నిజాంపట్నంలో మత్స్యకార భరోసా సభ.. జగనన్నకు జన నీరాజనం (ఫొటోలు)
వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది కూడా రంగం సిద్ధంచేసింది.
బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సాయాన్ని జమచేశారు.
ప్రజా నాయకుడు వైఎస్ జగన్ కాన్వాయ్పై అభిమానులు పూలవర్షం కురిపించారు. భారీ ఎత్తున జనం తరలివచ్చారు.
మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేశారు.
సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ఒకొక్కరికి రూ.10వేల చొప్పున వేట నిషేధ భృతి అందిస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వం తొలి రెండేళ్లలో రూ.2 వేలు చొప్పున ఇవ్వగా, ఆ తర్వాత రూ.4వేల చొప్పున ఇచ్చారు.
అదీ కూడా మర, యాంత్రిక పడవలకే పరిమితం చేశారు. ఇలా సగటున 50వేల మందికి రూ.21 కోట్లు మాత్రమే ఇచ్చారు.
కానీ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ భృతి రూ.10వేలకు పెంచడమే కాక.. మర, యాంత్రిక పడవలతో పాటు సంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకార కుటుంబాలకు కూడా చెల్లిస్తోంది.
ఏటా సగటున రూ.110 కోట్లు చొప్పున చెల్లించింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు ఆరు రెట్లు అధికం. ఇక చెప్పిన మాట ప్రకారం సరైన సమయానికి, వేట నిషేధ కాలంలోనే భృతి చెల్లిస్తూ వారికి అండగా నిలుస్తోంది ప్రస్తుత ప్రభుత్వం.
నేడు అందించిన సాయంతో కలిపి ఒక్కొ కుటుంబానికి సగటున రూ.50వేల చొప్పున ఈ నాలుగేళ్లలో రూ.538 కోట్ల భృతిని అందించారు.
CM Jagan-Bapatla : నిజాంపట్నంలో మత్స్యకార భరోసా సభ.. జగనన్నకు జన నీరాజనం (ఫొటోలు)
CM Jagan-Bapatla : నిజాంపట్నంలో మత్స్యకార భరోసా సభ.. జగనన్నకు జన నీరాజనం (ఫొటోలు)
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?