మోడీ రాయ్‌బరేలీ సభ రద్దు | narendra modi raebareli Dissolution of the house | Sakshi
Sakshi News home page

మోడీ రాయ్‌బరేలీ సభ రద్దు

Jan 2 2014 4:15 AM | Updated on Mar 29 2019 9:18 PM

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో నిర్వహించతలపెట్టిన విజయ్ శంఖ్‌నాద్ సభ రద్దయింది.

లక్నో: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో నిర్వహించతలపెట్టిన విజయ్ శంఖ్‌నాద్ సభ రద్దయింది. ఇది ఈ నెల 13న జరగాల్సి ఉంది. హజరత్ షా షరాఫత్ మియాన్ ఉరుసు, ఉత్తరయాణి ఉత్సవాల వల్ల సభను రద్దు చేశామని ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పట్నాయక్ తెలిపారు.  అయితే, మోడీ ఇతర సభలు వాయిదా పడలేదని స్పష్టం చేశారు. గోరఖ్‌పూర్‌లో ఈ నెల 23న, మీరట్‌లో ఫిబ్రవరి 1న, మార్చి 2న లక్నోలో మోడీ విజయ్ శంఖ్‌నాద్ సభలు ఉంటాయని పట్నాయక్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement