-
భూకబ్జాలో కొత్త కోణం: దళితుల భూమి వదల్లేదు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు సోదరుడు శంకరరావు భూకబ్జాలో కొత్త కోణం వెలుగు చూసింది. శంకరరావు తమ భూమి ఆక్రమించినట్లు పలువురు దళితులు ఫిర్యాదు చేశారు. అజయ్బాబు, జైన్ అనే వ్యక్తులతో కలిసి శంకరరావు దళిత భూములు ఆక్రమణకు పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తుంగలం సర్వే నంబర్ 29/1లోని ఎకరా 30 సెంట్ల స్థలంలో పల్లా శంకరరావు బెదిరించి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటున్నారు దళితులు. పల్లా సోదరుడి భూ ఆక్రమణలపై అప్పటి హోంమంత్రి చినరాజప్పకు తాము ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు బాధితులు. టీడీపీ హయాంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. చదవండి: కొనసాగుతున్న కబ్జా ప్రకంపనలు -
కొనసాగుతున్న కబ్జా ప్రకంపనలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖపట్నంలో భూకబ్జాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబసభ్యుల చెరలో ఉన్న భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై తెలుగుదేశం నాయకులు గగ్గోలు పెడుతున్నారని మంత్రులు, ప్రజాప్రతినిధులు సోమవారం ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతల తీరును ఎండగట్టారు. ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలేదిలేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. కబ్జాకు గురైన భూముల్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాచేసిన భూముల విలువే రూ.వెయ్యికోట్లని ఎమ్మెల్యే అమర్నాథ్ తెలిపారు. మరోవైపు తాను భూములు ఆక్రమించలేదన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.. తన తమ్ముడి ఆక్రమణలపై మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అడ్డూఅదుపు లేకుండా ప్రభుత్వ భూముల కబ్జా విశాఖపట్నంలో వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఆనాడు టీడీపీ ప్రభుత్వమే సిట్ వేసిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తోందన్నారు. ఆనాడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్ఛగా వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని టీడీపీ నేతలు ఆక్రమించారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎక్కువమంది టీడీపీ నేతలు ఆక్రమణదారులు కావటంతో అప్పటి ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించిందన్నారు. విశాఖలో టీడీపీ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా సాగాయన్నారు. ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. విశాఖలో టీడీపీ నేతలు ఆక్రమించినవి ప్రభుత్వ భూములని రికార్డులే చెబుతున్నాయని గుర్తుచేశారు. అందుకే ప్రభుత్వం వాటిని న్యాయబద్ధంగా తన ఆధీనంలోకి తీసుకుంటోందన్నారు. టీడీపీ నేతల ఘనకార్యాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆక్రమిత భూముల గురించి టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని చెప్పారు. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటే అది కక్షపూరితం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ట్రస్టీగా ప్రజల ఆస్తులను కాపాడటంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందని చెప్పారు. అధికారులు నిగ్గు తేల్చారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అండదండలతో విశాఖ కేంద్రంగా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున భూకబ్జాలు, భూకుంభకోణాలకు పాల్పడ్డారని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కుటుంబం ఆధీనంలో ప్రభుత్వ భూములున్నట్లు అధికారులు నిగ్గుతేల్చారని, వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి, అధికారులకు ఉందని చెప్పారు. విశాఖలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్ధరాత్రి షెడ్లను కూల్చేశారని కొందరు టీడీపీ నేతలు ఆక్రమణదారులకు వత్తాసుపలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఆక్రమించుకున్న రూ.4,776 కోట్ల విలువైన సుమారు 430 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి మంచి సంకల్పంతో చేపట్టిన ఆక్రమిత భూముల స్వాధీన మహాయజ్ఞానికి అన్ని పార్టీలు మద్దతు తెలపాలన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు భూకుంభకోణాలపై పరస్పరం ఆరోపణలు చేసుకున్నారని గుర్తుచేశారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఎస్టేట్, ఈనాం భూములను టీడీపీకి చెందిన కొందరు ఆక్రమించుకున్నారని, వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని చెప్పారు. విశాఖను పరిపాలన రాజధాని చేసి తీరతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, సమన్వయకర్త కె.కె రాజు, పార్టీ నాయకుడు అక్కరమాని వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. కబ్జాకు సూత్రధారి చంద్రబాబే.. విశాఖలో భూదోపిడీ, ప్రభుత్వ భూముల కబ్జాకు సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాచేసిన దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన 40 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని గుర్తుచేశారు. రుషికొండలో యథేచ్ఛగా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లాంటి వారు ఇప్పుడు తమ సహచరుల్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన కుటుంబసభ్యులు ఆక్రమించుకున్న భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందే తప్ప దీన్లో కక్షసాధింపు ఏమీ లేదన్నారు. హుద్హుద్ తుపాను సమయంలో విశాఖలో లక్ష ఎకరాలకు సంబంధించిన రికార్డులు పోయాయని చెబుతున్నారని, అసలు అప్పుడు గాలులే తప్ప లాకర్లలో ఉన్న భూరికార్డులు తడిసిపోయే విధంగా వర్షం పడలేదని చెప్పారు. అప్పటి భూరికార్డులు ఎలా మాయమయ్యాయో చంద్రబాబుకే తెలియాలన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ అభివృద్ధికి రాత్రిబంవళ్లు పనిచేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేక విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు. నేను ఎక్కడా ఆక్రమించలేదు – టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక నియోజకవర్గంలో అధికారులు స్వాధీనం చేసుకున్న ఆక్రమిత భూములు తనవి కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖపట్నంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను భూములు ఆక్రమించినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పారు. గాజువాక నియోజకవర్గంలోని సర్వే నం.33/4లో తన స్థలం పక్కన ఉన్న రాస్తా తనకు మాత్రమే పనికొస్తుందని, అది ఎవరికీ ఉపయోగపడదని, దాన్ని తనకు అప్పగిస్తే.. బదులుగా ఎక్కడైనా స్థలం ఇస్తానని గతంలోనే దరఖాస్తు చేసుకున్నానని, అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించకపోతే.. ఆ భూముల్ని మీరెలా వినియోగించుకుంటారని మీడియా ప్రశ్నించగా.. సమాధానం దాటవేశారు. సర్వే నం.33/2లో తన స్థలం పక్కన చెరువు బంద ఉందని, దాన్ని తాను ఆక్రమించకుండానే ఆక్రమించేసినట్లు చూపించారని చెప్పారు. చట్టం ప్రకారం కుటుంబ భూముల్లో తన వాటా 1/7 మాత్రమేనన్నారు. తుంగ్లాం రెవెన్యూ గ్రామం పరిధిలో తన సోదరుడు పల్లా శంకరరావు పేరుతో ఉన్న ఆక్రమిత భూముల స్వాధీనంపై మాత్రం పల్లా శ్రీనివాసరావు నోరు మెదపకుండానే మీడియా సమావేశం ముగించేశారు. -
పల్లా ఆక్రమణలకు చెక్
-
సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖలో భూబకాసురుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన భూములను అధికారులు ఒక్కొక్కటిగా స్వా«దీనం చేసుకుంటున్నారు. అధికారం అండతో టీడీపీ నేతలు గతంలో చేసిన ఆక్రమణలపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలకు స్పందించిన అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారం అడ్డంపెట్టుకొని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధుగణం దోచుకున్న భూముల బాగోతాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించారు. నగర శివారు ప్రాంతాల్లో భారీ స్థాయి ఆక్రమణలను గుర్తించిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం.. ఆ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించింది. ఒకటి కాదు, రెండు కాదు రూ.669 కోట్ల విలువ చేసే ఏకంగా 38.45 ఎకరాల ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సాక్షి, విశాఖపట్నం/అక్కిరెడ్డిపాలెం(గాజువాక): అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా అండ్ కో సాగించిన భూదందాకు రెవెన్యూ యంత్రాంగం ఫుల్స్టాప్ పెట్టింది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వెంటనే.. ప్రభుత్వ భూములపై ఎగబడి బంధుగణంతో కలిసి అందినకాడికి ఆక్రమించుకున్న పల్లా శ్రీనివాసరావు ఆక్రమణల బాగోతాన్ని సర్వే నంబర్లతో సహా ‘సాక్షి’ పత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు ఆయా సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూముల పరిస్థితులను పరిశీలించి.. నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందించగా.. ఆక్రమణలు తొలగించి.. స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పల్లా ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఆదివారం ఉక్కుపాదం మోపారు. గత 15 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ భూములను ఆక్రమించి పలు కంపెనీలకు లక్షల్లో లీజులకు ఇచ్చి కోట్లు కొల్లగొట్టిన మాజీ ఎమ్మెల్యే బంధుగణం దర్జాగా అనుభవిస్తున్న ప్రభుత్వ ఆక్రమిత భూములను గుర్తించి రెవెన్యూ అధికారులు తొలగింపు చర్యల్ని వేకువ జామున 3 గంటల నుంచి ప్రారంభించారు. మూడు ప్రాంతాల్లో 38.45 ఎకరాలు స్వాదీనం గాజువాక నియోజకవర్గంలో ఎక్కడ ఖాళీ జాగా, పోరంబోకు స్థలం, ప్రభుత్వ భూమి, చెరువు.. ఏం కనిపించినా విడిచిపెట్టకుండా ఆక్రమించేశారు. జగ్గరాజుపేట, తుంగ్లాం, కూర్మన్నపాలెం రెవెన్యూపరిధిలో ఆక్రమించేసుకున్న 38.45 ఎకరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. జగ్గరాజుపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నం. 28–1, 28–2లో 1.26 ఎకరాలు వాగు స్థలం స్వాదీనం చేసుకున్నారు. అదేవిధంగా తుంగ్లాంలోని సర్వే నం.9–6, 10–2లోని 0.92 ఎకరాల పోరంబోకు రాస్తా, సర్వే నం.12–1 నుంచి 12–14 వరకూ 6.15 ఎకరాల యూఎల్సీ ల్యాండ్, 14–1లోని 1.85 ఎకరాల పోరంబోకు చెరువు, సర్వే నం.28లోని 21.67 ఎకరాల పోరంబోకు చెరువు, 29/1బీలోని 0.70 ఎకరాల ఇనాం భూములు, 29/2లోని 0.80 ఎకరాల పోరంబోకు బంద, 30–12, 30–13, 30–15లోని 2.04 ఎకరాల గయాలు భూములు, 33/2, 33/4లోని 1.50 ఎకరాల పోరంబోకు రాస్తా, సర్వే నం.34–2లోని 0.24 ఎకరాల పోరంబోకు స్థలాల్లోని ఆక్రమణలను తొలగించి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కూర్మన్నపాలెంలోని సర్వే నం. 8/6లోని 1.35 ఎకరాల పోరంబోకు భూమిలోని ఆక్రమణలను తొలగించారు. ఆక్రమించిన ప్రభుత్వ భూముల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎల్అండ్టీ, హెచ్పీసీఎల్ సంస్థలకు చెందిన ప్రైవేట్ కాంట్రాక్ట్ పనులకు లక్షల్లో లీజులకు ఇచ్చి కోట్ల రూపాయలు గడించినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తొలగింపు చేపట్టే ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఆయా సర్వే నంబర్లలోని ఆక్రమణలను ఆర్డీవో పెంచల్కిశోర్, గాజువాక తహసీల్దార్ ఎంవీఎస్ లోకేశ్వరరావు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆయా భూములు ఆక్రమణలకు గురయ్యాయని నిర్థారించిన అనంతరం తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ తొలగింపులో గాజువాక, కూర్మన్నపాలెం రెవెన్యూ అధికారులు, సిబ్బందితో పాటు గాజువాక పోలీసులు పాల్గొన్నారు. మార్కెట్ విలువ అక్షరాలా రూ.669.26 కోట్లు పల్లా ఆక్రమించి అనుభవించిన భూముల విలువ మార్కెట్లో భారీగానే ఉంది. తనతో పాటు బంధుగణంతో కలిసి ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. జగ్గరాజుపేట రెవెన్యూ పరిధిలో ఆక్రమించుకున్న 1.26 ఎకరాల భూమి మార్కెట్విలువ రూ.12.81 కోట్లుంది. అదేవిధంగా తుంగ్లాం రెవెన్యూ పరిధిలో ఆక్రమించుకున్న భూముల విలువ రూ. 613,32,48,000. కూర్మన్నపాలెంలో ఆక్రమించిన భూమి విలువ రూ.43.12 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో రూ.669.26 కోట్లు ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దేవస్థాన భూముల ఆక్రమణలపై మరోసారి విచారణ.. ఏళ్ల క్రితం జగ్గరాజుపేట, తుంగ్లాం రెవెన్యూ పరిధిల్లో 40 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ మధ్య కాలంలో వీటిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు గత కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో రికార్డుల పరిశీలనతో పాటు ఆక్రమిత స్థలాల్లో సర్వే జరిపిన అనంతరం ప్రభుత్వ భూములుగా గుర్తించాం. అనంతరం ఆక్రమిత స్థలాలను స్వా«దీనం చేసుకోవడానికి ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆర్డీవో ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగిచే ప్రక్రియ చేపట్టాం. ఆక్రమణల్లో కొన్ని భూములు సింహాచలం దేవస్థానానికి చెందినవని దేవస్థానం ఈవో గుర్తించారు. అవి వారి పరిధిలో ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆక్రమణలు గురైనట్లుగా కనిపిస్తున్నాయి. దీనిపై మరోసారి విచారణ చేపట్టి రికార్డుల పరిశీలన, క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరిగిన తర్వాత చర్యలకు సిద్ధమవుతాం. కబ్జాకు పాల్పడిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. – ఎంవీఎస్ లోకేశ్వరరావు, గాజువాక తహసీల్దార్ -
టీడీపీ కబ్జాపై కొరడా!
అధికారాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్ఛగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారు. ప్రహరీలు కట్టేసుకున్నారు. కబ్జాదారుల్లో ఎక్కువ మంది టీడీపీ నేతలే కావటంతో అప్పటి ప్రభుత్వం అవేమీ చూడనట్లే నటించింది. దీంతో వారు చెలరేగిపోయారు. కానీ ప్రభుత్వం మారింది. సర్కారు భూముల్ని తిరిగి స్వా«దీనం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఏడాదిగా కొరడా ఝుళిపిస్తోంది. ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదంటూ... దాదాపు రూ.4,300 కోట్ల విలువైన భూముల్ని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. దీంతో ఉత్తరాంధ్ర టీడీపీ త్రయం అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు విషప్రచారానికీ వెనకాడటం లేదు. దీనికి తోడు ఎల్లో మాఫియా... రోజుకో రకం అసత్య ప్రచారాలకు దిగుతోంది. సాక్షి, విశాఖపట్నం: ఇవి ప్రభుత్వ భూములు. ఎందుకంటే రికార్డులు అబద్ధాలు చెప్పవు!. అందుకే వాటిని ప్రభుత్వం తిరిగి తన అదీనంలోకి తీసుకుంటోంది. మరి ఇప్పటిదాకా ఇవి ఎవరి అదీనంలో ఉన్నాయి? ఆ ప్రశ్నకు జవాబు తెలిస్తే... టీడీపీ నేతలు ఎంతటి ఘనులో అర్థమయిపోతుంది. తాజాగా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఎంతటి అర్థం లేనివో, ఎందుకింత కడుపుమంటతో రగిలిపోతున్నారో తెలిసిపోతుంది. ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే గాజువాక నియోజకవర్గంలో మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువుల కబ్జాలో ఉన్న రూ.669.26 కోట్లు విలువైన 38.45 ఎకరాల్ని రెవెన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ భూముల్ని పల్లా సోదరుడు శంకరరావు, ఇతర బంధువులు ఆక్రమించుకోవటమే కాక... వాటిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చేసి కోట్లు సంపాదిస్తున్నారు. దీంతో వీటిని తిరిగి స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించారు. పల్లా భూకబ్జాలపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గాజువాక మండలం తుంగ్లాం రెవెన్యూ పరిధిలోని ఆటోనగర్ ఎఫ్ బ్లాక్లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించిన రెవెన్యూ అధికారులు నెలన్నరపాటు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ అనంతరం పల్లా సోదరుడు శంకరరావు గాజువాక మండలం తుంగ్లాం, జగ్గరాజుపేట, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో 38.45 ఎకరాలను కబ్జాచేసినట్లు గుర్తించారు. 15 ఏళ్లకు పైగా ప్రభుత్వ భూములను ఆధీనంలో ఉంచుకుని వీటిని హెచ్పీసీఎల్, ఎల్అండ్టీ, మరికొన్ని ప్రైవేటు కంపెనీలకు లీజులకిచ్చి భారీగా ఆర్జించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు నివేదిక అందటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీవో పి.కిశోర్, గాజువాక తహసీల్దార్ లోకేశ్వరరావు, ఇతర రెవెన్యూ అధికారులు ఆదివారం ఆక్రమిత భూముల స్వా«దీన ప్రక్రియను చేపట్టారు. శంకరరావుకు నోటీసులిచ్చిన అనంతరం నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. పల్లా అనుచరులు అక్కడికి వచ్చి కొంత హడావుడి చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు వారిని అదుపు చేశారు. గతంలో ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది(ఫైల్) 430.81 ఎకరాలు.. రూ.4,291.41 కోట్లు విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల సంరక్షణపై జిల్లా రెవిన్యూ అధికారులు ఏడాదికాలంగా చర్యలు చేపట్టారు. కబ్జాదారులు ఏ పార్టీ వారైనా, ఎంతటి వారైనా ఉపేక్షించకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ విధానం మేరకు.. ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేసి రికార్డుల పరంగా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ గడిచిన ఏడాది కాలంలో ఏకంగా రూ.4,291.41 కోట్లు విలువ చేసే 430.81 ఎకరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక్క విశాఖ రూరల్ మండలంలోనే అత్యధికంగా రూ.1,691 కోట్ల విలువైన భూముల్ని స్వా«దీనం చేసుకున్నారంటే కబ్జాదారులు ఏ స్థాయిలో చెలరేగిపోయారో అర్థంచేసుకోవచ్చు. అక్కడితో ఆగకుండా పదేపదే ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేశారు. స్వా«దీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ నేతల చేతుల్లో ఉన్నవే. తమ భూబాగోతం బయటపడటంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగారు. అచ్చెన్న, అయ్యన్న, బండారు ఏకంగా ఆక్రమణలు తొలగిస్తున్న అధికారుల్ని కూడా తిడుతూ శాపనార్థాలు పెట్టారు. ఐఎఎస్లు, రెవిన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులు, పోలీసులపై నోటిదురుసుతనం ప్రదర్శించారు. టీడీపీ నేతల కబ్జా చెర నుంచి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న కొన్ని భూముల వివరాలు చూస్తే... – టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి గీతం విద్యాసంస్థల పేరుతో రుషికొండ, ఎండాడ పరిసరాల్లో సర్వే నంబర్ 15, 16, 17, 18, 19, 20, 55, 61లో ఉన్న 18.53 ఎకరాల్ని ఆక్రమించి దాని చుట్టూ ప్రహరీ నిర్మించేశారు. అదేవిధంగా రుషికొండలో సర్వే నం. 34, 35, 37, 38లో 20 ఎకరా>ల్లో గార్డెనింగ్, గ్రావెల్ బండ్తో పాటు వివిధ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటిని గుర్తించిన అధికారులు 2020 అక్టోబర్ 24న అక్రమ నిర్మాణాల్ని తొలగించి.. స్వా«దీనం చేసుకున్నారు. – ఆనందపురం–శొంఠ్యాం సమీపంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా బంధువు, జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావు సహా పలువురు టీడీపీ నేతలు టైటిల్ డీడ్ నం.1180లో ఆక్రమించుకున్న రూ.256 కోట్లు విలువ చేసే 64 ఎకరాల భూముల్ని గతేడాది నవంబర్లో స్వాదీనం చేసుకున్నారు. – టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆనందపురం మండలం భీమన్నదొర పాలెంలో సర్వే నం.156లో సుమారు 60 ఎకరాల భూమిని ఆక్రమించేసుకోగా.. గతేడాది డిసెంబర్లో రెవిన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఈ భూముల మార్కెట్ విలువ సుమారు రూ. 300 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. – టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆక్రమించిన రుషికొండ బీచ్రోడ్డులో సర్వే నం.21లో సుమారు రూ.3 కోట్లు విలువ చేసే 6 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని రెవిన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. – టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధువర్గం పేరుతో గాజువాక నియోజకవర్గంలో మూడు రెవిన్యూ గ్రామాల పరిధిలోని సుమారు రూ.669.26 కోట్లు విలువ చేసే 38.45 ఎకరాల్ని ఆదివారం రెవిన్యూ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. – టీడీపీ హయాంలో ప్రభుత్వ భూమిని ప్లే గ్రౌండ్గా మార్చి.. దర్జాగా కబ్జా చేసిన విశ్వనాధ విద్యాసంస్థల నుంచి ఆనందపురంలో సర్వే నంబర్ 122, 123లోని రూ.15 కోట్లు విలువ చేసే 2.5 ఎకరాల భూమిని గతేడాది నవంబర్లో రెవిన్యూ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement