* టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా
* పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి
* రాష్ట్రాభివృద్ధికి సలహాలిస్తానని హామీ
సాక్షి, విజయవాడ బ్యూరో: దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు అధునాతన టెక్నాలజీయే పరిష్కార మార్గాలు చూపుతుందని టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా అన్నారు. విద్యుత్, సురక్షిత త్రాగునీరు, పరి సరాల పరిశుభ్రత, ఆరోగ్యానికి సంబంధించిన అనే క ఇబ్బందులను టెక్నాలజీ ద్వారా అధిగమించవచ్చని ఆయన తెలిపారు.
సోమవారం నగరంలోని ఒక హోటల్లో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రతన్ టాటా, ఏపీ సీఎం చంద్రబాబుతో పారిశ్రామికవేత్తల ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు రతన్టాటా సమాధానం చెప్పారు. టాటా ట్రస్ట్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టే పలు సామాజిక ప్రాజెక్టుల ఎంఓయూకు తాను మద్దతిస్తానని తెలిపారు. తొలుత సీఎం మాట్లాడుతూ భారతదేశం, ఇక్కడి పరిశ్రమలకు రతన్టాటా సింబల్గా ఉన్నారని, ఆయన దేశానికి ఒక ఐకాన్ అని ప్రశంసించారు.
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం...
రాష్ట్ర ప్రభుత్వంతో టాటా ట్రస్టు చేసుకున్న ఒప్పందం ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందని రతన్టాటా అన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 264 గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా ట్రస్టుతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామీణాభివృద్ధి అదనపు కార్యదర్శి శాంతిప్రియపాండె, టాటా ట్రస్టు సీఈవో ఆర్.వెంకట్రామన్లు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు.
బ్రాండ్ అంబాసిడర్గా ఉండలేను: రతన్
ఏపీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని సీఎం చేసిన విజ్ఞప్తిని టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా తిరస్కరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేర కు క్యాంప్ ఆఫీసులో జరిగిన సమావేశంలో రాష్ట్రాని కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని బాబు టాటాను కోరినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనను రతన్ టాటా సున్నితంగా తిరస్కరించారు.
వ్యాపారాభివృద్ధికి కావాల్సిన సలహాలు ఇస్తానని చెప్పారు. పారిశ్రామికవేత్తల సమావేశంలోనూ పలువురు ఏపీలో టీసీఎస్ కంపెనీని ఏర్పాటు చేయాలని కోరగా ఇప్పుడు టాటా గ్రూపునకు తాను చైర్మన్ను కాదని, ఈ ప్రతిపాదనను గ్రూపునకు సూచిస్తానని చెప్పారు.
టెక్నాలజీయే పరిష్కార మార్గం
Published Tue, Aug 25 2015 1:45 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement