సోమాలియా అధ్యక్ష భవనంపై ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ సహబ్ దాడి చేసింది.
సోమాలియా అధ్యక్ష భవనంపై ఉగ్రవాదుల దాడి!
Jul 8 2014 11:46 PM | Updated on Sep 2 2017 10:00 AM
మొగదిషు: సోమాలియా అధ్యక్ష భవనంపై ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ సహబ్ దాడి చేసింది. ఈ ఘటన సోమాలియా రాజధానిలో మొగదిషులో చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగినట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి.
అధ్యక్ష భవనం వద్ద ఇంకా పోరాటం చేస్తున్నామని అల్ సహబ్ కు చెందిన ప్రతినిధి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దాడి జరిగిన సమయంలో సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మహముద్ భవనంలో లేరని తెలిసింది.
రంజాన్ మాసంలో దాడులను అల్ సహబ్ ఉధృతం చేస్తోంది. గత శనివారం పార్లమెంట్ వద్ద కారు బాంబు ఘటనలో నలుగురు మృతి చెందారు.
Advertisement
Advertisement