breaking news
India U19 vs Afghanistan U19
-
IND vs AFG ODIs: ఫైనల్ వర్షార్పణం.. విజేత ఎవరంటే?
బెంగళూరు: అండర్–19 ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో భారత్ ‘ఎ’, అఫ్గానిస్తాన్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ వర్షం కారణంగా రద్దు అయింది. దిత్వా తుపాను ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షం కురవడంతో మ్యాచ్ను 31 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్కు దిగిన భారత ‘ఎ’ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసిన దశలో వెలుతురులేమి, వర్షం కారణంగా మ్యాచ్ను నిలిపివేశారు. ఆ తర్వాత ఎంతసేపు ఎదురుచూసినా ఆట తిరిగి ప్రారంభించే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కెప్టెన్ విఫలంభారత బ్యాటర్లలో కనిష్క్ చౌహాన్ (28 నాటౌట్), అభిజ్ఞ కుందు (27) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ విహాన్ మల్హోత్రా (10), వన్ష్ ఆచార్య (2), వఫీ (2), వినీత్ (0) విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో అబ్దుల్ అజీజ్ 2 వికెట్లు పడగొట్టాడు.ఈ టోర్నమెంట్లో భారత్ ‘ఎ’, అఫ్గానిస్తాన్తో పాటు భారత్ ‘బి’ జట్టు కూడా పాల్గొంది. లీగ్ దశలో అఫ్గానిస్తాన్ 4 మ్యాచ్లు ఆడి మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడి 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... భారత ‘ఎ’ జట్టు రెండు విజయాలు, రెండు పరాజయాలతో 8 పాయింట్లతో ఫైనల్కు అర్హత సాధించింది. భారత ‘బి’ జట్టు 4 మ్యాచ్ల్లో ఒక విజయం రెండు పరాజయాలతో చివరి స్థానంలో నిలిచింది. చదవండి: సూర్యవంశీ మరోసారి ఫెయిల్.. మాత్రే వరుస సెంచరీలు -
భారత జట్టు కెప్టెన్గా హైదరాబాద్ కుర్రాడు
అఫ్గానిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్కు బీసీసీఐ తమ జట్లను ప్రకటించింది. అండర్–19 భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ జట్లు అఫ్గానిస్తాన్తో తలపడనున్నాయి. ఇండియా-ఎ జట్టుకు విహాన్ మల్హోత్రా సారథ్యం వహించనుండగా.. బి జట్టు కెప్టెన్గా హైదరాబాదీ ఆరోన్ జార్జ్ ఎంపికయ్యాడు. ఆరోన్ ఇటీవల ముగిసిన బీసీసీఐ అండర్–19 టోర్నీ ‘వినూ మన్కడ్ ట్రోఫీ’లో హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ టోర్నీ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది.ఆరోన్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో గత మూడేళ్లుగా ఆరోన్ జార్జ్ టాప్ స్కోరర్గా నిలుస్తూ వచ్చాడు. ఈ సీజన్లో అతను 2 సెంచరీలు సహా 373 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న అండర్–19 చాలెంజర్ ట్రోఫీలో కూడా అతను నిలకడగా రాణిస్తున్నాడు. స్కూల్ క్రికెట్లో మంచి ప్రదర్శనతో మూడేళ్ల క్రితం హైదరాబాద్ అండర్–16 టీమ్లోకి వచ్చిన అతను విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆకట్టుకున్నాడు. ఇక 2022–23 సీజన్లో ఒక ట్రిపుల్ సెంచరీ సహా 511 పరుగులు సాధించడంతో ఆరోన్కు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం అతను భవాన్స్ కాలేజీలో బీకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. భారత్కు ఆడటమే లక్ష్యం‘ఏ స్థాయిలోనైనా భారత జట్టు తరఫున ఆడాలనేది నా కల. ప్రస్తుత నా ప్రదర్శన, లభిస్తున్న అవకాశాలు ఆ దిశగా తొలి అడుగుగా భావిస్తున్నా. అండర్–19లోకి వస్తే ఐపీఎల్ ఆడే అవకాశాలు కూడా మెరుగవుతాయి’ అని కేరళ మూలాలు ఉన్న ఆరోన్ పేర్కొన్నాడు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఆరోన్ జార్జి వీలు చిక్కినపుడల్లా కొట్టాయంలో ఉంటున్న తన తాత, బామ్మ ఇళ్లకు వెళ్లి వస్తుంటాడు.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే? -
భారత జట్టు ప్రకటన.. రాహుల్ ద్రవిడ్ తనయుడికి ఛాన్స్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్వహించే అండర్–19 ముక్కోణపు సిరీస్లో పాల్గొనే జట్లను జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అండర్–19 భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ జట్లతో పాటు అఫ్గానిస్తాన్ అండర్–19 టీమ్ ఈ సిరీస్లో మూడో జట్టుగా బరిలోకి దిగుతుంది.‘బి’ జట్టు కెప్టెన్గా హైదరాబాద్కు చెందిన ఆరోన్ జార్జ్ ఎంపికయ్యాడు. ‘ఎ’ టీమ్కు పంజాబ్కు చెందిన విహాన్ మల్హోత్రా సారథిగా వ్యవహరిస్తాడు. ఇటీవల ముగిసిన బీసీసీఐ అండర్–19 టోర్నీ ‘వినూ మన్కడ్ ట్రోఫీ’లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది.దీనికి ఆరోన్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఈ టీమ్ నుంచి నలుగురు ప్లేయర్లకు ముక్కోణపు సిరీస్లో ఆడే అవకాశం లభించింది. ‘బి’ కెప్టెన్ ఆరోన్ జార్జ్తో పాటు అండర్–19 ‘ఎ’ టీమ్లోకి హైదరాబాద్కు చెందిన వాఫి కచ్చి, రాపోలు అలంకృత్ (వికెట్ కీపర్), మొహమ్మద్ మాలిక్ ఎంపికయ్యారు.ద్రవిడ్ తనయుడికి చోటు..ఇక బి’ టీమ్లో వికెట్ కీపర్గా భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్(Anvay Dravid)కు అవకాశం దక్కింది. అన్వయ్ ప్రస్తుతం కర్ణాటక తరపున జూనియర్ క్రికెట్ ఆడుతున్నాడు. 16 ఏళ్ల అన్వయ్ ద్రవిడ్ ఇటీవల వినూ మాన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు.అంతేకాకుండా ఈ నెలలో హైదరాబాద్ వేదికగా జరిగిన పురుషుల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో భారత్ సికి అతడు ప్రాతినిథ్యం వహించాడు. జూనియర్ ద్రవిడ్ అండర్-16 స్ధాయిలో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.విజయ్ మర్చంట్ ట్రోఫీ (అండర్-16) 2023-24 సీజన్ అన్వయ్ దుమ్ములేపాడు. ఈ టోర్నమెంట్లో అన్వయ్ కర్ణాటక తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు, 5 మ్యాచ్లలో 45 సగటుతో 357 పరుగులు సాధించాడు. అంతకుముందు ఒక అండర్-16 ఇంటర్-జోనల్ మ్యాచ్లో అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇదే జోరును అన్వయ్ కొనసాగిస్తే త్వరలోనే భారత అండర్-19 జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో తలపడే భారత అండర్-19 ‘ఎ’ జట్టు ఇదేవిహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్ V.K), లక్ష్య రాయచందానీ, రాపోల్ (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, అన్మోల్జీత్ సింగ్, మొహమ్మద్ ఇనాన్, హెనిల్ పటేల్, అశుతోష్ మహిదా, ఆదిత్య రావత్, మొహమ్మద్ మాలిక్.భారత్ అండర్-19 ‘బి’ జట్టుఆరోన్ జార్జ్ (కెప్టెన్), వేదాంత్ త్రివేది, యువరాజ్ గోహిల్, మౌల్యరాజాసిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబరీశ్, బీకే కిషోర్, నమన్ పుష్పక్, హేముచుందేషన్ జె, ఉద్ధవ్ మోహన్, ఇషాన్ సూద్, డి దీపేశ్, రోహిత్ కుమార్ దాస్.చదవండి: PAK vs SL: ఉత్కంఠ పోరు.. శ్రీలంకపై పాకిస్తాన్ గెలుపు -
అందుకే వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయలేదు: బీసీసీఐ
అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్లను ప్రకటించింది. అండర్-19 స్థాయిలోని ‘ఎ’, ‘బి’ జట్లు సొంతగడ్డపై అఫ్గన్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నవంబర్ 17 నుంచి 30 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. కాగా తమ అండర్-19 జట్టు భారత్- ‘ఎ’, ‘బి’ జట్లతో యూత్ వన్డే ట్రై సిరీస్ ఆడనున్నట్లు ఇటీవలే అఫ్గనిస్తాన్ బోర్డు ప్రకటించింది. ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్కప్ టోర్నమెంట్ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉంటుందని పేర్కొంది.ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటుఈ నేపథ్యంలో అఫ్గన్తో సిరీస్కు తాజా తమ జట్లను ప్రకటించిన భారత్.. అనూహ్యంగా ఈ టీమ్ నుంచి సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), కెప్టెన్ ఆయుశ్ మాత్రేలను తప్పించింది. కాగా పద్నాలుగేళ్ల వైభవ్ గత కొంతకాలంగా భారత్ తరఫున సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్ అండర్-19 జట్టులో భాగమైన ఈ బిహారీ పిల్లాడు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో దుమ్మురేపే ప్రదర్శనలు ఇచ్చాడు.ఈ క్రమంలో అఫ్గనిస్తాన్తో ట్రై సిరీస్లోనూ వైభవ్ సూర్యవంశీ భాగం కావడం లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో ఈ సిరీస్ ఆడే రెండు భారత జట్లలోనూ వైభవ్ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. అదే విధంగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రేను కూడా సిరీస్కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అందుకే వైభవ్ను ఎంపిక చేయలేదుఇందుకు గల కారణాన్ని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ‘‘వైభవ్ సూర్యవంశీ పేరును ఈ సిరీస్కు పరిశీలించలేదు. అతడు ఇండియా- ‘ఎ’ తరఫున ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీకి ఎంపికయ్యాడు కాబట్టి.. ఈ సిరీస్ నుంచి పక్కనపెట్టాల్సి వచ్చింది’’ అని స్పష్టం చేసింది.ఇక ముంబై తరఫున ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్న కారణంగా ఆయుశ్ మాత్రేను కూడా పక్కనపెట్టినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. అఫ్గన్ అండర్-19తో తలపడే భారత ‘బి’ టీమ్లో వికెట్ కీపర్గా టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్కు చోటు దక్కడం విశేషం.అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో తలపడే భారత అండర్-19 ‘ఎ’ జట్టు ఇదేవిహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్ V.K), లక్ష్య రాయచందానీ, A. రాపోల్ (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, అన్మోల్జీత్ సింగ్, మొహమ్మద్ ఇనాన్, హెనిల్ పటేల్, అశుతోష్ మహిదా, ఆదిత్య రావత్, మొహమ్మద్ మాలిక్.భారత్ అండర్-19 ‘బి’ జట్టుఆరోన్ జార్జ్ (కెప్టెన్), వేదాంత్ త్రివేది, యువరాజ్ గోహిల్, మౌల్యరాజాసిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబరీశ్, బీకే కిషోర్, నమన్ పుష్పక్, హేముచుందేషన్ జె, ఉద్ధవ్ మోహన్, ఇషాన్ సూద్, డి దీపేశ్, రోహిత్ కుమార్ దాస్.రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత ‘ఎ’ జట్టు ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, విజయ్కుమార్ వైశాక్, యుద్ద్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాష్ శర్మ. చదవండి: శభాష్ షహబాజ్ -
అఫ్గనిస్తాన్తో ‘ట్రై’ సిరీస్.. ధనాధన్కు వైభవ్ సూర్యవంశీ రెడీ!
పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). బిహార్కు చెందిన ఈ పిల్లాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) నమోదు చేసిన తర్వాత.. భారత అండర్-19 జట్టు తరఫునా మెరుపులు మెరిపిస్తున్నాడు.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు వైభవ్. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్తో బిజీగా ఉన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. బిహార్ జట్టు వైస్ కెప్టెన్ (Bihar Vice Captain)గానూ వ్యవహరిస్తున్నాడు.మరోసారి భారత్కు ప్రాతినిథ్యంఅయితే, వచ్చే నెలలో వైభవ్ సూర్యవంశీ మరోసారి భారత్కు ప్రాతినిథ్యం వహించబోతున్నట్లు తెలుస్తోంది. తమ అండర్-19 జట్టు భారత్లో పర్యటించనున్నట్లు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఇటీవలే ప్రకటించింది. భారత అండర్-19 స్థాయిలోని ‘A’, ‘B’ జట్లతో యూత్ వన్డే ట్రై సిరీస్ ఆడనున్నట్లు వెల్లడించింది.జట్టులో చోటు లాంఛనమేఈ నేపథ్యంలో త్వరలోనే వైభవ్ సూర్యవంశీ మళ్లీ భారత జెర్సీలో కనిపించడం లాంఛనమే అని తెలుస్తోంది. ఇక అఫ్గన్- భారత అండర్-19 జట్ల మధ్య ఈ ట్రై సిరీస్ డబుల్ రౌండ్- రాబిన్ ఫార్మాట్లో జరుగనుంది. ప్రతి జట్టు నాలుగు మ్యాచ్లు ఆడుతుంది. మెరుగ్గా ఆడిన రెండు జట్లు ఫైనల్కు చేరతాయి.వరల్డ్కప్ టోర్నీ సన్నాహకంగాకాగా నవంబరు 17 నుంచి నవంబరు 30 వరకు భారత్- అఫ్గన్ అండర్-19 జట్ల మధ్య యూత్ వన్డే ట్రై సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇందుకు వేదిక. కాగా ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్కప్ టోర్నీకి ముందు ఈ సిరీస్ ఇరుజట్లకు సన్నాహకంగా నిలవనుంది. వైభవ్ సూర్యవంశీ వంటి యువ స్టార్లు అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో అడుగుపెట్టేందుకు బాటలు వేయనుంది.ఇదిలా ఉంటే.. భారత్ అండర్-19 జట్టుకు ముంబై ఆటగాడు ఆయుశ్ మాత్రే సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఆయుశ్ జట్టును ముందుకు నడిపించగా.. వైభవ్ ఓపెనర్గా భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు.భారత్- అఫ్గన్ అండర్-19 జట్ల వన్డే ట్రై సిరీస్ షెడ్యూల్ ఇదే👉నవంబరు 17: భారత్-‘ఎ’ వర్సెస్ భారత్-‘బి’👉నవంబరు 19: భారత్-‘బి’ వర్సెస్ అఫ్గనిస్తాన్👉నవంబరు 21: భారత్-‘ఎ’ వర్సెస్ అఫ్గనిస్తాన్👉నవంబరు 23: భారత్-‘ఎ’ వర్సెస్ భారత్-‘బి’👉నవంబరు 25: భారత్-‘బి’ వర్సెస్ అఫ్గనిస్తాన్👉నవంబరు 27: భారత్-‘ఎ’ వర్సెస్ అఫ్గనిస్తాన్👉నవంబరు 30: ఫైనల్.చదవండి: కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు: టీమిండియా కోచ్ కామెంట్స్ వైరల్


