breaking news
hidden
-
బంగారం మాయలో పడొద్దు!
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రస్తుతం చాలా కుటుంబాల్లో బంగారంపై చర్చ జరుగుతుంది. పెళ్లి కుటుంబాల్లో బంగారం కొనుగోలు అనివార్యం. అయితే పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు కూడా ఇదే అదనుగా పుత్తడిని కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం భయాల మధ్య బంగారం ధరలు ఇటీవల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ సంపదను కాపాడుకోవడానికి, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి చాలా మంది పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి సారిస్తున్నారు. అయితే బంగారంలో పెట్టుబడి అంటే నేరుగా ఆభరణాలు లేదా కాయిన్స్ కొనుగోలు చేయాలని కొందరు భావిస్తున్నారు. కానీ, కేవలం ‘బంగారం’ అనే భావనతో భౌతిక రూపంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించని నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. మరి.. ఈ మెరిసే లోహంలో సురక్షితంగా, లాభదాయకంగా పెట్టుబడి పెట్టాలంటే సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.భౌతిక బంగారం కొనుగోలుతో..బంగారం కొనుగోలు అనేది తరతరాలుగా వస్తున్న ఒక అలవాటు. అయితే, దీన్ని ఒక పెట్టుబడి సాధనంగా చూసినప్పుడు నేరుగా బంగారం కొనుగోలు చేయడం (ఫిజికల్ గోల్డ్) అనేక ప్రతికూలతలను కలిగి ఉంటుంది. ఆభరణాలు కొన్నప్పుడు బంగారం అసలు ధరతో పాటు అధికంగా 8% నుంచి 30% వరకు తయారీ ఛార్జీలు, తరుగు రూపంలో కొంత చెల్లించాల్సి వస్తుంది. ఈ ఖర్చు పెట్టబడుల నుంచి లాభాన్ని తగ్గిస్తుంది.బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు దాని స్వచ్ఛత (క్యారెట్) విషయంలో అనుమానాలు, మోసాలు జరిగే అవకాశం ఉంది. హాల్మార్క్ ఉన్నప్పటికీ చిన్న దుకాణాల్లో నాణ్యతను తనిఖీ చేయడం కష్టం. భౌతిక బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే దొంగతనం జరిగే ప్రమాదం ఉంది. బ్యాంక్ లాకర్లలో ఉంచినా అద్దె, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇది పెట్టుబడిపై రాబడిని తగ్గిస్తుంది.అత్యవసర పరిస్థితుల్లో బంగారాన్ని త్వరగా సరైన ధరకు అమ్మడం కష్టం కావచ్చు. కొన్నిసార్లు కొనుగోలు చేసిన ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుంది. కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది పెట్టుబడిదారునికి అదనపు భారం. బంగారు ఆభరణాలు ఖర్చు లేదా అలంకారం కిందకు వస్తాయి తప్ప పూర్తిస్థాయి పెట్టుబడి కిందకు రావని గమనించాలి.గోల్డ్ ఈటీఎఫ్లుబంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా సులభంగా, పారదర్శకంగా ఉండే మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (Gold ETFs). గోల్డ్ ఈటీఎఫ్లు అంటే ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న గోల్డ్ యూనిట్లు అని అర్థం. ఇవి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లేదా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో షేర్ల వలె ట్రేడ్ అవుతాయి. ఒక గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ సాధారణంగా ఒక గ్రాము బంగారానికి సమానం.గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?ముందుగా ఏదైనా బ్రోకరేజ్ సంస్థ వద్ద డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాను తెరవాలి. ఇది షేర్లు కొనుగోలు చేయడానికి అవసరం.వివిధ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (AMC) అందించే గోల్డ్ ఈటీఎఫ్ల్లో (ఉదా: నిప్పన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్..) ఒకదాన్ని ఎంచుకోవాలి.ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మీకు కావలసిన గోల్డ్ ఈటీఎఫ్ పేరును ఎంటర్ చేసి షేర్లను కొనుగోలు చేసినట్లే యూనిట్లను కొనుగోలు చేయవచ్చు.ఒకేసారి పెద్ద మొత్తంలో లేదా క్రమంగా చిన్న మొత్తాల్లో (సిప్ మాదిరిగా) కొనుగోలు చేయవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్ల వల్ల ప్రయోజనాలుగోల్డ్ ఈటీఎఫ్లు అనేక రకాల ప్రయోజనాలను అందించి, భౌతిక బంగారంపై మెరుగైన పెట్టుబడి సాధనంగా నిలుస్తాయి. ప్రతి ఈటీఎఫ్ యూనిట్ 99.5% స్వచ్ఛత కలిగిన భౌతిక బంగారం కలిగి ఉంటుంది. నాణ్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందులో తయారీ ఛార్జీలు, తరుగు వంటివి ఉండవు. కేవలం కొద్దిపాటి బ్రోకరేజ్, ఫండ్ నిర్వహణ ఛార్జీలు (సాధారణంగా 0.5% లోపు) మాత్రమే ఉంటాయి. ఇది లాభాలను పెంచుతుంది.స్టాక్ ఎక్స్ఛేంజ్లో రోజులో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. తక్షణమే నగదుగా మార్చుకోవచ్చు. ఈటీఎఫ్లు ఎలక్ట్రానిక్ రూపంలో డీమ్యాట్ ఖాతాలో నిల్వ చేయబడతాయి కాబట్టి, దొంగతనం అయ్యే ప్రమాదం లేదు. లాకర్ ఖర్చులు ఉండవు. కేవలం ఒక యూనిట్ (సుమారు ఒక గ్రాము బంగారానికి సమానం) నుంచే పెట్టుబడి ప్రారంభించవచ్చు. దీనివల్ల సాధారణ మధ్యతరగతి పెట్టుబడిదారులు కూడా సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఉద్యోగంతో ఊడిగం చేయాల్సిందేనా..! -
ఎక్కడైనా సీక్రెట్ కెమెరా దాగి ఉంటే ఇలా పట్టేయండి..!
ఏ మూలన ఏ కెమెరా దాగి ఉన్నదో...ప్రయాణం అన్నాక హోటళ్లలో బస చేయడం సాధారణం. అయితే మన ప్రైవసికీ సంబంధించి హోటల్ గదులు ఎంత వరకు క్షేమం అనే డౌటు చాలామందికి వస్తుంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి...హిడెన్ కెమెరాలు సాధారణంగా లైట్ పిక్చర్లు, డ్రెస్సింగ్ మిర్రర్స్, స్మోక్ డిటెక్చర్స్, టీవీ యూనిట్లు, ఫోటో ఫ్రేమ్ల వెనుక, తక్కువగా కనిపించే ప్రదేశాలో అమర్చబడి ఉంటాయి. గదిలోని ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వస్తువులను జాగ్రత్తగా పరిశీలించాలి. ఏదైనా అసాధారణంగా లేదా అనుమానాస్పదంగా అనిపిస్తే దగ్గరకు వెళ్లి పరిశీలించాలి. స్మార్ట్ఫోన్ ఫ్లాష్లైట్ లేదా టార్చ్ ఆ ప్రదేశంపై వేసి చూడాలి. చిరు కాంతి, రెఫ్లెక్షన్లాంటిది కనిపిస్తే అవి కెమెరా లెన్స్ కావచ్చు. రహస్య కెమెరాలలో చాలావాటిలో ఇన్ఫ్రారెడ్ లైట్ను ఉపయోగిస్తారు. దీన్ని గుర్తించడానికి గదిలోని అన్ని లైట్లను ఆపివేసి, స్మార్ట్ఫోన్ కెమెరా ఆన్ చేసి కెమెరా ఉందని అనుమానం ఉన్న చోట ఫోకస్ చేయాలి. స్క్రీన్పై ఎరుపు లేదా ఉదారంగు కనిపిస్తే హిడెన్ కెమెరాకు అది సంకేతం కావచ్చు. హిడెన్ కెమెరాలను గుర్తించడానికి వైఫైని కూడా ఉపయోగించవచ్చు. మొబైల్ వైఫై ఆన్చేసి నెట్వర్క్ లిస్ట్ తనిఖీ చేయాలి. నెట్వర్క్లో కామ్, డివైజ్ డబుల్ ఎక్స్, ఐపీకామ్లాంటి పేర్లు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. రూమ్లో వైర్లెస్ కెమెరా ఉండే ప్రమాదం ఉంది.(చదవండి: ఆందోళన నుంచి వచ్చింది ఒక ఐడియా!) -
Tirumala: తిరుమలలో అదృశ్య ఆలయం!
పచ్చని తోరణాలు, చుట్టూ ఎతైన పర్వతాలు– నలువైపులా ఎటు చూసినా ప్రకృతి రమణీయత. దైవకళ ఉట్టిపడేలా నిత్యం గోవింద నామ సంకీర్తన. స్వామివారి వైభవాన్ని చాటే ఆనంద నిలయం తిరుమల. అందుకే మహర్షులు, పురాణేతిహాసాలు పేర్కొన్నట్లుగా సకల సృష్టిలో వేంకటాచల పర్వతాన్ని మించిన పర్వతం మరొకటి లేదు. ఆపద మొక్కులవాడు, అభయప్రదాత అయిన శ్రీవేంకటేశ్వరుడు అర్చావతార మూర్తిగా కలియుగంలో ఆనంద నిలయంలో కొలువై ఉన్నాడు. సామాన్య మానవులు ఇదే ఆలయాన్ని దర్శించుకుని, స్వామివారిని కొలుచుకుంటూ ఉంటారు. అయితే, దేవతలు, రుషుల కోసం స్వామివారు మరో ఆలయాన్ని తిరుమలపై నిర్మించుకున్నారట! సకల దేవతల నిలయమైన ఈ ఆలయానికి దేవతలు, మహర్షులు వస్తుంటారట! బ్రహ్మాది దేవతలు, సప్తర్షులు, అష్టదిక్పాలకులు ఈ కలియుగంలో శ్రీమహావిష్ణువు ధరించిన శ్రీ శ్రీనివాసుని అవతారాన్ని దర్శించి, సేవించి తరిస్తుంటారట! స్వయంభూ మన్వంతర కాలంలో ఆది కృతయుగంలో శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి శ్రీదేవీ భూదేవీ సమేతంగా వచ్చి ఇక్కడ వెలశాడట! శ్వేతవరాహ కల్పం చివరి వరకు ఇక్కడే ఉంటానని శ్రీవారు దేవతలకు చెప్పారట! స్వామివారి ఆదేశంపై దేవశిల్పి విశ్వకర్మ నిర్మించిన ఈ ఆలయం అదృశ్యంగా ఉందని, స్వామివారు ఈ ఆలయంలో సజీవంగా సకల సేవలను అందుకుంటున్నారని శ్రీ వేంకటాచల మహాత్మ్యం చెబుతోంది. భౌతిక జీవితాలను గడిపే మానవమాత్రులకు ఈ ఆలయం గోచరించదని స్థలపురాణం చెబుతుంది. -
ఫ్రీగా ఇచ్చే క్రెడిట్ కార్డులు.. పైకి కనిపించని ఛార్జీలు
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. దాదాపు అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తుంటాయి. వీటితో పలు ఇతర సంస్థలూ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డులకు సాధారణంగా వార్షిక రుసుము ఉంటుంది. ఇది కార్డు రకాన్ని, జారీ చేసే బ్యాంకు, సంస్థను బట్టి ఉంటుంది. కానీ ఎలాంటి రుసుము లేకుండా జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డులూ కొన్ని సంస్థలు లేదా బ్యాంకులు ఇస్తున్నాయి. ఉచితమే కదా చాలామంది వీటిని తీసుకుంటున్నారు. అయితే ఎలాంటి రుసుము లేకపోయినప్పటికీ కంటికి కనిపించని కొన్ని ఛార్జీలు వీటికి ఉంటాయి. 'లైఫ్ టైమ్ ఫ్రీ' అయిన క్రెడిట్ కార్డుల విషయంలో దాగిఉన్న ఖర్చులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..అధిక వడ్డీ రేట్లువార్షిక రుసుములు లేనప్పటికీ, ఈ కార్డులు అధిక వడ్డీ రేట్లను కలిగి ఉండవచ్చు. తద్వారా మీ కార్డు వాడకం మరింత ఖరీదైనదిగా మారుతుంది. 'లైఫ్ టైమ్ ఫ్రీ' క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి.విదేశీ లావాదేవీ మార్పిడి రుసుమువార్షిక రుసుము లేనప్పటికీ, ఈ కార్డులకు ఫారెక్స్ మార్క్-అప్ ఫీజు (2 నుండి 4 శాతం మధ్య) ఉండవచ్చు. ఇది యూఎస్ డాలర్ లేదా బ్రిటిష్ పౌండ్లు వంటి విదేశీ కరెన్సీలో ఏదైనా ఉత్పత్తి లేదా సర్వీస్ కోసం చెల్లింపు సమయంలో వసూలు చేస్తారు. . 'లైఫ్ టైమ్ ఫ్రీ' క్రెడిట్ కార్డు పొందే సమయంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఓవర్ లిమిట్ ఫీజుమీరు నగదు ఉపసంహరణను ఎంచుకున్నప్పుడు లేదా క్రెడిట్ లిమిట్ దాటి కార్డును ఉపయోగించినప్పుడు, బ్యాంకు దానిపై ఓవర్ లిమిట్ ఫీజును విధించవచ్చు. ఇది గుర్తుంచుకోవలసిన మరొక అంశం.ఆలస్య చెల్లింపు పెనాల్టీలుకార్డు జీవితకాలం ఉచితం అయినప్పటికీ క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించనప్పుడు ఆలస్య చెల్లింపు పెనాల్టీలు ఉండవచ్చు. ఇది ఇతర కార్డుల కంటే ఎంత ఎక్కువగా ఉందో చూసుకోవాలి.ఇనాక్టివిటీ ఫీజులుకొంత మంది కార్డును తరచుగా ఉపయోగించరు. దీనికిగానూ కొన్ని కార్డు ప్రొవైడర్ సంస్థలు రుసుము విధించవచ్చు. మునుపటి సంవత్సరంలో మొత్తం ఖర్చు ఒక పరిమితిని దాటినప్పుడు మాత్రమే బ్యాంకులు కొన్ని కార్డులకు వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి.ప్రాసెసింగ్ ఫీజుఇది బ్యాంకులు విధించే సాధారణ రుసుము కానప్పటికీ, ప్రాసెసింగ్ లేదా నిర్వహణ ఖర్చుల కోసమంటూ దీన్ని బ్యాంకులు చేస్తాయి. ఇది మీ కార్డుకు సాధారణంగానే ఉందా లేదా మరీ ఎక్కువగా ఉందా అన్న అన్న విషయాన్ని గమనించాలి. -
Veena Srivani Latest Photos: వాగ్దేవి వరపుత్రిక శ్రీవాణి శ్రావ్యంగా మీటితే..! (ఫొటోలు)
-
8 నెలలు మాయమై.. శివరాత్రికి కనిపించే ఆలయం!
దేశంలో శివరాత్రి ఉత్సాహం నెలకొంది. శుక్రవారం జరిగే శివరాత్రి పూజలకు భక్తులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాజస్థాన్లోని బన్స్వారా జిల్లాకు చెందిన లక్షలాది మంది భక్తులకు శివరాత్రి ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఇక్కడ కొలువైన శివుడు ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శనమిచ్చి అదృశ్యమవుతాడు. దీనివెనుకగల ఆసక్తికర కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బన్స్వారా జిల్లాలో మహి, అనస్ నదుల సంగమం వద్ద 200 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుత శివాలయం ఉంది. సంవత్సరంలో ఏడెనిమిది నెలల పాటు ఈ ఆలయం కనుమరుగువుతుంది. ఈ ఆలయం నాలుగు అడుగుల నీటిలో మునిగి ఉంటుంది. ఏళ్ల తరబడి ఇలా జరుగుతున్నా ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లకపోవడం విశేషం. ఈ ఆలయం ఇలా మునిగిపోవడానికి గల కారణం గుజరాత్లోని కడనా డ్యామ్లోకి చేరిన నీరు ఈ ఆలయ ప్రాంతంలో నిలిచిపోవడం. ఇటుక, రాయి, సున్నంతో నిర్మితమైన ఈ ఆలయం సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయంగా పేరొందింది. ఈ ఆలయం బన్స్వారాకు 70 కి.మీ. దూరంలో ఉంది. ఫిబ్రవరి, మార్చిలలో ఈ ప్రాంతంలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం కనిపిస్తుంది. శివరాత్రి సమయంలో భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని, శివుణ్ణి దర్శించుకుంటారు. నదుల సంగమ తీరం కావడంతో ఈ ఆలయానికి సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయం అనే పేరు వచ్చింది. -
అది 48 ఏళ్ల క్రితంనాటి లెటర్.. ఎలా లభ్యమయ్యిందంటే..
ఒక్కోసారి చరిత్ర తన దారిని వెదుకుతూ వర్తమానంలోకి వచ్చేస్తుందేమో! 48 ఏళ్ల క్రితం 14 ఏళ్ల బాలిక రాసిన ఒక ఉత్తరం ఇంటి తలుపు సందుల్లో దొరికింది. అమెరికాలోని ఇలినోయిస్కు చెందిన తాజెవెల్ కౌంటీలో ఒక పాత ఇంటిలోని ఒక తలుపు వెనుక ఒక బాటిల్లో దాచివుంచిన లెటర్ ఇప్పుడు లభ్యమయ్యింది. ఈ పాత ఇంటిలో వర్క్ చేసేందుకు వచ్చిన ఒక కార్పెంటర్ ఈ లెటర్ను గమనించాడు. తరువాత ఇది సోషల్ మీడియాలో షేర్ కావడంతో వైరల్గా మారింది. కార్పెంటర్కు ఎలా దొరికిందంటే.. ఫేస్బుక్ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం డకోటా మోహ్న్ అనే ఈ కార్పెంటర్ ఇంటి మెయింటనెన్స్ చూస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతని దృష్టి లివింగ్ రూమ్లోని తలుపు ఫ్రేమ్వర్క్పై పడింది. దానిపై ‘నోట్ 9/29/1975' అని రాసివుంది. అక్కడున్న బాణం గుర్తును ఫాలో చేయగా కలపతో చేసిన కంపార్ట్మెంట్ను అతను తెరిచాడు. అక్కడ మూసివున్న ఒక బాటిల్లో చేతితో రాసిన ఒక ఉత్తరం లభ్యమయ్యింది. ఈ పోస్టు క్యాప్షన్లో డకోటా ఇలా రాశాడు. ‘నా వడ్రంగి కెరియర్లో నాకు ఎన్నో అమూల్యమైనవి లభించాయి. వాటిలో ఇది అత్యుత్తుమమైనది’ జర్నల్ స్టార్తో మాట్లాడిన డకోటా మోహ్న్..‘మా బృందం ఆ ఇంటిలోని లివింగ్ రూమ్లో పనిచేస్తోంది. నేను చెత్తను తుడిచే పనిలో ఉన్నాను. అప్పుడు అక్కడి తలుపుపై ఏదో రాసివుండటాన్ని గమనించాను. దానిపై ‘నోట్’ అని ఉంది. నేను నా సెల్ఫోన్ను అక్కడ ఫోకస్ చేసి, ఫొటో తీసుకున్నాను. తరువాత ఆ బాటిల్లోని లెటర్ తెరిచి నోట్ చదివాను’అని తెలిపారు. లెటర్ ఎవరు రాశారంటే.. సోషల్ మీడియాలో ఈ లెటర్ షేర్ అయిన అనంతరం ఒక మహిళ ఈ పోస్ట్ చదివారు. తాను తన 14 ఏళ్ల వయసులో ఈ లెటర్ రాశానని తెలిపారు. స్టెఫనీ హెరాన్ అనే ఈ మహిళ ఈ పోస్టుకు కామెంట్ రాస్తూ..‘ఈ లెటర్ నేనే రాశాను. నాకు నా చెల్లెలికి టైమ్ కాప్స్యూల్ అంటే చాలా ఇష్టం. ఇది అమెరికా ద్విశతాబ్దికి(1970 మధ్యకాలం) ముందునాటిది. ఆ మర్నాడే నా సోదరి జన్మించింది’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే ఎవరైనా తండ్రి కాగలరా?.. సైన్స్ ఏమి చెబుతోందంటే.. -
టెస్లా కారులో సీక్రెట్ ఫీచర్! ‘ఎలాన్ మోడ్’ అని పేరుపెట్టిన హ్యాకర్
టెస్లా కార్లలో ఒక రహస్య ఫీచర్ బయటపడింది. టెస్లా సాఫ్ట్వేర్ హ్యాకర్ కనుక్కున్న ఈ ఫీచర్కు ‘ఎలోన్ మోడ్’ అని పేరు పెట్టినట్లు ‘ది వెర్జ్’ వార్తా సంస్థ నివేదిక తెలిపింది. ఈ ఫీచర్ టెస్లా వాహనాల్లో హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్ను అనుమతిస్తుంది. @greentheonly అనే పేరుతో ట్విటర్లో ఈ రహస్య ఫీచర్ గురించి హాకర్ పేర్కొన్నారు. ‘ఎలాన్ మోడ్’ను కనుగొని, ఎనేబుల్ చేసి పరీక్షించిన హాకర్ దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలను ట్విటర్లో షేర్ చేశారు. అయితే ఈ ఫీచర్కు సంబంధించిన ఎలాంటి సమాచారం కార్ లోపల స్క్రీన్పై లేదు. టెస్లా పూర్తి స్వీయ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) అనేది బీటా స్థితిలో పరీక్ష స్థాయిలో ఉన్న అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థ. ప్రస్తుతానికి 15 వేల డాలర్లు అదనంగా చెల్లించిన వారికి ఇది అందుబాటులో ఉంది. కానీ ఎఫ్ఎస్డీ సాఫ్ట్వేర్పై కస్టమర్ల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చినట్లు గత నెలలో బయటకు పొక్కిన ఓ అంతర్గత నివేదిక ద్వారా తెలిసింది. ఉన్నట్టుండి ఆగిపోవడం, స్పీడ్ పెరిగిపోవడం వంటి లోపాలు ఉన్నట్లు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. చెయ్యి వేయాల్సిన పని లేదు! టెస్లా ఆటోపైలట్ సిస్టమ్ అనేది హైవేల కోసం కంపెనీ రూపొందించిన మొదటి తరం డ్రైవర్ సహాయక వ్యవస్థ. సెల్ఫ్ డ్రైవింగ్ అయినప్పటికీ డ్రైవింగ్ సమయంలో అందులోని వ్యక్తి అప్రమత్తంగా ఉన్నారని నిర్ధారించడానికి స్టీరింగ్ వీల్ను అప్పుడప్పుడు తాకాల్సి ఉంటుంది. ఇలా తరచూ చేయాల్సి ఉండటంపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న హ్యాండ్స్ ఆన్ స్టీరింగ్ కన్ఫర్మేషన్తోపాటు సెంటర్ ఇంటీరియర్ కెమెరా డ్రైవర్లు ముందుకు చూస్తున్నారా లేదా అని గమనిస్తాయి. హాకర్ ‘ఎలాన్ మోడ్’లో నిర్వహించిన 600 మైళ్ల పరీక్షలో అలాంటి ఇబ్బందులేవీ ఎదురవ్వలేదని నివేదిక పేర్కొంది. ఈ మోడ్లో సిస్టమ్ లేన్లను మార్చడం, హైవేపై నెమ్మదిగా డ్రైవింగ్ ముగించడం గుర్తించినట్లు హాకర్ ట్విటర్లో వివరించారు. 2017తో పోల్చితే టెస్లా సాఫ్ట్వేర్ మరింత సురక్షితమైనదని చెప్పుకొచ్చాడు. కాగా నాజ్ఫ్రీ డ్రైవింగ్ ఫీచర్ను తీసుకొస్తున్నట్లు గత డిసెంబర్లోనే మస్క్ హింట్ ఇచ్చారు. ఇదీ చదవండి: భారత్లో మొదటి టెస్లా కార్ ఇతనిదే.. And also when you kill one AP node, you retain some viz now, so now you can actually see which node does what. Node A does road layout/signs Node B does moving object detection as they still display with A dead. Also viz dies at times so you get AP functionality, but empty viz pic.twitter.com/Ldfi7cCPWh — green (@greentheonly) June 17, 2023 -
ప్రపంచలోనే అత్యంత పురాతన జైళ్లు ఇవే.. వందల ఏళ్ల కిందటే నిర్మాణం
-
బల్బ్లలో రహస్య కెమేరాలు
-
మరుగుదొడ్డిలో కిలో బంగారం!
న్యూఢిల్లీ: విమానంలో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తి కస్టమ్స్ అధికారుల తనిఖీలకు భయపడి కిలో బంగారాన్ని విమానంలోని మరుగుదొడ్డిలో దాచి ఉంచాడు. విమాన సిబ్బంది చాకచక్యంగా తనిఖీలు నిర్వహించడంతో అతగాడి బండారం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం దుబాయ్ నుంచి కొచ్చికి చేరుకున్న స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా పలుమార్లు విమానంలోని మరుగుదొడ్డి(లావెటరి)కి వెళ్లడం గమనించిన విమానసిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లావెట్రీలోని టిష్యూ పేపర్ బాక్స్ వెనుకాల పేపర్లో చుట్టి దాచి ఉంచిన కిలో బంగారు కడ్డీలను సిబ్బంది కనిపెట్టారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
మోనాలీసా చిత్రం వెనుక రహస్యం..!
మోనాలీసా చిత్రం వెనుక రహస్యం ఏమిటి? ఒక్కోరికీ ఒక్కోలా కనిపించే ఆ పెయింటింగ్ వెనుక దాగున్న కథను వర్ణించేందుకు శాస్త్రవేత్తలు ఒక్కోరూ ఒక్కో రకంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా రిఫ్లెక్టివ్ లైటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఓ ఫ్రెంచ్ సైంటిస్టు ఆమె చిత్రం వెనుక కనిపించని కథను కళ్ళకు కట్టేందుకు ప్రయత్నించారు. మోనాలీసా చిత్రానికి లియోనార్డో డావిన్సీ తన కళా ప్రతిభతో ప్రాణం పోస్తే... నేటి సైంటిస్టులు డిజిటల్ శక్తితో పునర్నిర్మిస్తున్నారు. శాస్త్రవేత్త పాస్కల్ కొట్టే... మోనాలీసా చిత్రంపై షాంఘైలోని విలేకరుల సమావేశంలో మంగళవారం విశ్లేషించారు. చిత్రలేఖనానికి వెనుక భాగంలో మల్టీ లెన్స్ కెమెరా వినియోగించి లోలోపల దాగిన బహుళ రూపాలను ప్రదర్శించారు. కొన్ని ముఖ్యమైన తేడాలతో కూర్చొని ఉన్నట్లుగా దాదాపు ఒకేలా కనిపించే మరికొన్ని చిత్రాలు దీనివెనుక దాగొన్నట్లు చెప్పారు. లోపలి చిత్రంలో పక్కకు తిరిగి కూర్చొని ఉన్న ఆమె.. ప్రేక్షకులపైపు చూస్తున్నట్లుగా కనిపించడం చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైనుంచి ఆమె చిరునవ్వు వెనుక మర్మమేమిటో తెలియక వీక్షకులు నోరెళ్ళబెడుతూనే ఉన్నారు. ఓ నిజ జీవితానికి చెందిన పెయింటింగ్ గా జనం ఆమోదించిన మోనాలీసా... ఫ్లోరెంటైన్ పట్టు వ్యాపారి భార్య అని, 16వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ మహిళ.. లిసా గెరార్దిని అని తన పరిశోధనల ద్వారా తేలినట్లు సైంటిస్టు పాస్కల్ కొట్టే చెప్తున్నారు. మోనాలిసా చిత్రాన్ని నేను పునర్నిర్మించిన అనంతరం ఆమె పోర్టరైట్ ముందు నిలబడితే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని, మరొక స్త్రీగా ఉంటుందని అంటున్నారు. మరో పరిశోధకుడు అండ్రూ గ్రాహమ్ డిక్సన్ కూడ పాస్కల్ కొట్టే అభిప్రాయాలను ఏకీభవిస్తున్నారు. అయితే ఇతర కళా చరిత్రకారులు మాత్రం పాస్కల్ కొట్టే అన్వేషణలపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఎన్ని పరిశోధనలు జరిపినా.. ప్రపంచానికి తెలిసిన మోనాలీసా నిజంగా మోనాలీసానా కాదా అన్న సంశయం మాత్రం నేటికీ తీరలేదు. -
కనబడని కొవ్వుతో మరణం!
ఢిల్లీ: మనకు పైకి కనిపించడానికి లావుగా ఉండే వారిలోనే కాకుండా అంతర్గతంగా ఏర్పడేటువంటి కొవ్వుతో చాలా ప్రమాదం పొంచి ఉందనీ, ఒక రకంగా ఇది మరణానికి దగ్గరవుతున్నట్లే అని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదర భాగంలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం వలన ప్రమాదం మరింత పెరుగుతుందంటున్నారు. చర్మం కింది భాగాలలో అంతర్గతంగా తయారయిన కొవ్వు మూలాన అనేక వ్యాధుల బారిన పడటానికి అవకాశం ఉంటుంది. హృద్రోగులలో ఈ తరహా కొలెస్ట్రాల్ ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మనదేశంలోని స్థూలకాయుల్లో హైపర్టెన్షన్, థైరాయిడ్, డయాబెటిస్ తదితర వ్యాధుల బారిన పడిన వారికి ఆ వ్యాధుల మీద అవగాహన లేకపోవడం వలన తప్పకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సైతం తీసుకోలేకపోతున్నారు. ఇది ఎక్కువ నష్టం జరగడానికి దోహదం చేస్తుందని ఒబెసిటీ రంగంలో కృషి చేస్తున్న ఇండియా కంపెనీ వీఎల్సీసీ స్థాపకురాలు వందనా మిశ్రా తెలిపారు. ప్రతి యేటా నవంబర్ 26 ను యాంటీ ఒబెసిటీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో అస్తవ్యస్తమైన జీవన విధానం, అహారపు అలవాట్ల మూలంగా పెరుగుతున్న స్థూలకాయులు తప్పకుండా తమ బరువును తగ్గించుకోవడం దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.


