-
రాష్ట్రంలో 2 లక్షల మంది రైతులకు ఉచితంగా బోర్లు
భవానీపురం (విజయవాడ పశ్చిమ): వైఎస్సార్ జలకళ పథకం కింద రాష్ట్రంలోని రెండు లక్షల మంది రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్విస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్కుమార్ అన్నారు. భూగర్భజల శాఖ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం భూగర్భజల వ్యవస్థలు, సవాళ్లు, అవకాశాలు అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకుని నీటి ప్రాధాన్యతను తెలియచేసేలా ఎంతో బాధ్యతతో భూగర్భజల శాఖ విధులు నిర్వహిస్తుందని చెప్పారు. భావి తరాలకు తాగు, సాగు నీరు అందించేందుకు నీటిని పొదుపుగా వాడటంలో, భూగర్భ జలాల వివరాలను తెలియచేయటంలో భూగర్భజల శాఖ గత ఐదు దశాబ్దాలుగా విశేష కృషి చేసిందని తెలిపారు. జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో జలవనరులు కీలకమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం దేశంలోనే తొలి హైడ్రాలజీ ప్రాజక్ట్ను ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు సుస్థిర స్థానం ఉందన్నారు. ఈ స్వర్ణోత్సవ వేళ నిర్వహించిన ఈ సదస్సు భావితరాలకు, తదుపరి ప్రణాళికలకు ఒక వేదికగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 13 జిల్లాల అధికారులు రూపొందించిన 13 పుస్తకాలను, గత 50 ఏళ్లుగా భూగర్భ జలశాఖ అమలు చేసిన ప్రణాళికలు, పరిశోధనల సమాహారంగా రూపొందించిన పుస్తకం, సావనీర్ను మంత్రి అనిల్కుమార్ యాదవ్ తదితరులు ఆవిష్కరించారు. -
పుడమి పుక్కిట గంగ.. నీటికి లేదిక బెంగ
సాక్షి, అమరావతి: సకాలంలో పుష్కలంగా వర్షాలు.. నిండుగా పారిన వాగులు, వంకలు.. పొంగిన నదులు.. భూమాతకు జలాభిషేకం చేశాయి. ఎండి బీళ్లువారిన పుడమి ఆ జలాలను పుక్కిటపట్టింది. జలవనరులు నిండుగా తొణికిసలాడుతున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలకు గాను 12 జిల్లాల్లో భూగర్భ జలమట్టం బాగా పెరిగింది. పలు ప్రాంతాల్లో భూగర్భంలోంచి జలాలు పైకి ఉబుకుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో మోటర్లు వేయకుండానే బోర్ల నుంచి నీరు వస్తోంది. రాయలసీమ ప్రాంతంలో వెయ్యి నుంచి 1,400 అడుగుల లోతు బోర్లు వేస్తే గానీ నీటి జాడ కనిపించని పరిస్థితి నుంచి నాలుగైదు అడుగుల లోతులోనే నీరు కనిపిస్తోంది. కుండపోత వర్షాలు, వరదల వల్ల కొంత పంట నష్టం వాటిల్లినప్పటికీ వచ్చే రెండు మూడేళ్లు కరువు మాట ఉండదని అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న వేసవిలో ఎక్కడా తాగు, సాగునీటి ఎద్దడి రాదని భరోసాతో ఉన్నారు. ఏటా జనవరి చివరి వారం నుంచి వేసవి సన్నద్ధత కోసం విపత్తు నిర్వహణ, వ్యవసాయం, పశుసంవర్ధక, గ్రామీణ మంచినీటి సరఫరా, పురపాలక, పట్టణాభివృద్ధి తదితర శాఖల అధికారులు సమావేశమయ్యేవారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేవారు. పశుగ్రాసం కొరతను ఎలా అధిగమించాలి.. తాగునీటి సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలు.. వంటి అంశాలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. ఈ ఏడాది జలవనరుల్లోను, భూగర్భంలోను పుష్కలంగా నీరుండటంతో తాగునీటి ఎద్దడి మాటే ఉండదు. భూమి çపచ్చగా ఉన్నందున పశుగ్రాసానికి ఇబ్బంది ఉండదు. అందువల్ల ఈ ఏడాది వేసవి సన్నద్ధత సమావేశాల అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. రాయలసీమలో అనూహ్యంగా పెరుగుదల నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి.. గత ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 27 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమలో ఏకంగా 57 శాతం ఎక్కువగా వర్షం కురవడం గమనార్హం. కోస్తాంధ్రలో 17 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో 860 మిల్లీమీటర్ల సగటు సాధారణ వర్షపాతం కాగా 1,087 మిల్లీమీటర్లు నమోదైంది. ఇదేకాలంలో కోస్తాంధ్రలో 954 మిల్లీమీటర్లకుగాను 1,111 మిల్లీమీటర్లు (17 శాతం ఎక్కువ), రాయలసీమలో 648 మిల్లీమీటర్లకుగాను 1,003 మిల్లీమీటర్లు ( 57 శాతం అధిక) వర్షపాతం రికార్డయింది. దీంతో రాయలసీమ ప్రాంతంలో భూగర్భ జలమట్టం అనూహ్యంగా పెరిగింది. 2020 జనవరితో పోలిస్తే జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 3.8 మీటర్ల ( 12.46 అడుగుల) మేరకు భూగర్భ జలమట్టం పెరిగింది. ఇదే సమయంలో రాయలసీమలో పెరుగుదల 8.1 మీటర్లు (26.57 అడుగులు) ఉండటం గమనార్హం. వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో పాతాళగంగ పైకి వస్తోంది. కొన్నిచోట్ల మోటర్లు వేయకుండానే బోరు పైపుల నుంచి నీరు కొద్దిగా బయటకు వస్తోంది. వాగులు, వంకల్లో సుదీర్ఘకాలం ఊట (జేడు) నీరు ప్రవహిస్తుండటంతో కొండ దిగువ ప్రాంతాల్లోని భూముల్లో నీరు ఊరుతోంది. గత ఏడాది జనవరితో పోలిస్తే 12 జిల్లాల్లో భూగర్భ జలమట్టం పైకి వచ్చింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రం నామమాత్రంగా 0.7 మీటర్ల మేర తగ్గింది. మూడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడలేదు పాపాఘ్ని నది నాలుగు నెలలుగా ప్రవహిస్తూనే ఉంది. గత మూడు దశాబ్దాల్లో ఈ నది వరుసగా మూడునెలలు ప్రవహించిన దాఖలాలు లేవు. భారీ వర్షాలవల్ల భూగర్భ జలం భూమిపైకి ఉబికి వస్తోంది. వరిగడ్డి వాములు కిందనుంచి రెండడుగులమేర తడిచిపోయాయి. – రామలింగారెడ్డి, కమలాపురం, వైఎస్సార్ కడప జిల్లా. మోటరు వేయకుండానే నీరు మా ఊరు కొంత తగ్గులో ఉంది. పైన ఏట్లో నీరు ప్రవహిస్తున్నందున మా భూముల్లో ఊటెక్కింది. మోటర్లు వేయకుండానే లోతట్టు ప్రాంతాల్లోని బోరు పైపుల నుంచి నీరు ఉబికి వస్తోంది. – వెంకటరామిరెడ్డి, వంగిమళ్ల, వీరబల్లి మండలం, వైఎస్సార్ కడప జిల్లా పుష్కలమైన వర్షాలే కారణం రాష్ట్ర వ్యాప్తంగా 2020 కేలండర్ ఇయర్లో మంచి వర్షాలు కురిశాయి. దీనివల్లే భూగర్భ జలమట్టం బాగా పెరిగింది. వచ్చే రెండు మూడేళ్లు భూగర్భ జలమట్టంపై ఈ వర్షాల ప్రభావం ఉంటుంది. సాధారణంగా జూన్ నుంచి మే నెల వరకు వాటర్ ఇయర్ అని అంటారు. రాష్ట్రంలో సంవత్సరం మొత్తంలో కురిసే వర్షంలో జూన్–అక్టోబరు మధ్య నైరుతి రుతుపవనాల సీజన్లోనే 65 శాతానికిపైగా కురుస్తుంది. మరో 25 శాతం ఈశాన్య రుతుపవనాల సీజన్లో పడుతుంది. మిగిలిన 10 శాతం వర్షం ఇతర నెలల్లో కురుస్తుంది. రాయలసీమ ప్రాంతంలో గత ఏడాది విపరీతమైన వర్షాలు కురిశాయి. అందువల్ల జలమట్టం బాగా పైకి వచ్చింది. – ఎ.వరప్రసాదరావు, భూగర్భజలశాఖ రాష్ట్ర సంచాలకుడు -
వైఎస్సార్ జలకళ ద్వారా మార్చి నాటికి 22,400 ఉచిత బోర్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జలకళ పథకం ద్వారా మార్చి నెలాఖరు కల్లా రైతుల పొలాల్లో 22,400 ఉచిత బోర్లు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వాటర్ షెడ్ డైరెక్టర్ పీవీఆర్ఎం రెడ్డి బుధవారం 13 జిల్లాల డ్వామా పీడీలతో సమావేశం నిర్వహించి జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరిలో 3,200, ఫిబ్రవరిలో 9,600, మార్చిలో 9,600 చొప్పున ఉచిత బోర్లు తవ్వేందుకు జిల్లాల వారీగా ప్రణాళికలు ఖరారు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల దరఖాస్తులు నిబంధనల మేరకు తిరస్కరణకు గురయ్యాయన్నారు. ఆయా రైతులు కనీసం రెండున్నర ఎకరాలుండేలా గ్రూపులుగా ఏర్పడి తిరిగి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా అధికారులకు సూచించారు. -
ఉచిత బోరుకు ప్రతి రైతు అర్హుడే
సాక్షి, అమరావతి: ఉచిత బోరు పథకానికి విస్తీర్ణంతో సంబంధం లేకుండా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు అర్హుడే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్సార్ జలకళ పథకం విధివిధానాలను సవరిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జులై 3వ తేదీ పథకం విధివిధానాలపై జారీ చేసిన ఉత్తర్వుల్లో ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులనే అర్హులుగా పేర్కొన్నారు. తాజా నిబంధనల ప్రకారం ఇప్పటి దాకా బోరు వసతి లేని, ఫెయిల్ అయిన బోర్ ఉన్న రైతులంతా అర్హులేనని పేర్కొన్నారు. ► గతంలో ఉచిత బోరు తవ్వకానికి రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలని, ఒక రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి లేకపోతే, గరిష్టంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడాలన్న నిబంధనను తాజా విధివిధానాలలో సవరించారు. ► బోరు తవ్వకానికి ప్రత్యేకంగా ఎటువంటి విస్తీర్ణం పరిధిని పేర్కొనలేదు. అంటే రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతు మిగిలిన వారితో సంబంధం లేకుండా తన భూమిలో ఉచిత బోరు తవ్వకానికి అర్హుడేనని అధికారులు వెల్లడించారు. ► భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్న రాష్ట్రంలోని 1094 రెవిన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకం అమలు కాదని పేర్కొన్నారు. అయితే భూగర్భ జల మట్టాన్నిబట్టి ఈ గ్రామాల సంఖ్యలో మార్పులు ఉంటాయన్నారు. సన్న, చిన్నకారు రైతులకు పంపుసెట్, పైపులు, వైర్ ఉచితం ► సన్న, చిన్నకారు రైతులకు (ఐదు ఎకరాలలోపు భూమి ఉండే వారు) ఉచిత బోరుతో పాటు మోటార్ (పంపుసెట్) కూడా ఉచితంగా అందజేస్తారు. ఈ మేరకు సీఎం ప్రకటనకు అనుగుణంగా తాజాగా మరో ఉత్తర్వు జారీ చేశారు. ► పైపులు, విద్యుత్ వైరు, ప్యానల్ బోర్డు వంటి అనుబంధ పరికరాలను కూడా ఉచితంగా అందించనున్నట్టు పేర్కొన్నారు. ► హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించాకే బోరు బావి తవ్వకం ప్రారంభిస్తారు. అర్హత కలిగిన రైతులు ఫొటో, పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ► డ్రిల్లింగ్ అనంతరం గంటకు కనీసం 4,500 లీటర్లు తోడడానికి అవకాశం ఉన్న దానినే విజయవంతమైన బోరు బావిగా పరిగణిస్తారు. అనంతరం జియో ట్యాగింగ్తో కూడిన డిజిటల్ ఫొటోలతో రికార్డు చేస్తారు. పారదర్శకత కోసం సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. -
అండగా నిలబడతాం..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
Advertisement