రెండు బైక్‌లు ఢీ..ఇద్దరి మృతి

విజయనగరం : దత్తిరాజేరు మండలం వంగర గ్రామం వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందారు. మృతులు దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన  నాగోలు ప్రసాద్ (30) కాగా మరొకరు  గజపతినగరం మండలం  మరుపల్లి గ్రామానికి చెందిన గెద్ద ఈశ్వరరావు(20)లుగా గుర్తించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top