నైజీరియా రాజధాని లాగోస్లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి.
లాగోస్ : నైజీరియా రాజధాని లాగోస్లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు. సదరు ప్రయాణికులు ఇద్దరు రైలుపై భాగంలో అక్రమంగా ఎక్కి ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు లాగోస్ రైల్వే జిల్లా మేనేజర్ తెలిపారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.