-
భీమవరంలోని ఉండి రోడ్డులో భారీ పేలుడు
-
కరాచీలో భారీ పేలుడు : ముగ్గురు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని కరాచీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. నాలుగంతస్తుల భవనంలో జరిగిన పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 15 మంది గాయపడ్డారు. కరాచీ యూనివర్సిటీ మస్కాన్ గేటు ఎదురుగా ఉన్న భవనంలో ఈ భారీ పేలుడు సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని, మృతులను ఆస్పత్రికి తరలించారని డాన్ పత్రిక పేర్కొంది. పేలుడుకు కారణం ఏంటనేది వెల్లడికాకపోయినా సిలిండర్ పేలడంతోనే ఈ భారీ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. భవనం రెండో అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా కరాచీలో మంగళవారం షిరిన్ జిన్నా కాలనీలోసి బస్ టెర్మినల్లో బాంబు పేలడంతో ఐదుగురు గాయపడిన ఉదంతం మరువకముందే ఈ భారీ పేలుడు వెలుగుచూసింది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు సఫ్దర్ అవన్ అరెస్ట్కు కరాచీ పోలీసులపై ఒత్తిడి పెంచేందుకు సింధ్ పోలీస్ చీఫ్ను పాక్ సేనలు కిడ్నాప్ చేశాయనే వదంతులపై ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా విచారణకు ఆదేశించిన క్రమంలో బాంబు పేలుళ్లు జరగడం గమనార్హం. చదవండి : కశ్మీర్ విధ్వంసానికి పాక్ పన్నాగం -
దివిసీమలో పేలుడు కలకలం..
-
దివిసీమలో పేలుడు కలకలం..
సాక్షి, కృష్ణా : అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో గురువారం రాత్రి జరిగిన భారీ పేలుడు తీవ్ర కలకళాన్ని రేకెత్తించింది. వేకనూరు గ్రామానికి చెందిన తుంగల దిలీప్ ఇంటి సమీపంలోని గోడల చావిడి నుంచి రాత్రి 8.45 సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించగా ఈ శబ్దం దాదాపు 2 కిలోమీటర్ల మేర వినిపించింది. దీంతో పాటు చుట్టు పక్కల కొన్ని మీటర్ల దూరం వరకు గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. అసలే ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం కావటంతో ఏమి జరిగిందో అర్ధం కాక సమీప ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఘటన విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ రమేష్ రెడ్డి, సీఐ బీబీ రవికుమార్, ఎస్సై సందీప్లు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. (పరిటాల శ్రీరామ్కు కండీషనల్ బెయిల్) పశువుల చావిడిలో యూరియా గోతాల వద్ద పేలుడు సంభవించిందని,అవి వ్యవసాయం నిమిత్తం సోడియం, నైట్రేడ్, ఆమోనియంలను నిలువ ఉంచడం జరిగింది అని పోలీసులు తెలిపారు. ఒత్తిడికి గురి అయ్యి పేలినట్లు బాంబ్ స్క్వాడ్ టీం తెలిపినట్లుసీ ఐ భీమేశ్వర రవికుమార్ తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించినట్లు తదుపరి దర్యాప్తు చేయనున్నట్లు సి.ఐ తెలిపారు. (‘ఏబీఎన్’పై వెంటనే చర్యలు తీసుకోండి) -
జూబ్లీహిల్స్లో భారీ పేలుడు
హైదరాబాద్: ఒక్కసారిగా పేలుళ్లు.. దట్టంగా లేచిన దుమ్ము.. భారీ శబ్దాలకు పగిలిన పొరుగు ఇంటి కిటికీలు.. భయంతో స్కూల్ విద్యార్థుల పరుగులు.. చుట్టుపక్కల 400 మీటర్ల మేర గాలిలోకి లేచిన రాళ్లు.. ధ్వంసమైన కార్లు. ఇదీ సోమవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 48లో చోటు చేసుకున్న బీభత్స దృశ్యం. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 48లో ప్లాట్ నంబర్ 969లో సిద్ధార్థ కన్స్ట్రక్షన్స్ భవన నిర్మాణపనుల్లో భాగంగా రాళ్లు పగలగొట్టే పనిని ఆశిష్ అనే వ్యక్తి కాంట్రాక్ట్కు తీసుకున్నాడు. అతడు మహేందర్ అనే సబ్ కాంట్రాక్టర్కు రాళ్లను కొట్టే పనిని అప్పగించాడు. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను పెద్ద మొత్తంలో ఓ గదిలో నిల్వ ఉంచాడు. ఉదయం వాచ్మన్ ఆశారాం భార్య భగవతి గది ముందు వంట చేస్తుండగా వేడికి ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో ఆ గది కుప్పకూలింది. గాలిలోకి రాళ్లు ఎగిరిపడ్డాయి. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. పేలుళ్ల ధాటికి ఎదురుగా ఉన్న వీరేన్చౌదరి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. నాలుగు ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. రాళ్లు ఎగిరి అక్కడే ఉన్న ఓ కారుపై పడడంతో అది ధ్వంసమైంది. పేలుళ్ల శబ్దాలకు భయపడి సమీపంలోని చిరక్ ప్లేస్కూల్ చిన్నారులు ఏడుస్తూ బయటకు పరుగులు తీశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. బాంబు డిస్పోజల్ టీమ్, క్లూస్టీమ్ ఆధారాలు సేకరించాయి. పేలని 98 డిటోనేటర్లు, బండరాయిని ధ్వంసం చేసేందుకు పెట్టిన మరో డిటోనేటర్ను బాంబుస్క్వాడ్ వెలికి తీసిందని పోలీసులు తెలిపారు. సుమారు 25 డిటోనేటర్లు పేలి ఉంటాయని పోలీసుల అంచనా. ఈ మేరకు పోలీసులు కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement