breaking news
India-Russia Relations
-
ఉమ్మడిగా ముందుకెళ్దాం
తియాంజిన్: ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు భారత్–రష్యా సంబంధాలే మూలస్తంభమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం రెండు దేశాలు భుజం భుజం కలిపి పనిచేస్తాయని, ఉమ్మడిగా ముందుకెళ్తాయని అన్నారు. చైనాలోని తియాంజిన్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం రష్యా అధినేత పుతిన్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్థికం, ఇంధనం, ఎరువులు, వాణిజ్యం, అంతరిక్షం, సాంస్కృతిక, భద్రత తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు జరిగాయి. పుతిన్తో సమావేశం అనంతరం మోదీ మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్లో పుతిన్ ఇండియాలో పర్యటించబోతున్నారని, ఆయనకు స్వాగతం పలకడానికి 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. భారత్, రష్యా మధ్యనున్న ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని చెప్పారు. భారత్–రష్యా బంధం కేవలం ఇరుదేశాల ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా కీలకమేనని వివరించారు. అది మానవాళి కోరిక ఉక్రెయిన్లో శాంతి సాధన కోసం ఇటీవల జరిగిన ప్రయత్నాలను మోదీ స్వాగతించారు. ఉక్రెయిన్లో ఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరపడాలని ఆకాంక్షించారు. ఇందుకోసం భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించాలన్నారు. అక్కడ యుద్ధం ముగిసి, శాశ్వత శాంతి నెలకొనాలన్నది మొత్తం మానవాళి కోరిక అని ఉద్ఘాటించారు. పుతిన్తో భేటీ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. కారులో పుతిన్తో కలిసి ప్రయాణిస్తున్న ఫొటోను షేర్ చేశారు. రష్యా అధ్యక్షుడితో అద్భుతమైన చర్చ జరిగిందని పేర్కొన్నారు. కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారం సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నామని వివరించారు. బహుముఖ సంబంధాల్లో చురుగ్గా పురోగతి: పుతిన్ భారత్తో బంధానికి ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పుతిన్ పునరుద్ఘాటించారు. భారత్–రష్యా సంబంధాలు ప్రత్యేక, విశేష వ్యూహా త్మక భాగస్వామ్యం స్థాయికి చేరడం ఆనందంగా ఉందన్నారు. రెండు దేశాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని స్పష్టంచేశారు. రెండు దేశాల బహుముఖ సంబంధాలు చురుగ్గా పురోగతి సాధిస్తూనే ఉంటాయన్నారు. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు పూర్తి సానుకూలంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బహుళ స్థాయి సహకార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, రెండు దేశాల మధ్య పర్యాటకుల మారి్పడి నానాటికీ వృద్ధి చెందుతోందని, ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్, జీ20, ఎస్సీఓ తదితర అంతర్జాతీయ వేదికలపై సన్నిహితంగా, సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని పుతిన్ వెల్లడించారు. ముఖ్యమైన రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షికబంధంపై మోదీ, పుతిన్ సంతృప్తి వ్యక్తంచేశారని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇరుదేశాల మధ్య ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని వారు నిర్ణయానికొచ్చినట్లు పేర్కొంది. ఒకే కారులో మోదీ, పుతిన్ ప్రయాణం తియాంజిన్లో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రష్యాలో తయారైన అరుస్ లిమోజిన్ కారులో ఇరువురు నేతలు ఎస్సీఓ సదస్సు వేదిక నుంచి రిట్జ్–కార్ల్టన్ హోటల్కు చేరుకున్నారు. ఇరువురు నేతలు ఒకే కారులో కలిసి ప్రయాణించడం, సన్నిహితంగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ, పుతిన్ మధ్య వ్యక్తిగత, వ్యూహాత్మక స్నేహ సంబంధాలకు ఈ ఘటన నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. పుతిన్తో సంభాషణ ఎల్లప్పుడూ అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. మోదీతో కలిసి ప్రయాణించాలని మొదట పుతిన్ కోరుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా మోదీ రాక కోసం ఆయన ఎస్సీఓ వేదిక వద్ద 10 నిమిషాల పాటు వేచి చూశారు. హోటల్కు చేరుకున్న తర్వాత కూడా కారులోనే 45 నిమిషాలపాటు మాట్లాడుకోవడం విశేషం. అనంతరం హోటల్ లోపల ద్వైపాక్షిక సమావేశం జరిగింది. అంతకుముందు ఎస్సీఓ వేదిక వద్ద మోదీని పుతిన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. పుతిన్ను కలుసుకోవడం నాకు సదా ఆనందదాయకం అని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మోదీ, పుతిన్, చైనా అధినేత జిన్పింగ్ కలిసి ఉన్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
భారత్–రష్యా క్రూడ్ బంధం!
భారత్ పాలిట వరంలా మారిన రష్యా చమురు అంతర్జాతీయంగా సెగలు పుట్టిస్తోంది. రష్యా చమురుతో ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా ఆజ్యం పోస్తోందంటూ అమెరికా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ సాకుతో మరో 25 శాతం అదనపు సుంకాలను కూడా వడ్డించింది. మరి నిజంగా ఈ చౌక క్రూడ్తో భారతీయ వినియోగదారులు లాభపడుతున్నారా? అంటే సమాధానం కాదనే వస్తోంది. ప్రైవేటు రిఫైనరీ కంపెనీలకు మాత్రం లాభాల పంట పండుతోంది. ఇదే అమెరికా, భారత్ మధ్య ఇప్పుడు ‘క్రూడ్’ యుద్ధానికి దారితీస్తోంది!! రష్యా చౌక చమురు దిగుమతి లాభాల్లో అధిక వాటా దేశీయ ప్రవేటు రంగ రీఫైనలరీ దక్కించుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్తో సహా అనేక దేశాలు ఆంక్షలు, నిషేధం విధించడంతో రష్యా చమురుపై ’మాస్కో రాయితీ’ ప్రకటించింది. ఈ క్రమంలో చమురు దిగుమతి బిల్లు తగ్గించుకునేందుకు భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తోంది. 2002 వరకు కేవలం 1 శాతంగా ఉన్న రష్యా చమురు దిగుమతులు 2025 ఆగస్టు చివరి నాటికి గణనీయంగా 37 శాతానికి చేరుకుంది. గత నాలుగేళ్లుగా భారత్ సగటున రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి చేసుకుంటోది. ఇందులో 40 శాతానికి పైగా ప్రయివేటు రంగ రిఫైనరీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నయరా ఎనర్జీల సొంతం కావడం విశేషం! మిగులు లాభాలన్నీ ప్రయివేటు రిఫైనరీలకే.... రష్యా దిగుమతుల్లో అధిక వాటా పొందుతున్న ప్రయివేటు రిఫైనరీలు చమురు శుద్ధి చేసి ఉత్పత్తులను యూరప్, ఆసియా దేశాలకు భారీగా ఎగుమతి చేసి గణనీయంగా లాభాలు గడించాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాదిలో జీ7+ దేశాలు భారత్, టరీ్కలోని ఆరు రిఫైనరీలు నుంచి 18 బిలియన్ డాలర్లు (21 బిలియన్ డాలర్ల) విలువైన చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నాయని ఫిన్లాండ్కు చెందిన సీఆర్ఈఏ థింక్ట్యాంక్ నివేదిక తెలిపింది. ఇందులో దాదాపు 9 బిలియన్ యూరో ఉత్పత్తులు రష్యా ముడి చమురుతో శుద్ధి చేసినవేనని సీఆర్ఆఏ పేర్కొంది. ఈ ఆరు రిఫైనరీలలో రిలయన్స్ చెందిన జామ్నగర్ శుద్ధి కార్మాగారం అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి జీ7+ దేశాలకు ఎగుమతి అయిన 12 బిలియన్ యూరోల్లో 4 బిలియన్ యూరోలకు పైగా రష్యా చమురుతోనే ఉత్పత్తి చేసినవని సీఆర్ఈఏ వివరించింది. ఈ జాబితాలో ప్రభుత్వరంగ ఓఎన్జీసీ మంగళూరు రిఫైనరీ నాలుగో స్థానంలో, నయరా ఎనర్జీ వడినార్ రిఫైనరీ ఆరోస్థానంలో ఉన్నాయి. దీనికి తోడు ‘భారత్లో వ్యాపార కంపెనీలు రష్యా ఆయిల్ను రీసెల్లింగ్ చేసుకుంటున్నాయి. తద్వారా.. 16 బిలియన్ డాలర్ల అదనపు లాభాలను (దాదాపు రూ.1.35 లక్షల కోట్లు) పొందాయి’ అంటూ అమెరికా ఆరి్థక మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ’రష్యా చౌక చమురు దిగుమతి లాభాల్లో అధిక వాటా ప్రైవేటు కంపెనీలు దక్కించుకుంటున్నాయి’ అనే వాదనలను మరింత బలపరిచాయి. ఇంధన ఎగుమతులతో వేల కోట్ల ఆదాయంభారత్కు ఇంధన ఎగుమతులతో వేల కోట్ల ఆదాయం సమకూరుతోందని కస్టమ్స్ గణాంకాలు చెబుతున్నాయి. 2023–24లో 84.1 బిలియన్ డాలర్లు, 2024–25లో 63.3 బిలియన్ల డాలర్లు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. ఇదే ఆరి్థక సంవత్సరంలో 24 బిలియన్ డాలర్లు డిజిల్ ఎగుమతులు, 15 బిలియన్ డాలర్ల జెట్ ఫ్యూయల్ ఎగుమతులు జరిగాయి. రష్యా ఉరల్స్ క్రూడ్ నుంచి నాణ్యమైన డీజిల్, జెట్ ఫ్యూయెల్ వంటి రవాణా ఇంధనాలు ఎక్కువగా తయారవుతున్నాయి. 2024–25లో 15.5 బిలియన్ డాలర్ల గ్యాసోలిన్, ఇతర చమురు ఉత్పతుల ఎగుమతులు జరగడం గమనార్హం.ఎగుమతుల్లో రిలయన్స్ టాప్ ఈ ఏడాది భారత ఇంధన దిగుమతుల్లో వాల్యూమ్ పరంగా రిలయన్స్, నయారా ఎనర్జీలు రెండింటి వాటా 81 శాతంగా ఉన్నాయి. ఎగుమతుల్లో అధిక భాగం డిజిల్, జెట్ ఫ్యూయెల్ ఉన్నాయి. రోజుకు 9.14 లక్షల బ్యారెళ్ల ఎగుమతితో 71 శాతం వాటా రిలయన్స్దే. రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ జూన్లో రోజుకు 7.46 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి చేసుకుంది. ఇక్కడి నుంచి తన మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 1.36 మిలియర్ల బీపీడీలో 67 శాతం ఎగుమతి చేసింది. మిగిలిన ఇంధన ఎగుమతుల్లో రోజుకు 1.18 లక్షల బ్యారెళ్లతో నయరా ఎనర్జీ, ఓఎన్జీసీకి చెందిన మంగళూరు రిఫైనరీ రోజుకు 1.14 లక్షల బ్యారెళ్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.పరోక్ష సబ్సీడీలతో పీఎస్యూల లాభాలకు గండి ప్రభుత్వరంగ రిఫైనరీ రష్యా చౌక చమురు మిగులు లాభాలకు కేంద్ర ప్రభుత్వ ‘స్థిర ఇంధన ధరల విధానం’ చిల్లుపెడుతోంది. రష్యా ఆయిల్ ఇప్పటికీ బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ కంటే 2–3 డాలర్లు, యూఈఏ బ్యారెల్ క్రూడాయిల్ కంటే 5–6 డాలర్ల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. సాధారణంగా ఇది రీఫైనరీ సంస్థలకు దండిగా లాభాలను తెచ్చిపెడుతోంది. అయితే ప్రభుత్వ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు రష్యా చమురు కొనుగోలు మిగులు లాభాలను పెట్రోల్, డిజిల్, ఎల్పీజీ తదితర పరోక్ష సబ్సీడీలకు వినియోగిస్తున్నాయి. గల్ఫ్, అమెరికా క్రూడాయిల్ ధరలతో పోలిస్తే, 2022 జనవరి నుండి 2025 జూన్ వరకు రష్యా డిస్కౌంట్ ధరలతో ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ దాదాపు 15 బిలియన్ డాలర్లు ఆదా చేసిందని పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2023లో రష్యా రికార్డు స్థాయి డిస్కౌంట్తో భారత్ దాదాపు 7 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేసింది. ఈ మొత్తంలో సింహభాగం రిలయన్స్, నయారా కంపెనీలకే దక్కింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పెట్టుబడులతో రండి!
మాస్కో: సంక్లిష్టమైన భౌగోళిక సవాళ్లు ఎదుర్కోవడానికి భారత్–రష్యా కలిసికట్టుగా పనిచేయాలని, ఇందుకోసం సృజనాత్మక, నూతన మార్గాలు అన్వేషించాలని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పిలుపునిచ్చారు. రెండు దేశాలు పరస్పర సహకార ఎజెండాను మరింత విస్తృతపర్చుకోవాలని, వైవిధ్య భరితంగా మార్చుకోవాలని చెప్పారు. మరిన్ని ఉమ్మడి కార్యక్రమాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యంలో వైవిధ్యం కృషి చేయాలని అన్నారు. భారత్–రష్యా సంబంధాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం, విభిన్నమైన వాణిజ్య సంబంధాలు నెలకొల్పడం మనం ఆశయం కావాలని స్పష్టం చేశారు. జైశంకర్ బుధవారం మాస్కోలో రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్మినిస్టర్ డెనిస్ మంతురోవ్తో సమావేశమయ్యారు. భారత్–రష్యా సంబంధాలు, తాజా పరిణామలపై చర్చించారు. ఇండియా–రష్యా ఇంటర్–గవర్నమెంటల్ కమిషన్ ఫర్ ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్, టెక్నాలాజికల్, కల్చరల్ కో–ఆపరేషన్(ఐఆర్ఐజీసీ–టీఈసీ) ఫ్రేమ్వర్క్లో భాగంగా ఈ చర్చలు జరిగాయి. భారత్పై అమెరికా ప్రభుత్వం భారీగా టారిఫ్లు విధించిన నేపథ్యంలో భారత్–రష్యా సంబంధాల ఆవశ్యకతను జైశంకర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధానంగా ఇరుదేశాల నడుమ ఆర్థిక బంధం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పూర్తి సామర్థ్యం మేరకు కలిసి పనిచేద్దాం భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రష్యా పారిశ్రామికవేత్తలకు జైశంకర్ విజ్ఞప్తి చేశారు. వ్యాపార అభివృద్ధికి భారత్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. నూతన రంగాల్లోనూ స్నేహ సంబంధాలను విస్తరింపజేసుకోవాలని సూచించారు. వ్యాపార, పెట్టుబడుల సంబంధాల్లో పూర్తి సామర్థ్యం మేరకు కలిసి పని చేద్దామని కోరారు. ఇందుకోసం కొన్ని లక్ష్యాలు, గడువులు నిర్దేశించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సమున్నత లక్ష్య సాధన కోసం మనకు మనమే సవాలు విసురుకోవాలని వ్యాఖ్యానించారు. చేతులు కలిపి ఉమ్మడిగా పనిచేస్తే నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి సాధించవచ్చని స్పష్టంచేశారు. ఐఆర్ఐజీసీకి సంబంధించిన వేర్వేరు వర్కింగ్ గ్రూప్లు, బిజినెస్ ఫోరమ్ మధ్య సహకారం కోసం ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకుందామని ప్రతిపాదించారు. ఒకరి ఆలోచనలను మరొకరితో పంచుకోవాలన్నారు. ఇండియా, రష్యాలోని వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఐఆర్ఐజీసీ తోడ్పడుతుందని తెలిపారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కారి్మకులను రష్యాకు పంపించబోతున్నట్లు జైశంకర్ చెప్పారు. సెర్గీ లావ్రోవ్తో సమావేశం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమతుల, స్థిరమైన విధానంలో విస్తరింపజేసుకోవాలని భారత్, రష్యా నిర్ణయించుకున్నాయి. వాణిజ్యం విషయంలో నియంత్రణలు, అవరోధాలను వేగంగా పరిష్కరించుకోవాలని జైశంకర్ చెప్పారు. ఆయన రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్తో భేటీ అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో స్థిరంగా కొనసాగుతున్న అతిపెద్ద సంబంధాల్లో భారత్–రష్యా సంబంధాలు కూడా ఉన్నాయని తెలిపారు. వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలని జైశంకర్, లావ్రోవ్ నిర్ణయానికొచ్చారు. -
పుతిన్కు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధినేత పుతిన్తో శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. రష్యాతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నట్లు పుతిన్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. తన మిత్రుడు పుతిన్తో చక్కటి, సమగ్రమైన సంభాషణ జరిగిందన్నారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ప్రతీకారంగా ఇండియా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం టారిఫ్లు విధించిన నేపథ్యంతో పుతిన్తో మోదీ చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్తో మాటామంతీ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ ఏడాది జరిగే 23వ ఇండియా–రష్యా వార్షిక సదస్సులో పుతిన్కు ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ఉక్రెయిన్ విషయంలో తాజా పరిణామాలను తనతో పంచుకున్నందుకు పుతిన్కు కృతజ్ఞతలు తెలియజేశారని చెప్పా రు. భారత్–రష్యా ద్వైపాక్షిక ఎజెండా ప్రగతిని సమీక్షించామని వెల్లడించారు. ఉక్రెయిన్–రష్యా ఘర్షణ విషయంలో ఇండియా వైఖరి స్థిరంగా ఉన్నట్లు పుతిన్కు మోదీ తెలియజేశారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. శాంతి చర్చలు ప్రారంభించాలని, ఘర్షణకు సాధ్యమైనంత ముగింపు పలకాలని ఉక్రెయిన్, రష్యాలను ఇండియా కోరుతున్న సంగతి తెలిసిందే. భారత భద్రతా సలహాదారు గురువారం రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది భారత్లో పర్యటించబోతున్నారని ఆయన నిర్ధారించారు. -
రష్యాతో వ్యాపారం చేస్తే ఊరుకోం
వాషింగ్టన్: ఉక్రెయిన్పై ఆక్రమణ జెండా ఎగరేసిన రష్యాను నిలువరించేందుకు దాని ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు నాటో కూటమి పరోక్ష చర్యలకు దిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలుసహా పలురకాల వాణిజ్య కార్యకలాపాల కొనసాగిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్లపై నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరికలు చేశారు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని రుట్టే బ్రెజిల్, చైనా, భారత్లను హెచ్చరించారు. బుధవారం అమెరికా సెనేటర్లతో వాషింగ్టన్లో సమావేశమైన అనంతరం మీడియాతో రుట్టే మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను శాంతి చర్చలకు ఒప్పించేలా పుతిన్పై భారత్, చైనా, బ్రెజిల్లు ఒత్తిడితేవాలని రుట్టే వ్యాఖ్యానించారు. ‘భారత ప్రధాన మంత్రి, చైనా అధ్యక్షుడు, బ్రెజిల్ అధ్యక్షుడు... మీరు ఎవరైనా కావొచ్చుగానీ రష్యాతో మీరు ముడిచమురు, సహజ వాయువు కొనుగోలుసహా వాణిజ్య వ్యాపారాలను వెంటనే ఆపేయండి. మీరో విషయం గుర్తుంచుకోవాలి. రష్యాలోని ఆ పెద్దమనిషి(పుతిన్) గనక ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోతే నేను టారిఫ్ల కొరడాతో రంగంలోకి దిగుతా. భారత్, బ్రెజిల్, చైనాలపై 100 శాతం టారిఫ్లు విధిస్తా. ఆర్థిక ఆంక్షలు సైతం విధిస్తా. నా ఈ హెచ్చరికలను మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే. లేదంటే దీని విపరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కోక తప్పదు. కొత్తగా ఈ 100 శాతం టారిఫ్ల బాధ తప్పాలంటే మీరు వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఒత్తిడి బాగా పెంచాలి. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు పుతిన్ను ఒప్పించాలి. పుతిన్ ఆ శాంతి చర్చలకు కట్టుబడి ఉండాలి. పుతిన్కు వెంటనే ఫోన్ చేసి, శాంతి చర్చలపై మరింత సీరియస్గా ఆలోచించాలని సూచనలు చేయండి. మీరు చర్చలపై ముందడుగువేయకుంటే నాటో మాపై 100 శాతం టారిఫ్లు విధిస్తుందట అని పుతిన్కు చెప్పండి. శాంతి ఒప్పందంగనక సాధ్యంకాకపోతే మీ మూడు దేశాలపై టారిఫ్లు విధించడం ఖాయం. ఈ గుదిబండను మీరు మోయకతప్పదు’’’ అని రుట్టే హెచ్చరించారు. ఉక్రెయిన్కు సైనిక మద్దతు మరింత పెంచుతామని, రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై టారిఫ్లను విపరీతంగా పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజు రుట్టే ఇలా భారత్ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. రష్యా, దాని భాగస్వాములపై 100 శాతం సుంకాలు విధిస్తాం: అమెరికా రష్యా ఎగుమతులపై 100 శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. 50 రోజుల్లోపు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే రష్యా నుంచి ముడిచమురును కొనుగోలుచేసే దేశాలపై మరోదఫా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ‘50 రోజుల్లోపు శాంతి ఒప్పందం కుదరాల్సిందే. అది జరక్కపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. టారిఫ్ల మోత మోగిస్తా. ఇతర ఆర్థిక ఆంక్షలు మోపుతా’’ అని ట్రంప్ ప్రకటించారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదం అవసరం లేకుండానే మరోదఫా టారిఫ్లను అమలు చేయవచ్చన్నారు. అత్యధిక కొనుగోలుదారుల్లో భారత్ తాజా అంతర్జాతీయ వాణిజ్య నివేదికల ప్రకారం రష్యా నుంచి ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న, కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా, తుర్కియే తొలి వరసలో ఉన్నాయి. ట్రంప్ నిజంగానే ఆర్థిక ఆంక్షలు విధిస్తే భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్న ఈ తరుణంలో ట్రంప్ కొత్తగా టారిఫ్ల కొరడా ఝులిపిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగే వీలుంది. ట్రంప్ బెదిరింపులపై రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ దీటుగా స్పందించారు. ‘ ట్రంప్తో చర్చలు జరపడానికి రష్యా సిద్ధంగా ఉంది. కానీ రష్యానే బెదిరించాలని చూడటం తగదు. అలి్టమేటం జారీ చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి చర్యలు సానుకూల ఫలితాలను ఇవ్వవని గుర్తుంచుకుంటే మంచిది’ అని సెర్గీ వ్యాఖ్యానించారు. -
India-Russia relations: మాస్కోలో మోదీ.. నేడు పుతిన్తో చర్చలు
మాస్కో/న్యూఢిల్లీ: భారత్, రష్యాల మైత్రీ బంధాన్ని నూతన సమున్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ప్రధాని మోదీ రెండ్రోజుల రష్యా పర్యటన ఆరంభమైంది. 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ సోమవారం రష్యాకు విచ్చేశారు. మంగళవారం ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ అల్పాహారం అనంతరం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. తర్వాత దౌత్య, అధికారిక బృందాలతో కలిసి వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాల మధ్య పటిష్ట మైత్రి, సహకార బంధంపై సమగ్ర, లోతైన చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్ను రష్యా దురాక్రమించిన అంశం చర్చకొచ్చే అవకాశముంది. రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా భారతీయులను రిక్రూట్ చేసుకుని ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాలకు తరలించిన ఉదంతాలు చర్చకొచ్చే అవకాశముంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మోదీకి పుతిన్ విందు...మాస్కో శివారులోని నోవో–ఒగార్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్ సాదరంగా ఆహా్వనించారు. ఆప్యాయంగా ఇరునేతలూ హత్తుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి మోదీకి పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారు. మోదీ పాలనలో భారత్ సాధించిన అభివృద్ధిని పుతిన్ ఈ సందర్భంగా కొనియాడారు. అంతకుముందు‡మాస్కో విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి రష్యా మొదటి ఉపప్రధాని డెనిస్ మాన్ట్సురోవ్ సాదర స్వాగతం పలికారు. అక్కడే మోదీ రష్యా సైనికుల సైనికవందనం స్వీకరించారు. ది కార్ల్టన్ హోటల్ల్లో మోదీకి పెద్దసంఖ్యలో భారత సంతతి ప్రజలు స్వాగతం పలికారు. హిందీ పాటలకు భారతీయులు, రష్యా కళాకారులు నృత్యంచేస్తూ మోదీని ఆనందంలో ముంచెత్తారు. ‘ఇప్పుడే మాస్కో నేలపై అడుగుపెట్టా. మిత్రుడు పుతిన్తో భేటీకి ఎదురుచూస్తున్నా. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకోబోతున్నా. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల స్థాపనకు ఇరువురం మా వంతు కృషిచేస్తాం’’ అని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. -
తగ్గేదేలే! భారత్కు చమురు సరఫరాలో రష్యానే టాప్
భారత్కు ముడి చమురు సరఫరా చేయటంలో సౌదీ అరేబియా, ఇరాక్లను వెనక్కి నెట్టింది రష్యా. ఈ ఏడాది అక్టోబరులో అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా నిలిచింది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతం. అదే ఈ ఏడాది అక్టోబరులో రోజుకు 9,35,556 పీపాల చమురును దిగుమతి చేసుకోవడం గమనార్హం. దీంతో దేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 22 శాతానికి చేరింది. మరోవైపు.. ఇరాక్ నుంచి 20.5 శాతం, సౌదీ అరేబియా నుంచి 16 శాతం మాత్రమే ముడి చమురును దిగుమతి చేసుకుంది భారత్. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య చేపట్టిన తర్వాత మాస్కో నుంచి భారత్కు ముడి చమురు దిగుమతి గణనీయంగా పెరిగింది. పశ్చిమ దేశాలు రష్యా చమురు ఎగమతులపై ఆంక్షలు విధించడంతో రాయితీ ధరకు విక్రయించేందుకు ముందుకొచ్చింది మాస్కో. అందిపుచ్చుకున్న భారత్ భారీ ఎత్తున దిగమతులను పెంచుకుంది. డిసెంబరు 2021లో రష్యా నుంచి భారత్కు రోజుకి 36,255 పీపాల చమురు మాత్రమే వచ్చింది. అదే ఇరాక్ నుంచి 1.05 మిలియన్లు, సౌదీ అరేబియా 9,52,625 బ్యారెళ్ల చమురు దిగుమతి జరిగింది. ఈ ఏడాది మార్చిలో రష్యా నుంచి భారత్కు రోజుకు 68,600 పీపాల ముడి చమురు రాగా.. మే నెలలో అది 2,66,617 పీపాలకు పెరిగింది. జూన్ నాటికి గరిష్ఠంగా 9,42,694కు చేరింది. మరోవైపు.. ఆ నెలలో రోజుకు 1.04 మిలియన్ బీపీడీలతో ఇరాక్ అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. రష్యా రెండో స్థానానికి చేరింది. ఇదీ చదవండి: చుక్కలనంటుతున్న అద్దెలు, కట్టలేక ఖాళీ చేస్తున్న జనాలు -
సవాళ్లకు నిలిచిన ఇండో– రష్యా స్నేహం
న్యూఢిల్లీ: భారత్, రష్యాల స్నేహబంధం కాలపరీక్షను తట్టుకొని నిలిచిందని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. రెండు దేశాలు కలిసి ప్రపంచ ఇంధన మార్కెట్లో స్థిరత్వం తెస్తాయని అభిలíÙంచారు. రష్యాలోని వ్లాడివోస్టోక్ నగరంలో జరుగుతున్న ఈఈఎఫ్(ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరమ్) సమావేశాలనుద్దేశించి ఆయన ఆన్లైన్లో ప్రసంగించారు. కరోనా సమయంలో ఇరు దేశాల మధ్య సహకారం మరింత పెరిగిందని మోదీ చెప్పారు. రష్యా తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పుతిన్ చేపడుతున్న చర్యలను మోదీ కొనియాడారు. ఈ విషయంలో రష్యాకు భారత్ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందన్నారు. రష్యాలో సహజవనరులున్నాయని, భారత్లో మానవవనరులున్నాయని, రెండూ కలిసి అభివృద్ధి చెందేందుకు అనేక అవకాశాలున్నాయని మోదీ అభిప్రాయపడ్డారు. యాక్ ఫార్ ఈస్ట్ పాలసీలో భాగంగా 2019లో జరిపిన రష్యా పర్యటనను ఆయన గుర్తు చేసుకున్నారు. రష్యాతో కీలక, నమ్మక వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంలో ఈ పాలసీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కరోనాతో వైద్యారోగ్య రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యత తెలియవచి్చందన్నారు. అగ్రో, సెరామిక్స్, రేర్ఎర్త్ మినరల్స్, డైమండ్స్ తదితర రంగాల్లో కొత్త అవకాశాలను ఇరుదేశాలు అన్వేíÙస్తున్నాయని చెప్పారు. రష్యా తూర్పు ప్రాంతానికి చెందిన 11 ప్రాంతాల గవర్నర్లను భారత్లో పర్యటించాలని మోదీ ఆహా్వనించారు. -
బ్రహ్మోస్కు పోటీగా చైనా కొత్త క్షిపణి
బీజింగ్: భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా చైనాలోని ఓ మైనింగ్ సంస్థ సూపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఈ క్షిపణిని చైనా మిత్రదేశం పాకిస్తాన్ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర చైనాలోని ఓ రహస్య ప్రాంతంలో సోమవారం గువాంగ్డాంగ్ హోంగ్డా బ్లాస్టింగ్ కంపెనీ ఈ క్షిపణి పరీక్ష జరపగా, అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నట్లు తేలిందంటూ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. హెచ్డీ–1 అని పేరుపెట్టిన ఈ క్షిపణిని హోంగ్డా సంస్థ తన సొంత ఖర్చుతో అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వం ఆమోదించాక హోంగ్డా కంపెనీ ఈ క్షిపణిని ఇతర దేశాలకు అమ్మనుంది. -
‘అణు’ ఆటంకాలను అధిగమిద్దాం
మాస్కో: రక్ష ణ, ఇంధనం, పెట్టుబడుల రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, సహకారాన్ని బలోపేతం చేయాలని భారత్, రష్యా సంకల్పించాయి. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం(కేఎన్పీపీ)లో రెండో, మూడో నంబర్ రియాక్టర్ల ఏర్పాటుకు న్యాయపరంగా ఎదురైన చిక్కులను పరిష్కరించుకోవాలని నిర్ణయించా యి. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారమిక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల 14వ వార్షిక భేటీలో భాగంగా ప్రతినిధుల స్థాయిలో గంటన్నరకు పైగా సాగిన చర్చల్లో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చిం చారు. పాక్, ఉగ్రవాద అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. పుతిన్తో మన్మోహన్కు ఇది ఐదో భేటీ. భేటీ తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. పౌర అణు సహకారంపై 2010లో పుతిన్ భారత పర్యటన సందర్భంగా రూపొందించిన రోడ్మ్యాప్ అమలుకు కట్టుబడి ఉన్నామని మన్మోహన్ చెప్పారు. ఇందులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. రష్యా సాయంతో తమిళనాడులోని కూడంకుళంలో నిర్మించిన అణు ప్లాంటులో రెండు కొత్త రియాక్టర్ల ఏర్పాటు, సాంకేతిక సహకారం కోసం ఒప్పందాన్ని శీఘ్రంగా ఖరారు చేయాలని సంకల్పించినట్లు ఉభయ దేశాలు ఓ ప్రకటనలో తెలిపాయి. కేఎన్పీపీని భారత అణు ప్రమాద బాధ్యత చట్టం పరిధిలోకి కాకుండా అంతర్ ప్రభుత్వాల ఒప్పందం పరిధిలోకి తీసుకురావాలని రష్యా పట్టుపడుతుండడంతో కొత్త రియాక్టర్ల ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొనడం తెలిసిందే. కాగా, తమ దేశంలో తయారైన కూడంకుళం ఒకటో యూనిట్ ప్రారంభంపై పుతిన్ హర్షం వ్యక్తం చేశారు. దాన్నుంచి విద్యుత్ కొన్ని గంటల్లో గ్రిడ్కు అనుసంధానం కానుందన్నారు. ఇంధనం, రక్షణ, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం పెరుగుతోందని పుతిన్, మన్మోహన్ చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకుల మధ్య కూడా గత ఏడాది ద్వైపాక్షిక వాణిజ్యం 25 శాతం పెరిగి 1,100 కోట్ల డాలర్లు చేరుకుందన్నారు. పుతిన్, మన్మోహన్ల భేటీ సందర్భంగా ఇరు దేశాలు ఐదు ఒప్పందాలు చేసుకున్నాయి. ఖై దీలు మిగిలిన శిక్షను స్వదేశంలో పూర్తి చేసుకోవ డానికి వారిని స్వదేశానికి బదిలీ చేయడం, ఇంధనం, బయోటెక్నాలజీ, శాస్త్రసాంకేతికం తదితర రంగాల్లో సహకారంపై వీటిని కుదుర్చుకున్నాయి. ఐఎంఎఫ్ను సంస్కరించాలి.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)లో తక్షణమే సంస్కరణలను చేపట్టాలని, వర్ధమాన దేశాలకు తమ వాణి వినిపించేందుకు వాటికి మరింత ప్రాతి నిధ్యం కల్పించి ఓటు హక్కు విలువ పెంచాలని ఇరు దేశాలు కోరాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విస్తరించాలన్నాయి. మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని రష్యా పేర్కొంది. అమెరికా ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న నిఘా సంబంధ ఆపరేషన్లపై ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా, భేటీ సందర్భంగా పుతిన్, మన్మోహన్లు పరస్పరం పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ‘భారత్, రష్యాల ఉమ్మడి విజయాల్లో చాలా వాటిని మీ నాయకత్వంలోనే సాధించాం’ అని పుతిన్.. మన్మోహన్తో అన్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసిన ఘనత మీదేనని మన్మోహన్.. పుతిన్తో చెప్పారు. అంతకుముందు మన్మోహన్ మాస్కోలోని మాస్కో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలే షన్స్లో ఉపన్యసించారు. సవాళ్లను ఎదుర్కోవడానికి ఉభయ దేశాల సంబంధాలు కాలానికి అనుగుణంగా మారాలన్నారు. రక్షణ అవసరాల విషయంలో రష్యా ఇకముందూ తమకు కీలక భాగస్వామిగానే ఉంటుందని స్పష్టం చేశారు. మాస్కో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మన్మోహన్కు అరుదైన గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ప్రతిష్టాత్మక సంస్థ ఇచ్చిన ఈ పట్టాను తనకు గొప్ప గౌరవమని మన్మోహన్ పేర్కొన్నారు.