగా ద్విచక్ర వాహనాలుకాగా మిగతావి కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం వాహనదారుల చిరునామా పరిధిలోని ఆర్టీఓ కార్యాలయంలో శాశ్వత రిజి్రస్టేషన్ చేస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో రోజుకు వందల సంఖ్యలో శాశ్వత రిజి్రస్టేషన్ల వల్ల వాహనాల రద్దీతోపాటు అందరి సమయం వృథా అవుతోంది. అలాగే ఆన్లైన్లో స్లాట్ నమోదు మొదలు అధికారుల తనిఖీ పూర్తయ్యే వరకు వాహనదారులు ఆర్టీఏ ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. షోరూం రిజిస్ట్రేషన్లు అమల్లోకి వస్తే దళారుల అక్రమ దందాకు తెరపడనుంది. -
తెల్లవెంట్రుకలకు శాశ్వతంగా గుడ్ బై : అమేజింగ్ వీడియో
ప్రస్తుతం కాలంలో తెల్లవెంట్రుకలు ఎక్కువగా బాధించే సమస్య. 50ఏళ్ల దాటిన తరువాత నల్లుజుట్టు తెల్లగా మారితే పెద్దగా సమస్య ఉండదు. కానీ టీనేజ్లోనే తెల్ల జుట్టు రావడంతో చాలి నిరాశకు లోనవు తున్నారు. తెల్లజుట్టు పోగొట్టుకోవడానికి యువత పడని పాట్లు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. మార్కెట్లో రకరకాల కాస్ట్లీ ఉత్పత్తులతోపాటు, సహజంగా దొరికే, ఆర్గానిక్ పదార్థాలతో తయారైన చిట్కాలకోసం ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్విటర్లో ఒక వీడియో హాట్ టాపిక్గా నిలిచింది. ఈ వీడియోలో లవంగాలు, ఉల్లిపాయల పొట్టు, టీ బ్యాగులతో కషాయం తయారుచేశారు. దీన్ని చక్కగా వడబోసుకుని ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. కావాలంటే ఫ్రిజ్లో కూడా పెట్టుకోని వాడుకోవచ్చు. ఈ కషాయాన్ని కుదుళ్లతో సహా తలకు బాగా పట్టించి, బాత్ క్యాప్ లేదా, ప్లాస్టిక్ కవర్తో తలను కవర్ చేసి కొద్దిసేపు వదిలివేయాలి. ఆ తరువాత వాటర్తో కడిగేయాలి. షాంపులాంటివి వాడకూడదు. ఇలా చేయడం ద్వారా తెల్ల వెంట్రుకలకు చక్కటి పరిష్కారం లభిస్తుందని ఈ వీడియోలో పేర్కొనడం విశేషం. దీని వల్ల జుట్టుకూడా ఒత్తుగా పెరుగుతుందట. అయితే దీనిపై నెటిజన్లు కమెంట్లు విభిన్నంగా ఉన్నాయి. నోట్: ఇది అవగాహన కోసం అందించిన వీడియో మాత్రమే. Say Goodbye to gray hair permanently pic.twitter.com/EVYDMLJkTJ — Learn Something (@cooltechtipz) April 4, 2024 -
భారత్లో అఫ్తాన్ ఎంబసీ శాశ్వతంగా మూత, కాంగ్రెస్ రియాక్షన్
Afghanistan Embassy అఫ్ఘానిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్లోని న్యూఢిల్లీ తన రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసి వేసింది. ఈ విషయాన్ని ఆ దేశ రాయబార కార్యాలయం ట్విటర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 1 నుండి తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సెప్టెంబర్ 30న ఎంబసీ చేసిన ప్రకటన తరువాత తాజా నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం నుండి నిరంతర సవాళ్లను ఉటంకిస్తూ న్యూఢిల్లీలోని తన దౌత్య మిషన్ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు భారతదేశంలోని అఫ్ఘానిస్తాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. నవంబర్ 23 నుండి అమల్లో ఉంటుందని తెలిపింది. దురదృష్టవశాత్తు, ఎనిమిది వారాల నిరీక్షంచినప్పటికీ దౌత్యవేత్తలకు వీసా పొడిగింపు , భారత ప్రభుత్వ ప్రవర్తనలో మార్పు లేదని తెలిపింది కాంగ్రెస్ రియాక్షన్ ఈ ప్రకటన తరువాత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ మనీష్ తివారీ బీజేపీపై విమర్శలకు దిగారు. అధికార బీజేపీ సహాయనిరాకరణ కారణంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇది స్పష్టంగా కాబూల్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నమని విమర్శించారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ఎపుడూ నైతికత విలువలకు, సూత్రాలకు కట్టుబడి ఉందన్నారు. The closure of the Embassy of Afghanistan in New Delhi is an attempt by the NDA/ BJP Government to appease the Taliban. Listen in 👇🏾 https://t.co/7x2Wkhk2J9 — Manish Tewari (@ManishTewari) November 24, 2023 -
ఎనర్జీ అసిస్టెంట్లకు సర్కారు వరం.. వారంతా ఇక పర్మినెంట్ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్ల కల నెరవేరింది. వారి జీవితాల్లో పండుగ వచ్చింది. జేఎల్ఎం గ్రేడ్–2 ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల మేరకు అర్హత గల అందరినీ పర్మినెంట్ (రెగ్యులర్) చేస్తూ ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు గురువారం ఉత్తర్వులిచ్చారు. సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా వారి జీతభత్యాలుంటాయని ఆదేశాల్లో వెల్లడించారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించి నిరుద్యోగులకు వరంలా అందించింది. ఏపీ ఈపీడీసీఎల్లో దాదాపు 2,859 మంది, ఏపీ సీపీడీసీఎల్లో 1,910 మంది, ఏపీ ఎస్పీడీసీఎల్లో 3,114 మంది చొప్పున మొత్తం 7,883 మందికి ఉద్యోగం కల్పించింది. వీరికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని సీఎండీలు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement