
ప్రపంచ సుందరి అంటే అత్యంత అందమైన అమ్మాయనే కాదు.. అంతకు మించిన మానవీయ విలువలున్న హృదయం, స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం అని మిస్ వరల్డ్ వేదిక నినదిస్తోంది.

బుధవారం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్ వేదికగా నిర్వహించిన ‘హార్ట్ ఆఫ్ గోల్డ్’చారిటీ ఈవెంట్ అలాంటి వ్యక్తిత్వాలను, మనస్సులను ప్రతిబింబించింది.

మిస్ వరల్డ్ పోటీదారులతో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా.. ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ, సుదీక్ష ఎస్టేట్స్ సంస్థల సహకారంతో ప్రభుత్వ బాలసదన్లకు చెందిన 200 మంది అనాథ పిల్లలకు ఏడాది పాటు సహాయం చేసేందుకు స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ను ప్రకటించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో చిన్నారికి పాఠ్య పుస్తకాలు, పోషకాహారం, ప్రోటీన్ పౌడర్, సప్లిమెంట్లు, నెలవారీ రేషన్ సరఫరా, దుస్తులు, స్వెటర్లు, రెయిన్ కోట్లు, డ్రెస్సులు, స్కూల్ కిట్లు (స్కూల్ బ్యాగ్లు, వాటర్ బాటిళ్లు, టిఫిన్ బాక్స్లు), టాయిలెట్రీలు, డిజిటల్ వాచ్లు, విద్యా సంబంధిత ఆట బొమ్మలు, వ్యక్తిగత వస్తువుల కోసం ట్రాలీ బ్యాగ్లతో కూడిన ఒక్కొక్కటి దాదాపు రూ.25 వేల విలువైన 200 కిట్లను చిన్నారులకు అందించి సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది.

పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు




























