సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణపై జిల్లా కలెక్టర్లు దృష్టిసారించాలని మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. గ్రామీణ తాగునీటి సరఫరాపై జిల్లా అధికార యంత్రాంగం మరింత క్రియాశీలంగా పనిచేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో కొత్త బోరుబావులపై ఎక్కువ ఖర్చు చేయకుండా పాత బోరుబావులను మరింత లోతుగా తవ్వాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల పనితీరుపై గురువారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలకు విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక తీగ (మూడో తీగ)ను ఏర్పాటు చేయాలని సూచించారు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్నుల వసూళ్లు పెరగాలని... స్వచ్ఛందంగా పన్నులు చెల్లించే విధంగా ప్రజలను చైతన్యవంతులు చేయాలని పేర్కొన్నారు.
100 రోజుల ప్రణాళికను విజయవంతం చేయండి
పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజుల ప్రణాళికలను విజయవంతం చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు 11 వేల మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. జూన్ 2 నాటికి ఈ లక్ష్యాన్ని అందుకోవాలని భావించినప్పటికీ ఏప్రిల్ నాటికి పూర్తిచేస్తే స్వచ్ఛ భారత్ అభియాన్ కింద కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు మరిన్ని ప్రోత్సాహక నిధులు అందుతాయన్నారు.
ప్రతి ఇంటికి రెండు 9 వాట్ల బల్బుల చొప్పున ఎంపిక చేసిన 25 పురపాలికల్లో మొత్తం 2.7 లక్షల బల్బులను పంపిణీ చేస్తామన్నారు. ఇక ఘన వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్రం పురపాలికలకు నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో... ప్రతి మున్సిపాలిటీ, నగర పంచాయతీలో డంప్ యార్డుల ఏర్పాటు కోసం 5 నుంచి 7 ఎకరాల స్థలాన్ని సేకరించి మున్సిపల్ శాఖకు అప్పగించాలని మంత్రి ఆదేశించారు.
తాగునీటి ఎద్దడిపై దృష్టి పెట్టండి
Published Fri, Mar 11 2016 1:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement