మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. దేవాస్ జిల్లాలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి షెడ్డు కుప్పకూలిపోగా.. అందులో పనిచేసే కార్మికులు చెల్లాచెదురుగా పడ్డారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు.
స్థానిక మీడియా చానెల్స్ ఇస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇప్పటిదాకా నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఇండోర్కు తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Madhya Pradesh | Explosion in a firecracker manufacturing unit in Dewas. More details awaited.
— ANI (@ANI) May 14, 2026
देवास में मक्सी रोड स्थित पटाखा फैक्ट्री में गुरुवार को विस्फोट हुआ। चार की मौत हो गई। ब्लास्ट इतना जबरदस्त था कि करीब 20-25 फीट तक शव के टुकड़े उड़े। #Dewas #Updates #DewasBlast pic.twitter.com/9uThPQZQIv
— kalluram news (@kalluramnews) May 14, 2026


