‘ఓటుకు కోట్లు’పై కేసీఆర్ నోరు మెదపరెందుకు?' | why kcr not raise voice on vote for note ?, asks ponnam prabhakar | Sakshi
Sakshi News home page

‘ఓటుకు కోట్లు’పై కేసీఆర్ నోరు మెదపరెందుకు?'

Aug 10 2015 7:09 PM | Updated on Aug 15 2018 9:30 PM

‘ఓటుకు కోట్లు’పై కేసీఆర్ నోరు మెదపరెందుకు?' - Sakshi

‘ఓటుకు కోట్లు’పై కేసీఆర్ నోరు మెదపరెందుకు?'

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కుదిపేసిన ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంపై...

గంభీరావుపేట(కరీంనగర్): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కుదిపేసిన ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంపై 40 రోజులుగా సీఎం కేఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలో సోమవారం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించడంలో ఆంతర్యమేమిటని అన్నారు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement