తిరుపతి, శ్రీకాళహస్తిలను తమిళనాడులో కలపాలి: రాందాస్ | Tirupathi, Srikalahasthi should be merged in Tamilnadu | Sakshi
Sakshi News home page

తిరుపతి, శ్రీకాళహస్తిలను తమిళనాడులో కలపాలి: రాందాస్

Feb 20 2014 2:43 AM | Updated on Sep 2 2017 3:52 AM

తిరుపతి, శ్రీకాళహస్తిలను తమిళనాడులో కలపాలి: రాందాస్

తిరుపతి, శ్రీకాళహస్తిలను తమిళనాడులో కలపాలి: రాందాస్

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయిన దృష్ట్యా గతంలో ఉమ్మడి సంయుక్త రాష్ట్రం నుంచి విడిపోయిన తిరుపతి, శ్రీకాళహస్తిలను తిరిగి తమిళనాడులో కలపాలని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ బుధవారం డిమాండ్ చేశారు.

 పీఎంకే అధినేత రాందాస్ డిమాండ్

 సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయిన దృష్ట్యా గతంలో ఉమ్మడి సంయుక్త రాష్ట్రం నుంచి విడిపోయిన తిరుపతి, శ్రీకాళహస్తిలను తిరిగి తమిళనాడులో కలపాలని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ బుధవారం డిమాండ్ చేశారు. మద్రాసు రాజధాని నుంచి 1956లో విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు తమిళనాడులోని 9 మండలాలు దూరమయ్యూయన్నారు. పెద్ద ఎత్తున పోరాటాలు సాగించి కేవలం తిరుత్తణిని మాత్రమే తిరిగి దక్కించుకోగలిగామని వివరించారు.
 
  పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు, సత్యవేడు, తిరుపతి తదితర 8 మండలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండిపోయాయన్నారు. మెజారిటీ సంఖ్యలో ఉన్న ఈ 8 మండలాల్లోని తమిళులు ద్వితీయశ్రేణి పౌరులుగా దుర్భర జీవితం అనుభవిస్తున్నందున  వారికి న్యాయం జరిగేలా తమిళనాడులో తిరిగి కలపాలని, ఇందుకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాందాస్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement