-
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
బెంగళూరు: లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ను జేడీఎస్ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మంగళవారం హుబ్బళిలో జేడీఎస్ కోర్ కమిటీ భేటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు ప్రజ్వల్ సస్పెన్షన్పై సిఫార్సుచేసిన కొద్ది సేపటికే పార్టీ ప్రజ్వల్ను సస్పెండ్చేసింది. ‘‘ మహిళలను ప్రజ్వల్ లైంగికంగా వేధిస్తున్నట్లు సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఆ వీడియోలు పార్టీకి, పార్టీ నాయకత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయి. పార్టీ నియమావళి, క్రమశిక్షణా నిబంధనావళిని ఉల్లంఘించిన కారణంగా తక్షణం ఆయన్ను సస్పెండ్చేస్తున్నాం’ అని సస్పెన్షన్ ఉత్తర్వులో పార్టీ పేర్కొంది. కోర్ కమిటీ భేటీలో కర్ణాటక రాష్ట్ర జేడీఎస్ చీఫ్ హెచ్డీ కుమారస్వామి కూడా పాల్గొన్నారు. ‘‘ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం నియమించిన సిట్ నివేదిక, ప్రభుత్వ చర్యలను బట్టి సస్పెన్షన్ను పొడిగిస్తామని కుమారస్వామి చెప్పారు. -
కర్నాటక: బీజేపీకి ఊహించని షాక్.. మరో సీనియర్ నేత గుడ్బై
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్.. కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జేడీఎస్లో చేరారు. దీంతో, బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వివరాల ప్రకారం.. బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్ తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అనంతరం, జేడీఎస్ నేత కుమారస్వామి ఆధ్వర్యంతో జేడీఎస్లో చేరారు. ఈ క్రమంలోనే తాను శివమొగ్గ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో నిలుస్తున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ 20న ఒక పార్టీ తరఫున తాను నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. తన అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాతే తాను బీజేపీని వీడుతున్నట్టు వెల్లడించారు. అలాగే, తన నియోజకవర్గ ప్రజలు, నాయకుల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. In another setback to ruling BJP, party MLC from Shivamogga #AyanurManjunath quit the party and joined JD(S)#KarnatakaElection2023 pic.twitter.com/BoJ69ySKBN — TOI Bengaluru (@TOIBengaluru) April 19, 2023 కాగా, బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో అయనూర్ మంజునాథ్ పేరు లేదు. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటికే 222 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే శివమొగ్గ, మాన్వి స్థానాల్లో ఎవరు పోటీలో ఉంటారనే విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన సమయం నుంచి బీజేపీకి వరుసగా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కమలం పార్టీకి ఇప్పటికే మాజీ సీఎం జగదీష్ షెట్టర్, లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు లక్ష్మణ్ సవదితోపాటు పలువురు నాయకులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో, వీరి ప్రభావం బీజేపీపై ఎంతమేర పడనుందో ఎన్నికల ఫలితాల అనంతరం తెలుస్తుంది. I will resign from both, the Legislative Council membership and the primary membership of the BJP. I will file my nomination papers today to contest the elections from the Shivamogga Assembly constituency: Ayanur Manjunath, Member of the Legislative Council pic.twitter.com/eGT8FAsYT7 — ANI (@ANI) April 19, 2023 ఇది కూడా చదవండి: మమతా బెనర్జీకి మరో షాక్ -
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
ఊగిసలాడే ఓటర్లే కీలకం
224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలైంది. మే 10న ఎన్నికలు జరిగి, 13న ఫలితాలు వెలువడుతాయి. నాలుగు దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో అధికారంలో ఉన్న పార్టీ తిరిగి గెలుపొందలేదు. దీన్ని తిరగరాయాలని బీజేపీ అనుకుంటోంది. సంప్రదాయ ధోరణి మీద నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ అదే తనను మెజారిటీ మార్కు దాటిస్తుందని ఆశిస్తోంది. మూడవ స్థానంలో ఉన్న జేడీఎస్, మళ్లీ కింగ్ మేకర్గా ఆవిర్భవించే, వీలైతే కింగ్ అయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. చాలామంది ఓటర్లు ఎన్నికల ప్రకటనకు చాలాముందుగానే తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నది నిర్ణయించుకుంటున్నట్లు గత సర్వేలు సూచిస్తున్నాయి. అందువల్ల ఊగిసలాడే ఓటర్లకు ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమరం ప్రారంభమైంది. సుమారు నెల రోజుల్లో రాష్ట్ర రాజకీయ సంక్లిష్టత విషయంలో ఒక స్పష్టత వస్తుంది. కర్ణాటక ఓటర్లు కొత్త ఎన్నికల ట్రెండును మొదలు పెడతారా, లేక పాత రాజకీయ సంప్రదాయాన్నే పాటిస్తారా అనేది ప్రశ్న. ‘రెండో’ గెలుపు ఒక్కసారే... దాదాపు నాలుగు దశాబ్దాలుగా కర్ణాటక ఎన్నడూ అధి కారంలో ఉన్న పార్టీకి తిరిగి గట్టి మెజారిటీని కట్టబెట్టలేదు. చివరిసారిగా రామకృష్ణ హెగ్డే నేతృత్వంలోని జనతా పార్టీ 1985లో రెండోసారి కూడా స్పష్టమైన మెజారిటీని సాధించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్నడూ మెజారిటీతో గెలుపొందలేదు. 2008లో, 2018లో అది మెజారిటీకి సమీ పంలోకి వచ్చింది. 2008లో స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో అది మెజారిటీని సాధించగలిగింది. 2018లో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా వల్ల బీజేపీ మెజారిటీ సాధించుకుంది. ఈ రెండు ధోరణులను ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ తిరగరాయా లని ఆశ పడుతోంది. సంప్రదాయ ధోరణి మీద నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ అదే తనను మెజారిటీ మార్కు దాటిస్తుందని అనుకుంటోంది. మూడవ స్థానంలో దూరంగా ఉన్న జేడీఎస్, ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించని స్థితిలో అసెంబ్లీలో అధికారంపై ఆశలు పెట్టుకుంటోంది. మళ్లీ ఒకసారి కింగ్ మేకర్గా ఆవిర్భవించే అవకాశం కోసం, వీలైతే మరో సారి కింగ్ అయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. మరోవైపున కర్ణాటకలో నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి రాష్ట్రాన్ని నిలుపుకొనేందుకు సకల ప్రయ త్నాలూ చేస్తోంది. చతుర్ముఖ వ్యూహంతో అది పనిచేస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించకుండానే... మొదటిది: కేంద్రప్రభుత్వం, దాని నాయకత్వానికి స్పష్టంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. గత మూడు నెలలుగా జరుగుతున్నది ఒక సూచిక అనుకుంటే, కేంద్ర నాయకత్వమే నేరుగా ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రదర్శించు కోవడంపై దృష్టి పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏదైనా ప్రస్తా వించడం, కొంత ఆలస్యమైన రెండో ఆలోచనగానే కనబడుతోంది. రెండు: తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అధికారంలో ఉంటు న్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళుతోంది. రాష్ట్ర నాయకులలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప స్పష్టంగానే పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్గా ఉంటారు. రాష్ట్రంలో పార్టీని నిర్మించి ఘనత ఆయ నదే. ఆయన కరిష్మా ఆధారంగానే నిలబడాలని బీజేపీ ఆశలు పెట్టు కుంటోంది. అయితే ఈసారి కాస్త తేడా ఉంది. తాను ఈ దఫా ఎన్ని కల్లో పోటీ చేయనని యడ్యూరప్ప ప్రకటించారు. ఇంతకుముందటి ఎన్నికల్లో పార్టీ తరపున ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు కొచ్చారు. ఇదేమైనా వ్యత్యాసం తేగలదేమో చూడటం ఆసక్తికరం. మూడు: ఉత్తర, కోస్తా కర్ణాటకలో తనకున్న సాంప్రదాయిక మద్దతును నిలబెట్టుకోవలసిన అవసరం బీజేపీకి ఉంది. అలాగే పాత మైసూర్ ప్రాంతంలోకి చొచ్చుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మైసూరు ప్రాంతంలో ఎక్కువగా కాంగ్రెస్, జేడీఎస్ మధ్యే పోటీ ఉంటోంది. అవసరమైన మెజారిటీని సాధించాలంటే ఉత్తర కర్ణా టకలో తన బలమైన ఉనికిని నిలబెట్టుకుంటూనే, పాత మైసూరులో బీజేపీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని ఆ ప్రాంతంలో బీజేపీ జాతీయ నాయకులు పదేపదే పర్యటనలు చేస్తుండటం దీన్నే తేటతెల్లం చేస్తోంది. చివరగా, కర్ణాటకలో విస్తృతమైన సామాజిక ఏకీభావాన్ని నిర్మించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. పార్టీకి లింగాయతులు తమ మద్దతును ఎప్పటిలా కొనసాగిస్తారని నమ్ముతూనే వక్కళిగలు, ఓబీసీలు, దళితుల మద్దతును కూడగట్టుకోవాలని బీజేపీ ప్రయత్ని స్తోంది. రిజర్వేషన్ కోటాను తిరగరాయడం ఈ కులాల్లోకి వ్యాప్తి చెందే లక్ష్యంలో భాగమేనని చెప్పాలి. ఐక్యత లేమి పార్టీకి నష్టం కర్ణాటకలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రధాన పక్షంగానే ఉంటూ వచ్చింది. కానీ ముఠాతత్వం, కీలక సమయాల్లో ఐక్యతా లేమి కారణంగా పార్టీ మట్టికొట్టుకుపోతోంది. అయితే, ఐక్యత లేకుండా ఈ దఫా ఎన్నికల్లో మెజారిటీ వచ్చే అవకాశం కలగానే మిగిలిపోతుందని పార్టీ, ప్రత్యేకించి దాని రాష్ట్ర నాయకత్వం గుర్తిస్తోంది. ఇద్దరు కీలక నేతలు సిద్ధ రామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవిపై తమ ఆకాంక్షలను ఇప్పటికే ప్రకటించారు. అయితే తమ లక్ష్మణ రేఖను మాత్రం వారు దాటలేదు. ఎన్నికల అనంతరమే ముఖ్య మంత్రి అభ్యర్థి నిర్ణయం జరుగుతుందని వీరు ప్రకటించారు. పార్టీలో ఐక్యత కొన సాగుతుందో లేదో తేల్చడానికి అభ్యర్థలకు టికెట్ల పంపిణీ సమయమే లిట్మస్ పరీక్ష అవుతుంది (అయితే ఇప్పటికి రెండు జాబితాలను కాంగ్రెస్ వెలువరించింది). ఇంతవరకు పార్టీ స్థానిక సమ స్యలపై, బీజేపీ పాలనపై దృష్టి పెట్టింది. అయితే, లోక్సభ నుంచి రాహుల్ గాంధీ బహిష్కరణను కూడా తమ ప్రచా రంలో అదనపు అంశంగా జోడించింది. సాంప్రదాయకంగా మద్దతు పొందుతున్న పలు వర్గాల పొత్తును కాంగ్రెస్ పట్టుదలతో సాధించిందని గుర్తుంచుకోవాలి. స్పష్టమైన ఫలితమే... జేడీఎస్ పార్టీ సుదూరంలోని మూడవ శక్తిగా కొనసాగుతోంది. కాంగ్రెస్తో పొత్తు కారణంగా 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ రాజకీయంగా పెను నష్టాన్ని చవిచూసింది. దాంతో పాత మైసూరు రీజియన్లోని జేడీఎస్ సాంప్రదాయిక పునాదిలోకి బీజేపీ చొచ్చుకు వెళ్లడానికి ఇది అనుమతించింది. అయితే కాంగ్రెస్, బీజేపీ రెండూ తమ పార్టీతో టచ్లో ఉంటున్నాయని చెప్పడం ద్వారా జేడీఎస్ నేత కుమారస్వామి రాజకీయంగా సంచలనం సృష్టించారు. చాలామంది ఓటర్లు ఎన్నికల ప్రకటనకు చాలాముందుగానే తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నది నిర్ణయించుకుంటున్నట్లు గత కొన్నేళ్లలో లోక్నీతి–సీఎస్డీఎస్ జరిపిన పోల్ అనంతర సర్వేలు సూచిస్తున్నాయి. క్రితంసారి కర్ణాటక ఎన్నికల విషయంలో ఇదే నిజమైంది. కొంతమేరకు ఇది రాజకీయ పోలరైజేషన్ను ప్రతిఫలించింది. ఈ పార్టీలకు ఉన్న నిబద్ధ ఓటర్ల రీత్యా, ఇది అంత ఆశ్చర్యం కలిగించదు. అందువల్ల ఊగిసలాడే ఓటర్లకు ప్రాధాన్యత పెరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు తీవ్రమవుతాయి. చాలామంది ఎన్నికల వ్యాఖ్యాతలు ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఊహిస్తున్నారు. కానీ ఈ అసెంబ్లీ ఫలితాలు మరింత స్పష్టతతో వెలువడతాయి. సందీప్ శాస్త్రి వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు;జాతీయ సమన్వయకర్త, లోక్నీతి నెట్వర్క్ (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
‘ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 50 లక్షలు ఇచ్చారు.. అందుకే వాళ్లకి ఓటు వేశా’
కోలారు(బెంగళూరు): రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ సొంత ఎమ్మెల్యేలకే ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు చొప్పున ఇచ్చి కొనుగోలు చేసిందని కోలారు ఎమ్మెల్యే కె శ్రీనివాసగౌడ ఆరోపించారు. శనివారం నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు కూడా రూ. 50 లక్షలు ఇవ్వజూపారని, అయితే తాను తీసుకోలేదని అన్నారు. ఎమ్మెల్యేలను లంచం ఇచ్చి కొనుగోలు చేసిన పార్టీ నాయకులు తన గురించి ఆరోపణలు చేయడంలో అర్థం లేదని అన్నారు. జేడీఎస్కి ఎప్పటి నుంచో దూరంగా ఉన్నానని, అందుకే రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్కు ఓటేశానని బహిరంగంగానే చెప్పానని అన్నారు. స్థానిక జేడీఎస్ నాయకులు తన ఇంటి ముందు ఆందోళన చేస్తే తాను భయపడేది లేదని అన్నారు. విలేకరుల సమావేశంలో డీసీసీ బ్యాంకు డైరెక్టర్ బ్యాలహళ్లి గోవిందగౌడ పాల్గొన్నారు. చదవండి: బాబు, పవన్కు రాజకీయ హాలిడే
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- విష్ణుకుమారుడి బెదిరింపులు!
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement