విశాఖపట్నం: నాలుగు రోజుల కిందట కిడ్నాపైన ఇంజనీరింగ్ విద్యార్థి శవమై కనిపించిన సంఘటన విశాఖపట్నం జిల్లాలో కలకలంరేపుతోంది. మాకవరంపాలెంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోన్న ప్రదీప్.. సోమవారం సాయంత్రం అనకాపల్లిలోని శారద నది తీరంలో విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కు పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమ వ్యవహారమే ప్రదీప్ హత్యకు కారణమని స్నేహితులు చెబుతుండగా, తల్లిదండ్రులు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
మాకవరంపాలెంలోని అవంతి కాలేజీకి చెందిన బీటెక్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ ప్రదీప్ ను ఈ నెల 28న గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. అదే కాలేజీలో బీటెక్ సెకండ్ ఇంయర్ చదువుతోన్నఅమ్మాయితోపాటు కశింకోట వద్ద బస్సు దిగిన ప్రదీప్.. ఆమెతో కలిసి చాట్ తింటుండగా కిడ్నాప్ ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే ప్రదీప్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈలోగా..
అనకాపల్లి సమీపంలోని శారద నదిలో సోమవారం సాయంత్రం ప్రదీప్ మృతదేహం లభ్యమైంది. నది వద్దకు చేరుకున్న పోలీసులు ప్రదీప్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి ప్రదీప్ తల్లిదండ్రులు, బంధువులతోపాటు స్నేహితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొన్నేళ్లుగా ప్రదీప్ కు, అతని క్లాస్ మేట్ కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఆ కారణం వల్లే హత్య జరిగి ఉండొచ్చని మృతుడి స్నేహితులు పేర్కొన్నారు. హత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ప్రదీప్ బంధువులు సైతం హత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
బీటెక్ స్టూడెంట్ కిడ్నాప్, హత్య..
Published Mon, Oct 31 2016 9:23 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement