-
ఫ్రీ పాస్పోర్ట్, నో ట్యాక్స్.. ఓ దేశం బంపరాఫర్!
సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్ అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే ఇలాంటివారికి 5,000 ఉచిత పాస్పోర్ట్లను అందించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రకటించారు. దేశ పాస్పోర్ట్ ప్రోగ్రామ్లో ఈ సంఖ్య 5 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ. 41 వేల కోట్లు) సమానం అని ఆయన తెలిపారు. "విదేశాల నుండి అత్యంత నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, కళాకారులు, తత్వవేత్తలకు 5,000 ఉచిత పాస్పోర్ట్లను (మా పాస్పోర్ట్ ప్రోగ్రామ్లో 5 బిలియన్ డాలర్లకు సమానం) అందిస్తున్నాం. ఇది మా జనాభాలో 0.1 శాతం కంటే తక్కువే కాబట్టి వారికి పూర్తి పౌర హోదాను కల్పిస్తాం. ఓటింగ్ హక్కులతో సహా ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటాం" అని ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ బుకెలే ‘ఎక్స్’లో ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా విదేశాల నుంచి తమ దేశానికి తరలివచ్చే కుటుంబాలకు, ఇక్కడ వారు సంపాదించుకునే ఆస్తులపై ఎటువంటి పన్నులు, సుంకాలు లేకుండా చూసుకుంటామన్నారు. దీని గురించి త్వరలో మరిన్ని వివరాల ప్రకటిస్తామని బుకెల్ వెల్లడించారు. We're offering 5,000 free passports (equivalent to $5 billion in our passport program) to highly skilled scientists, engineers, doctors, artists, and philosophers from abroad. This represents less than 0.1% of our population, so granting them full citizen status, including… — Nayib Bukele (@nayibbukele) April 6, 2024 -
నాడు హత్యలకు అడ్డా.. నేడు అత్యంత సురక్షిత ప్రాంతం!
ఎల్ సాల్వడార్.. మధ్య అమెరికాలోని అత్యంత చిన్నదైన, అత్యధిక జనాభా కలిగిన దేశం. ఒకప్పుడు నేరాలు, అవినీతి, హత్యలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఈ దేశం రూపురేఖలు ఇప్పుడు సమూలంగా మారిపోయాయి. అధ్యక్షుడు నయూబ్ బకెలే దేశ అధికార పగ్గాలు చేపట్టడంతో దేశంలో నేరాలు, హత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది. ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు ఇటీవల జరిగిన ఎల్ సాల్వడార్ ఎన్నికల్లో నయీబ్ బుకెలే ఘనవిజయం సాధించి, అధ్యక్షపీఠం అధిరోహించారు. దేశంలో అంతకంతకూ దిగజారుతున్న ప్రజాస్వామ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వీటిని నయూబ్ బుకెలే చక్కదిద్దుతారన్న నమ్మకంతో ఓటర్లు ఆయన పార్టీకి పట్టం కట్టారు. నయీబ్ బుకెలే దేశంలో పెరుగుతున్న హత్యల నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలపై ఎల్ సాల్వడార్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కార్మికులైతే ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. నయీబ్ బుకెలే ఇప్పుడు ప్రపంచవ్యాపంగా ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు పొందారు. గణనీయంగా తగ్గిన భద్రతా ముప్పు ఒక నివేదిక ప్రకారం నయీబ్ బుకెలే 2019లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎల్ సాల్వడార్లో శాంతిభద్రతల పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా దేశంలో భద్రతా ముప్పు గణనీయంగా తగ్గింది. తాజాగా 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయనే గెలవడంతో అతని ‘న్యూ ఐడియాస్ పార్టీ’ కార్యకర్తలు విజయోత్సాహంతో ర్యాలీలు చేపట్టారు. లెక్కలేనంతమంది బుకెలే అభిమానులు సాల్వడార్లోని సెంట్రల్ స్క్వేర్లో సమావేశమై, ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నీలి రంగు దుస్తులు ధరించి ఆనందంగా జెండాలు రెపరెపలాడించారు. ‘న్యూ ఐడియాస్ పార్టీ’ పాలన 42 ఏళ్ల అధ్యక్షుడు నయీబ్ బుకెలే తాను మరోమారు సాధించిన ఈ విజయాన్ని తన పరిపాలనకు ఇదొక ‘రిఫరెండం’గా అభివర్ణించారు. దేశ శాసనసభలో మొత్తం 60 స్థానాలను గెలుచుకున్న బుకెలేకి చెందిన ‘న్యూ ఐడియాస్ పార్టీ’ దేశాన్ని మరోమారు పాలించనుంది. ఈ ఎన్నికల తర్వాత దేశంలో బుకెలే ప్రభావం మరింతగా పెరిగింది. సాల్వడార్ చరిత్రలో బుకెలే అత్యంత ప్రభావవంతమైన నాయకునిగా ఎదిగారని విశ్లేషకులు చెబుతుంటారు. అసురక్షితం నుంచి సురక్షితానికి.. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేపధ్యంలో నయీబ్ బుకెలే తన భార్యతో కలిసి నేషనల్ ప్యాలెస్ బాల్కనీ నుండి మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అందరూ కలిసి ప్రతిపక్షాన్ని కూల్చివేశారు. ఎల్ సాల్వడార్ అత్యంత అసురక్షిత దేశం అనే పేరు నుంచి అత్యంత సురక్షితమైన దేశమనే దిశకు చేరుకుంది. రాబోయే ఐదేళ్లలో మనం చాలా చేయాల్సివుంది’ అని ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు. ఒకే వారంలో 80 మంది హత్య ఒక నివేదిక ప్రకారం బుకెలే దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎల్ సాల్వడార్లో హత్యల రేటు గణనీయంగా తగ్గింది. ‘మారా సాల్వత్రుచా గ్యాంగ్’ (ఎంఎస్-13)సభ్యులు దేశంలో పెద్ద సంఖ్యలో హత్యలు సాగిస్తూ వచ్చారు. 2022 మార్చి లో ఒకే వారంలో వీరు 80 మందిని హత్య చేశారు. బుకెలే ప్రభుత్వం నేరస్తుల ముఠాతో సంబంధం ఉన్న 75 వేల మందిని అరెస్టు చేసింది. El Salvador's President Nayib Bukele, who has described himself as the 'World's coolest dictator,' is all but certain to be re-elected in a presidential bid for another five-year term https://t.co/t7X5vV5VLq pic.twitter.com/1LmIt9aaVV — Reuters (@Reuters) January 30, 2024 70 శాతం మేరకు తగ్గిన హత్యల రేటు పెద్ద సంఖ్యలో అరెస్టులు జరిగిన తర్వాత ఎల్ సాల్వడార్లోని క్రిమినల్ ముఠాల వెన్ను విరిగినట్లయ్యింది. ఈ చర్య ఫలితంగా 2022లో హత్యలు దాదాపు 60 శాతం మేరకు తగ్గాయి. అయితే 2023 నాటికి దేశంలో అత్యధిక ఖైదు రేటు నమోదు కావడంతో ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు దారితీసింది. భద్రతా దళాల చర్యల అనంతరం 2023లో ఎల్ సాల్వడార్లో హత్యల రేటు 70 శాతం మేరకు తగ్గి, అది ఒక లక్షకు 2.4 శాతానికి చేరింది. ఈ సంఖ్య లాటిన్ అమెరికాలోని చాలా దేశాల కంటే అతి స్వల్పం నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాటం 2019లో ఎల్ సాల్వడార్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న బుకెలే దేశంలో చోటుచేసుకున్న నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాడతానని వాగ్దానం చేశారు. తన మద్దతుదారులతో మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి, విమర్శకులను ట్రోల్ చేయడానికి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను సమర్థవంగంగా ఉపయోగించుకున్నారు. బుకెల్ తరచూ బేస్ బాల్ క్యాప్, లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరిస్తారు. సెల్ఫీలు, మీమ్లను అమితంగా ఇష్టపడతారు. President Bukele takes a victory lap after El Salvador becomes the safest nation in the Western hemisphere He then tells foreign critics to go stuff it pic.twitter.com/iBNEPooXcP — Jack-of-all-trades (@Upliftingvision) February 13, 2024 -
Bitcoin: బిట్కాయిన్ చెల్లదు.. చెప్తే అర్థం కాదా?
క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ విషయంలో మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తోంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF). ఆర్థిక, మార్కెట్ సమగ్రత దెబ్బ తినడంతో పాటు క్రిప్టో వినియోగదారుడికి రిస్క్ తప్పదనే ఆందోళన సైతం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో దూకుడుగా ముందుకెళ్తున్న మధ్యఅమెరికా దేశం ఎల్ సాల్వడర్కు సాలిడ్గా వార్నింగ్ ఇచ్చింది ఐఎంఎఫ్. బిట్కాయిన్కు చట్టబద్ధత ఇవ్వడం కరెక్ట్కాదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మరోసారి హెచ్చరించింది. కిందటి ఏడాది సెప్టెంబర్లో ప్రపంచంలోనే బిట్కాయిన్ను అధికారిక కరెన్సీగా అంగీకరించిన దేశంగా ఎల్ సాల్వడర్ నిలిచింది. అయితే ఈ నిర్ణయం చెల్లదంటూ గతంలోనే ఐఎంఎఫ్.. ఎల్ సాల్వడర్కు తేల్చి చెప్పింది. First steps... 🌋#Bitcoin🇸🇻 pic.twitter.com/duhHvmEnym — Nayib Bukele 🇸🇻 (@nayibbukele) September 28, 2021 అయినా కూడా తగ్గని ఎల్ సాల్వ్డర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) దూకుడు నిర్ణయాలతో మొండిగా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దేశానికి ఆర్థికంగా భవిష్యత్తులో భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని, పైగా తమ(ఐఎంఎఫ్) నుంచి రుణం పొందే ప్రయత్నాలకు క్రిప్టో కరెన్సీనే ప్రధాన ఆటంకంగా మారొచ్చని హెచ్చరించింది. ప్రస్తుతం ఎల్ సాల్వ్డర్లో అమెరికా డాలర్(2001 నుంచి)తో పాటు బిట్కాయిన్ అధికారిక కరెన్సీగా ఉంది. అయితే క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత ఇవ్వడం వల్ల తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని, ఆ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎల్ సాల్వడర్ను ఆర్థిక నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. సంబంధిత వార్త: బిట్కాయిన్ అఫీషియల్ కరెన్సీ కాదు! కుండబద్ధలు కొట్టిన ఐఎంఎఫ్ ఇక ఎల్ సాల్వడర్ కోసం విడుదల చేసిన ప్రకటనలో ఐఎంఎఫ్ పలు కీలక అంశాల్ని సైతం ప్రస్తావించింది. ఆర్థిక చేరికను పెంచడం యొక్క ప్రాముఖ్యతను అంగీకరించిన ఐఎంఎఫ్.. చివో ఇ-వాలెట్ వంటి డిజిటల్ చెల్లింపు మార్గాలు ఈ పాత్రను పోషిస్తాయని అభిప్రాయపడింది. అయితే.. బిట్కాయిన్ వ్యవహారం ఇందుకు విరుద్ధమని, దీనికి చట్టబద్ధత తొలగించేందుకు అవసరమైన మార్గాలపై దృష్టి సారించాలని పలు దేశాల ఆర్థిక అధికార యంత్రాంగాలకు ఐఎంఎఫ్ కీలక సూచనలు చేసింది. బుధవారం నాటి డిజిటల్ మార్కెట్ పరిణామాల ఆధారంగా యూఎస్ మార్కెట్లో బిట్ కాయిన్ విలువ 37 వేల డాలర్లుగా కొనసాగుతోంది. మార్కెట్ వాల్యూ ప్రకారం.. ప్రపంచంలోనే విలువైన డిజిటల్కరెన్సీగా కొనసాగుతోంది బిట్ కాయిన్. కానీ, గత నవంబర్తో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం పడిపోయింది వాల్యూ. 2021లో ఆల్ టైం హైగా 69 వేల డాలర్ల మార్క్ను తాకింది బిట్కాయిన్ వాల్యూ. ఆ తర్వాతి పరిణామాలు బిట్కాయిన్ను మళ్లీ పుంజుకోకుండా చేస్తున్నాయి. సంబంధిత వార్త: అగ్నిపర్వతాల నుంచి బిట్కాయిన్ తయారీ! ఎలాగంటే.. -
భవిష్యత్లో కరెన్సీ మాయం..పెత్తనం అంతా బిట్ కాయిన్లదే!
భవిష్యత్ అంతా బిట్ కాయిన్లదే. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న కరెన్సీ త్వరలోనే కనుమరుగవుతుంది. క్రిప్టో వినియోగం పెరుగుతుంది. సాధారణ కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్ధిక వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది అంటూ ఓ దేశాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వరల్డ్ వైడ్గా బిట్ కాయిన్ మార్కెట్ అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారి క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్లకు చట్టబద్ధత (అధికారిక కరెన్సీ) కల్పించిన ఎల్ శాల్వడార్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె..ఆ కరెన్సీపై మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనం ఉపయోగించే కరెన్సీ త్వరలో కనుమరుగవుతుంది. ప్రస్తుతం ప్రపంచం చూస్తున్న 'రియల్ రివల్యూషన్' బిట్కాయిన్ అని బుకెలె ట్వీట్ చేశారు. పైగా బిట్కాయిన్ యుగానికి ఎల్ సాల్వడార్ నాయకత్వం వహిస్తోందని జోస్యం చెప్పారు. ప్రపంచం మొత్తం ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు క్రిప్టోకరెన్సీని వినియోగించాలని చూస్తోంది. అయితే బిట్కాయిన్ల వినియోగం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. క్రిప్టోతో ఆర్ధిక వ్యవస్థకు ఎలాంటి భంగం కలగకుండా ఉంటే భవిష్యత్లో వాడుకలో ఉన్న కరెన్సీ వినియోగం ఆగిపోతుందని ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు వినియోగంలో ఉన్న కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీని ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంది. దీని కోసం చేయాల్సిందల్లా దేశ ఆర్థిక వ్యవస్థకు సాధారణ కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీ మెరుగైందని నిరూపించుకోవడమేనని అన్నారు. $400 మిలియన్ డాలర్ల భారం తగ్గించాలనే బిట్ కాయిన్ వినియోగంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నా..ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు మాత్రం..ఆ దేశ ఆర్ధిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు ఇతర దేశాల నుంచి ఆదేశానికి మధ్య జరిగే ఆర్ధిక లావాదేవీలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సుమారు 400 మిలియన్ల డాలర్ల అధిక రుసుముల్ని తగ్గించే మార్గాల్ని అన్వేషించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్లో సెప్టెంబరులో బిట్కాయిన్ను చట్టబద్ధం చేసినప్పుడు ఎల్ సాల్వడార్ ప్రభుత్వం తరుపున మొత్తం 400 బిట్కాయిన్లు, అంతకంటే ఎక్కువగానే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ కాయిన్ల సంఖ్య 1000కి చేరింది. ఆ బిట్ కాయిన్ల సేకరణ మరింత పెంచేందుకు ఏటీఏం తరహాలో దేశ వ్యాప్తంగా 200 బిట్ కాయిన్ టెల్లర్ మెషీన్లను ఇన్స్టాల్ చేసింది. ఆ మెషిన్ల ద్వారా బిట్ కాయిన్లను కొనుగోలు చేసే పౌరులకు ప్రత్యేకంగా రాయితీలు అందించేలా చర్యలు తీసుకున్నారు. బుకెలెకు వార్నింగ్ బిట్కాయిన్ బాండ్లతో బిట్ కాయిన్సిటీ నిర్మాణానికి పూనుకుంటున్నట్లు కొద్ది నెలల క్రితం నయిబ్ బుకెలె ప్రకటించారు. అలా ప్రకటించిన రెండు రోజులకే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) షాకిచ్చింది. బిట్కాయిన్ను చట్టబద్ధంగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బిట్ కాయిన్ల వల్ల వినియోగదారుల రక్షణ, ఆర్థిక సమగ్రత, ఆర్థిక స్థిరత్వానికి గణనీయమైన నష్టాల్ని కలిగిస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. అయితే బుకెలే మాత్రం ఐఎంఎఫ్ హెచ్చరికల్ని లైట్ తీసుకుంటున్నారు. బిట్ కాయిన్లతో లాభాల్ని గడిస్తున్నారు. లాభాలు ఎల్ సాల్వడార్ దేశాధ్యక్షుని తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నా..బిట్ కాయిన్లపై ఆర్ధిక కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు. ఎల్ సాల్వడార్ దేశం బిట్కాయిన్లపై ఆర్ధిక లావాదేవీల్ని నిర్వహిస్తుంది. క్రిప్టో కాయిన్ కొనుగోలు చేసే సమయంలో దాని ధర తక్కువగా ఉండడం, ఆ తర్వాత వాటి ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో భారీ లాభాల్ని చవిచూస్తుంది. కానీ దేశ ఆర్ధిక ప్రయోజనాల కోసం బిట్ కాయిన్లపై ఆర్ధిక లావాదేవీలు నిర్వహించడం ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది.లేదంటే కోలుకోలేని నష్టాల్ని చవిచూడాల్సి వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని పలువురు ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వార్వెవా..! ప్రపంచంలోనే తొలి "బిట్కాయిన్ సిటీ" నిర్మాణం, ఎక్కడంటే..! -
Bitcoin: బిట్కాయిన్పై భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్
Bitcoin Not Official Currency Says IMF: క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ విషయంలో మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తోంది ఎల్ సాల్వడర్ దేశం. సంప్రదాయ విద్యుత్ బదులు ఏకంగా అగ్నిపర్వతాల శక్తిని ఉపయోగించి కంటికి కనిపించని క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్లను రూపొందిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇప్పుడు ఎల్ సాల్వడర్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పెద్ద షాకిచ్చింది. బిట్కాయిన్ను చట్టబద్ధంగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. క్రిప్టోకరెన్సీ ద్వారా రిస్క్ రేటు ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లో దానిని చట్టబద్ధంగా అనుమతించడానికి వీల్లేదని ఎల్ సాల్వడర్కు స్పష్టం చేసింది ఐఎంఎఫ్. కాగా, మధ్యఅమెరికా దేశమైన ఎల్ సాల్వడర్ సెప్టెంబర్లో యూఎస్ డాలర్తో పాటుగా బిట్కాయిన్కు చట్టబద్ధత ప్రకటించింది. అయితే బిట్కాయిన్ చట్టాలకు అనుమతిస్తే ఆర్థిక నేరాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని, దీనికి బదులు కొత్త పేమెంట్ వ్యవస్థలను తీసుకురావడం లేదంటే అభివృద్ధి చేయడం లాంటివి చేయాలని ఎల్ సాల్వడర్కు సూచించింది ఐఎంఎఫ్. బిట్కాయిన్కు చట్టబద్ధత ఇవ్వొద్దని, అది అఫీషియల్ కరెన్సీ కాదని కుండబద్ధలు కొట్టి తేల్చేసింది ఐఎంఎఫ్. చదవండి: బిట్కాయిన్కు చట్టబద్ధత! ఎలాగంటే.. ఇదిలా ఉంటే బిట్కాయిన్ బాండ్లతో ఏకంగా బిట్ కాయిన్సిటీ నిర్మాణానికి పూనుకుంటున్నట్లు ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) ప్రకటించిన రెండు రోజులకే ఐఎంఎఫ్ నుంచి ఈ ప్రతికూల ప్రకటన వెలువడడం విశేషం. అయితే దేశ అవసరాలు, ఆసక్తి మేర కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదని అధ్యక్షుడు బుకెలె చెప్తున్నాడు. బిట్కాయిన్ చట్టబద్దత కోసం మరికొన్ని దేశాలు ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఐఎంఎఫ్ ప్రకటన ఆ ప్రయత్నాలకు అడ్డుపుల్ల వేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు కొందరు భావిస్తున్నారు. చదవండి: ఆ నిర్ణయం బిట్కాయిన్ కొంపముంచింది..! చదవండి: సంచలనం.. అగ్నిపర్వతాలతో బిట్కాయిన్ తయారీ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement