ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) శుక్రవారం ప్రకటించిన తొలి త్రైమాసిక ఫలితాల నికర లాభాల్లో పడిపోయింది. అయితే మార్కెట్ విశ్లేషకుల అంచనాలను కంటే తక్కువగానే పడిపోయి రూ.2520.96 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో జూన్తో ముగిసిన త్రైమాసికం నాటికి నికరలాభాలు యేటికేటికీ 31.7 శాతం పడిపోయినట్టు ఎస్బీఐ వెల్లడించింది. యేటికేటికీ నికర వడ్డీరేట్ల ఆదాయాలు 4.2 శాతం ఎగిసి, రూ.14,312.31 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. మార్కెట్ విశ్లేషకులు బ్యాంకు నికర లాభాలు రూ. 2,504.9 కోట్లగా, నికర వడ్డీ ఆదాయాలు రూ.14,489.5 కోట్లగా నమోదుచేస్తుందని అంచనావేశారు.
స్టేబుల్ అసెట్ క్వాలిటీని కొనసాగిస్తున్నట్టు బ్యాంకు ఈ ఫలితాల నేపథ్యంలో ప్రకటించడంతో, మార్నింగ్ ట్రేడింగ్లో 2 శాతం మేర డౌన్ అయిన ఎస్బీఐ షేర్లు, మధ్యాహ్నం సెషన్లో9 శాతం మేర లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఎస్బీఐ ఇతర ఆదాయాలు 44 శాతం మేర జంప్ అయ్యాయని బ్యాంకు పేర్కొంది. ఇతర ఆదాయాలు, నిర్వహణ లాభాలు, తక్కువ పన్నుధరలు బ్యాంకు లాభాలకు సపోర్టుగా నిలిచినట్టు ఎస్బీఐ వెల్లడించింది. అయితే బ్యాంకుకు మళ్లీ స్థూల బ్యాడ్ లోన్స్ బెడదగానే ఉన్నాయి. ఈ లోన్స్ జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,01,541 కోట్లకు ఎగిశాయి. మార్చి త్రైమాసికంలో ఇవి రూ.98,713 కోట్లగా ఉన్నాయి. బ్యాడ్ లోన్స్ పెంపు స్ట్రీట్ అంచనాల కంటే తక్కువగానే ఉన్నాయి. నికర నిరర్థక ఆస్తులు 3.8 శాతం నుంచి 4.05 శాతానికి ఎగిశాయి.బ్యాడ్ లోన్స్ ప్రొవిజన్లు జూన్ త్రైమాసికంలో రూ. 6,340 కోట్లకు పెరిగాయి. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ లోన్స్ తక్కువగానే నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో బ్యాడ్ లోన్స్ ప్రొవిజన్లు రూ.12,139 కోట్లు.
పర్వాలేదనిపించిన ఎస్బీఐ
Published Fri, Aug 12 2016 1:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement