-
రాజధానిని మింగేసిన బాబు భూదందా
సినిమా క్లైమాక్స్లో విలన్ తన ఆచూకీని హీరోకు చెప్పే ముందు ముప్పుతిప్పలు పెడుతుంటాడు.. ఇక్కడున్నాను.. అబ్బే.. మరోచోట ఉన్నానంటూ కన్ఫ్యూజ్ చేస్తుంటాడు.. చంద్రబాబు తీరు కూడా అచ్చం ఇలానే ఉంది. అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు ఈ పెద్దమనిషి కూడా రాష్ట్ర ప్రజానీకంతో ఓ ఆట ఆడుకున్నాడు. ఈ ఆటలో ఎక్కువగా నష్టపోయింది బాబు మాయాజాలం తెలియని సామాన్య రియల్టర్లు, ప్రజలే. అదిగో అక్కడే రాజధాని.. అరెరె కాదు కాదు.. దొనకొండ.. అబ్బే అక్కడా కాదు.. నూజివీడు..తూచ్.. అక్కడొద్దన్నారు.. ఏలూరు సమీపంలో పెడుతున్నాం..లేదు నాగార్జున యూనివర్సిటీ వద్ద అయితే మేలు.. అక్కడే ఫిక్స్.. ఇలా తన ఎల్లో మీడియాకు రోజుకో లీకు ఇచ్చి కథనాలు రాయించారు.. చివరికి లోపాయికారీగా తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బ్రోచర్ సిద్ధం చేసుకుని.. మన రాజధాని ‘అమరావతి’ అంటూ బాంబు పేల్చారు.. బాబు అండ్ గ్యాంగ్, ఆయన వంది మాగధులంతా సూపర్.. డూపర్.. అంటూ కీర్తనలు ఆలపిస్తూ భజనలు చేయసాగారు.. ఇదంతా బాబు అండ్ కోకు మాత్రమే వినోదం. రాజధాని ఎక్కడ ఏర్పాటవుతుందో వారికి ముందే తెలుసు కనుక, వారు ముందస్తుగా అమరావతి చుట్టుపక్కల భూములను కొనేశారు. అదీ రూ.2 లక్షల కోట్ల విలువైన భూములపై పచ్చదండు భూ దండయాత్ర చేసింది. చంద్రబాబు కుట్రలు గ్రహించలేని రియల్టర్లు దారుణంగా మోసపోయి, కోట్లకు కోట్లు నష్టపోయారు. కొందరి జీవితాలు విషాదాంతంగా మిగిలాయి. బాబు అండ్ కో మాత్రం తమ పాచిక పారినందుకు.. రూ.లక్షల కోట్ల భూములను చౌకగా కొట్టేయగలిగినందుకు పగలబడి నవ్వుకుంటూ డబ్బులు లెక్కబెట్టుకునే పనిలో బిజీ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ని రకాలుగా భూ దోపిడీకి పాల్పడవచ్చో ప్రపంచానికి చాటారు. శ్రీకృష్ణ కమిషన్, శివరామకృష్ణన్ కమిటీ సూచనలను బుట్టదాఖలు చేశారు. స్విస్ చాలెంజింగ్ విధానం అంటూ ఊడ్చేశారు. సినిమా సెట్టింగుల్లో పేరుగాంచిన దర్శకుడు రాజమౌళిని రప్పించి ఇదిగిదిగో రాజధాని అంటూ గ్రాఫిక్స్తో మాయ చేశారు. మిడతల దండు దాడి చేసి పచ్చని పంటలను నాశనం చేసినట్టు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై దాడికి తెగబడ్డారు. చంద్రబాబు, లోకేశ్లతో పాటు టీడీపీ నేతలు, నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివ ప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావులతో కూడిన పచ్చ దండు భూములను కొల్లగొట్టింది. రాజధాని విషయంలో నాడు బాబు అండ్ గ్యాంగ్ ఎంత అరాచకంగా, దుర్మార్గంగా, అశాస్త్రీయంగా వ్యవహరించిందో గుర్తు చేస్తూ ఆ బాగోతాలను రేపటి నుంచి ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. -
సోరెన్కు ఈడీ మళ్లీ సమన్లు
రాంచీ: భూ మాఫియాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు సమన్లు జారీ చేసింది. వచ్చే వారంలో 29 లేదా 31వ తేదీల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు విచారణకు రావాలంటూ అందులో కోరింది. తేదీని ఖరారు చేయాలని అందులో స్పష్టం చేసింది. అంతకుముందు, ఈడీ అధికారులు ఈ నెల 27 లేదా 31వ తేదీల్లో ఏదో ఒక రోజు విచారణకు రావాల్సి ఉందంటూ సీఎం సోరెన్ను కోరగా ఆయన స్పదించలేదు. దీంతో, తాజాగా మరోసారి ఆయనకు సమన్లు ఇచ్చారు. -
చట్టమై వచ్చిన స్వప్నం
అడుగడుగునా భూ వివాదాలు.. పేట్రేగిపోతున్న భూ మాఫియా.. అస్తవ్యస్తమైన భూ రికార్డుల వ్యవస్థ.. సివిల్ కోర్టుల్లో పేరుకుపోయిన లక్షలాది భూ వివాద కేసులు.. దశాబ్దాలుగా వ్యవస్థను స్తంభింపజేస్తున్న ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం? ..లాండ్ టైట్లింగ్ చట్టం మాత్రమే భూ చట్టాల నిపుణులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్న వాస్తవమిది. రాష్ట్రాలు ఈ చట్టం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాలు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చెబుతూనే ఉన్నాయి. కానీ, ఈ చట్టాన్ని ఎలా అమలు చేయాలో తెలియక అనేక రాష్ట్రాలు ప్రయత్నించి విఫలమయ్యాయి. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సాహసోపేతంగా లాండ్ టైట్లింగ్ చట్టాన్ని సమర్ధవంతంగా అమల్లోకి తెచ్చింది. మన రాష్ట్రంలో మాత్రమే ఇది సఫలీకృతమైంది. ఈ చట్టం గురించి అవగాహన లేక, ప్రజల విశాల ప్రయోజనాలు పట్టక కొందరు విమర్శలు చేస్తున్నారు. సాక్షి, అమరావతి: భూ యజమానుల హక్కులకు భరోసా ఇచ్చే ఈ చట్టం కోసం ఏపీ ప్రభుత్వం చాలా శ్రమించింది. అనేక ప్రయత్నాల తర్వాతే చట్టాన్ని అమల్లోకి తీసుకురాగలిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో ఎక్కువగా భూ సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. వాటన్నింటికీ పరిష్కారం చూపాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే భూముల సమస్యల పరిష్కారానికి దేశంలో ఎక్కడా లేని విధంగా లాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భూముల రీ సర్వేను కూడా చేపట్టారు. రీ సర్వే విజయవంతంగా జరుగుతున్నా లాండ్ టైట్లింగ్ బిల్లు విషయంలో ఆటంకాలు ఎదురయ్యాయి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రం ఆమోదం కోసం పంపినప్పుడు రకరకాల సమస్యలు ఏర్పడ్డాయి. వాటన్నింటినీ ఓపిగ్గా పరిష్కరించుకుని ఇటీవలే మార్గం సుగమం చేసుకుంది. కేంద్రం ఆమోదం తర్వాత అక్టోబర్ 31వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఎన్డీఏ వచ్చాక డీఐఎల్ఆర్ఎంపీ పథకం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్ఐఎల్ఆర్ఎంపీ పథకం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (డీఐఎల్ఆర్ఎంపీ)గా మారింది. ఎన్ఐఎల్ఆర్ఎంపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉండగా, డీఐఎల్ఆర్ఎంపీలో వంద శాతం నిధులు తామే భరిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం తెలిపింది. 2024 నాటికి దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవడమే లక్ష్యంగా పని చేయాలని నిర్దేశించింది. అదే క్రమంలో 2015లో ఒకసారి, 2019లో మరోసారి ముసాయిదా చట్టాల్ని తయారు చేశారు. దీని ప్రకారమే 2019లో నీతి ఆయోగ్ ఒక నివేదిక ఇచ్చి దేశంలో టైటిల్ గ్యారంటీ చట్టం ఎలా తీసుకురావాలో సూచించింది. నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారమే ఏపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా లాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. భూ హక్కులకు భరోసా ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా అమలు చేయాలనే లక్ష్యాన్ని మొదట సాధించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. రాజస్థాన్లో విఫలం 2015లో కేంద్ర ముసాయిదా చట్టం తయారైనప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో లాండ్ టైట్లింగ్ చట్టం తేవడానికి ప్రయత్నం చేసింది. దాన్ని పట్టణ ప్రాంత భూములకు మాత్రమే పరిమితం చేస్తూ టైటిల్ సరి్టఫికేషన్ చట్టం తెచ్చారు. అయినా సరిగా అమలు చేయలేకపోయారు. 30 ఏళ్ల క్రితమే బీజం వాస్తవానికి దేశంలో భూ హక్కులకు భరోసా ఇవ్వాలనే ప్రయత్నం 1989లో మొట్టమొదటిగా చట్టబద్ధంగా మొదలైంది. అప్పటి ప్లానింగ్ కమిషన్ ప్రొఫెసర్ డీసీ వాద్వా ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్ను కేంద్రం నియమించింది. అప్పట్లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. దేశంలో భూమి రికార్డులను అధ్యయనం చేసి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో నివేదిక ఇవ్వాలని వాద్వా కమిటీని కేంద్రం కోరింది. ఆ కమిషన్ దేశమంతా తిరిగి అధ్యయనం చేసి 1990లో ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చింది. దేశంలో ఇప్పుడున్న రికార్డుల వ్యవస్థ స్థానంలో భూమి హక్కులకి ప్రభుత్వమే పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. భూమి రికార్డుల వ్యవస్థలో ఉన్న లోపాలన్నింటినీ ఆయన తన నివేదికలో వివరించారు. రికార్డుకి గ్యారంటీ లేకపోవడంవల్లే దేశంలో భూ వివాదాలు పెరుగుతున్నాయని, గ్యారంటీ ఇస్తే వివాదాలు తగ్గుతాయని స్పష్టం చేసింది. తద్వారా పెట్టుబడులు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధి వేగవంతం కావాలంటే ఇలాంటి వ్యవస్థ రావాలని వాద్వా ఆ నివేదికలో పేర్కొన్నారు. బ్రిటిష్ హయాం నుంచి ఆలోచనలు భూ హక్కులకు గ్యారంటీ ఇచ్చేందుకు బ్రిటిష్ హయాం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1900 సంవత్సరంలో తొలిసారి ఈ ఆలోచన పుట్టింది. ఆ తర్వాత 1908లో రిజి్రస్టేషన్ చట్టం వచ్చినప్పుడే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలని చూశారు. కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. పేదరికం, నిరక్షరాస్యత వల్ల అప్పట్లో ఆ ఆలోచలను విరమించుకున్నారు. 1971లో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) చట్టం వచ్చినప్పుడు కూడా దీనిపై ఒక చర్చ జరిగింది. అప్పుడూ సాధ్యం కాలేదు. ఆ తర్వాత 1989లో ఆ చట్టం తేవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఏ రాష్ట్రంలోనూ ఆచరణాత్మకంగా ఒక చట్టం రాలేదు. ఏపీ మాత్రమే ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. భూముల వ్యవస్థలో ఇది ఒక కొత్త అధ్యాయంగానే చెప్పాలి. – సునీల్కుమార్, భూ చట్టాల నిపుణులు, నల్సార్ లా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ 2004లో నేషనల్ లాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం వాద్వా కమిటీ సిఫారసుల ఆధారంగానే 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం భూమి రికార్డులపై నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (ఎన్ఎల్ఆర్ఎంపీ) తెచ్చింది. భూమి రికార్డులన్నింటినీ కంప్యూటరీకరించడం, రికార్డుల స్వచ్చికరణ, అన్ని శాఖలతో వాటిని అనుసంధానం చేయడం.. అంతిమంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలనేది ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ఆధారంగానే 2005–06లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో భూ భారతి పేరుతో ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. జిల్లా మొత్తం కొత్త టెక్నాలజీతో రీ సర్వే చేసి టైటిల్ గ్యారంటీ ఇవ్వాలనే ప్రయత్నం అప్పట్లోనే జరిగింది. కానీ, ఆయన హఠాన్మరణంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. సర్వే జరిగింది కానీ ఆ రికార్డును నోటిఫై చేయలేదు. చట్టం కూడా రాలేదు. 2009లో యూపీఏ–2 ప్రభుత్వం టైట్లింగ్ వ్యవస్థ కోసం ఒక ముసాయిదా చట్టాన్ని తీసుకువచ్చింది. అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. -
మరో వివాదంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
-
ఆదిలాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన భూమాఫియా
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement