కొత్త టర్మినల్ ప్రారంభించిన మోదీ | PM Modi inaugurates new terminal at Chandigarh airport | Sakshi
Sakshi News home page

కొత్త టర్మినల్ ప్రారంభించిన మోదీ

Sep 11 2015 11:33 AM | Updated on Aug 15 2018 6:34 PM

కొత్త టర్మినల్ ప్రారంభించిన మోదీ - Sakshi

కొత్త టర్మినల్ ప్రారంభించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం చండీగఢ్ విమానాశ్రయంలో కొత్త టర్మినల్ ప్రారంభించారు.

చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం చండీగఢ్ విమానాశ్రయంలో కొత్త టర్మనల్ ప్రారంభించారు. జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందించనున్న ఈ టర్మినల్ను దేశానికి అంకితం చేశారు. కొత్త టర్మినల్ ద్వారా అటు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంటుందని చెప్పారు.

మొత్తం రూ.939 కోట్ల వ్యయంతో ఈ టర్మినల్ను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) , చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ భాగస్వామ్యంలో నిర్మించాయి. దీని నిర్వహణ బాధ్యతలను మాత్రం చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ చూసుకోనుంది. ఈ టర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి, కేంద్రమంత్రి పీఅశోక్ గజపతి రాజు, ముఖ్యమంత్రులు ప్రకాశ్ సింగ్ బాదల్, మనోహర్ లాల్ ఖత్తర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement