
విజయనగరం : గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో సాక్షాత్కరించిన పైడితల్లి సిరిమాను, ఇరుసుమానులను భక్తుల జయజయ ధ్వానాలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, పసుపు నీటి చల్లదనాల మధ్య తరలించారు.

పైడితల్లి అమ్మవారి ప్రతిరూపమైన సిరిమాను, ఇరుసుమానులను కొలతల ప్రకారం వడ్రంగులు ముక్కలు చేసి ఎడ్లబండిపై కొండతామరాపల్లి గ్రామం నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో బయలుదేరారు.

మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చెట్టుపై గొడ్డలివేటు వేశారు. అమ్మవారు జిల్లా ప్రజలను చల్లగా చూడాలని ఆకాంక్షించారు.
















